పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ కనుమల రక్షణకు పథకాలు

Posted On: 31 JUL 2023 5:38PM by PIB Hyderabad

   శ్చిమ కనుమల పరిధిలోనివి సహా దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో  అటవీ, వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ దిశగా పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు  మంత్రిత్వ శాఖ అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో జాతీయ అటవీకరణ కార్యక్రమం, వన్యప్రాణి ఆవాసాల సమగ్రాభివృద్ధి, కార్చిచ్చు నివారణ-నిర్వహణ, పులుల పథకం, హరిత భారతం కోసం జాతీయ కార్యక్రమం కూడా అంతర్భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా పశ్చిమ కనుమలలో అటవీ-వన్యప్రాణి సంరక్షణ నిమిత్తం నష్టపూరక అటవీకరణ నిర్వహణ-ప్రణాళిక (కంపా) ప్రాధికార సంస్థ పరిధిలోగల నిధులు కూడా వినియోగించబడతాయి.

   పశ్చిమ కనుమల రక్షణ-సంరక్షణ లక్ష్యంగా మంత్రిత్వశాఖ ప్రొఫెసర్‌ మాధవ్ గాడ్గిల్ నేతృత్వాన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల బృందం (డబ్ల్యూజిఇఇపి), దం, డాక్టర్ కె.కస్తూరిరంగన్ నాయకత్వంలో ఉన్నత స్థాయి కార్యాచరణ బృందం (హెచ్‌ఎల్‌డబ్ల్యూజి) పేరిట రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. అనంతరం ‘డబ్ల్యూజిఇఇపి’ సిఫారసులను ‘హెచ్‌ఎల్‌డబ్ల్యూజి’ సమీక్షించి, ఒక నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా జీవశాస్త్రపరంగా/ సాంస్కృతికంగా విభిన్న ప్రాంతాలను పర్యావరణ-సున్నిత ప్రదేశంగా ప్రకటిస్తూ, వాటి రక్షణ-సంరక్షణ లక్ష్యంగా 2014 మార్చి 10న మంత్రిత్వశాఖ ఒక ముసాయిదా ప్రకటన జారీచేసింది. దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు/సమస్యలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ప్రజల/ఇతర భాగస్వాముల ఆందోళనలు/సందేహాలను పరిష్కరిస్తూ పశ్చిమ కనుమల పర్యావరణ-సున్నిత ప్రదేశం ముసాయిదాను ఐదోసారిగా 2022 జూలై 6న తిరిగి ప్రకటించింది. ఈ ముసాయిదా ప్రకటన 2024 జూన్ 30దాకా అమలులో ఉంటుంది. ఈ గడువులోగా సదరు ప్రకటన ఖరారు దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల కోసం ఒక ప్రత్యేక కమిటీని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

   ఈ మేరకు కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు  శాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీ కుమార్‌ చౌబే ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

*****


(Release ID: 1944616)
Read this release in: English , Urdu