భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫేమ్ ఇండియా ప‌థ‌కం కింద త‌ప్పుగా క్లెయిమ్ చేసిన స‌బ్సిడీల పై జ‌రిమానా

Posted On: 01 AUG 2023 2:21PM by PIB Hyderabad

 భారీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) గ‌త 18 నెల‌లుగా ఎఫ్ఎఎంఇ (ఫేమ్‌) ఇండియా ప‌థ‌కం ఫేజ్‌-2 కింద 17 ఒఇఎంల‌పై ప్ర‌ధానంగా రెండు అంశాల‌కు సంబంధించి పిఎంపి అనువ‌ర్త‌నం & ఫ్యాక్ట‌రీ ఇంత‌కు ముందు ధ‌ర‌కు సంబంధించి ఫిర్యాదుల‌ను అందుకుంది. అద‌నంగా, వివ‌ర‌ణాత్మ‌క ప‌రిశోధ‌న‌లు అవ‌స‌ర‌మైన చోట ఆ ఫిర్యాదుల విష‌యంలో ప్రోత్సాహ‌కాల చెల్లింపుల‌ను నిలిపివేశారు. ఆరోపిత ఒరిజిన‌ల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ (ఒఇఎంలు- మూల ప‌రిక‌రాల త‌యారీదారుల)పై వ‌చ్చిన ఫిర్యాదుల విచార‌ణ కోసం ఎంహెచ్ఐ దిగువ‌న పేర్కొన్న చ‌ర్య‌లు చేప‌ట్టిందిః 
డిమాండ్ ప్రోత్సాహ‌కాల పంపిణీని నిలిపివేయ‌డం
వివ‌ర‌ణాత్మ‌క లేదా లోతైన ప‌రిశోధ‌న కోసం ఎంహెచ్ఐ టెస్టింగ్ ఏజెన్సీల‌కు విష‌యాన్ని సూచించ‌డం
ఆరోపిత ఒఇఎంలకు టెస్టింగ్ ఏజెన్సీల నుంచి ప‌రిశీల‌నా నివేదిక‌లు వ‌చ్చిన త‌ర్వాత‌, ఇందులో ఆరు ఒఇఎంలు పూర్తిగా పిఎంపి అమ‌లు చేస్తుండ‌గా, ఏడు ఒఇఎంలు పిఎంపి నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న‌ట్టు తేలింది.
అద‌నంగా, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఇవిలు) వినియోగ‌దారులు/  కొనుగోలుదారుల‌కు ఫ్యాక్ట‌రీ పాత ధ‌ర‌ను ఉల్లంఘించినందుకు అద‌న‌పు మొత్తాన్ని తిరిగి ఇవ్వ‌డానికి నాలుగు ఒఇఎంలు అంగీక‌రించాయి. 
ఈ స‌మాచారాన్ని భారీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి శ్రీ క్రిష‌న్ పాల్ గుర్జ‌ర మంగ‌ళ‌వారం లోక్‌స‌భకు ఇచ్చిన లిఖిత పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు. 


***


(Release ID: 1944860)
Read this release in: English , Urdu