వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కెఎంఎస్‌ 2022-23లో వరిసేకరణ ద్వారా లబ్ధి పొందిన 12492430 మంది రైతులు


కెఎంఎస్‌ 2022-23లో 846.38 ఎల్‌ఎంటి వరి సేకరణ

Posted On: 26 JUL 2023 3:04PM by PIB Hyderabad

కెఎంఎస్‌ 2022-23 సమయంలో సెంట్రల్ పూల్ కోసం ఎంఎస్‌పి వద్ద వరి సేకరణ ద్వారా లబ్ది పొందిన రైతుల సంఖ్య, రాష్ట్రాల వారీగా

అనుబంధం-Iలో ఉంది.

సేకరణ అనేది ఉత్పత్తిపై మాత్రమే కాకుండా విక్రయించదగిన మిగులు, ఎంఎస్‌పి, ప్రస్తుత మార్కెట్ రేటు, డిమాండ్ & సరఫరా పరిస్థితి మరియు ప్రైవేట్ వ్యాపారుల భాగస్వామ్యం వంటి ఇతర బహుళ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

గత 5 సంవత్సరాల వరి సేకరణ వివరాలు అనుబంధం-IIలో ఉన్నాయి.

దేశంలో వరి సేకరణను మెరుగుపరచడానికి ఈ క్రింది చర్యలు తీసుకోబడ్డాయి:

(i) వరి సేకరణ అంచనాలను అంచనా వేసిన ఉత్పత్తి, విక్రయించదగిన మిగులు మరియు వ్యవసాయ పంటల నమూనా ఆధారంగా ప్రతి మార్కెటింగ్ సీజన్ ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎఫ్‌సిఐతో సంప్రదించి భారత ప్రభుత్వంచే ఖరారు చేయబడుతుంది.

(ii) ఉత్పత్తి, విక్రయించదగిన మిగులు, రైతుల సౌలభ్యం మరియు నిల్వ మరియు రవాణా వంటి ఇతర లాజిస్టిక్స్ / మౌలిక సదుపాయాల లభ్యతను పరిగణనలోకి తీసుకుని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు/ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరవబడతాయి. ప్రస్తుతం ఉన్న మండీలు మరియు డిపోలు / గోడౌన్‌లు రైతుల కోసం ప్రధాన కేంద్రాలలో కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

(iii) రైతులు తమ ఉత్పత్తులను నిర్దేశాలకు అనుగుణంగా తీసుకురావడానికి వీలుగా నాణ్యతా నిర్దేశాలు మరియు కొనుగోలు వ్యవస్థ మొదలైన వాటిపై అవగాహన కల్పించారు.

(iv) ఎఫ్‌సిఐ మరియు సేకరించే అన్ని రాష్ట్రాలు సరైన నమోదు మరియు వాస్తవ సేకరణ పర్యవేక్షణ ద్వారా రైతులకు పారదర్శకత మరియు సౌకర్యాన్ని అందించడానికి వారి స్వంత ఆన్‌లైన్ సేకరణ వ్యవస్థను అభివృద్ధి చేశాయి.

(v) కొనుగోలు చేసే ఏజెన్సీల ద్వారా అమలు చేయబడిన ఇ-ప్రొక్యూర్‌మెంట్ మాడ్యూల్ ద్వారా  రైతులు..ప్రకటించిన ఎంఎస్‌పి, సమీప కొనుగోలు కేంద్రం, తన ఉత్పత్తులను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల్సిన తేదీ మొదలైన వాటికి సంబంధించిన తాజా/నవీకరించబడిన సమాచారాన్ని పొందుతారు. ఇది రైతులకు స్టాక్ డెలివరీని సులభతరం చేస్తుంది మరియు మండిలో స్టాక్‌ను సౌకర్యవంతంగా బట్వాడా చేయడానికి వీలు కల్పిస్తుంది.

(vi) ఆర్‌ఎంఎస్‌ 2021-22 నుండి దేశవ్యాప్తంగా "డిబిటి ద్వారా ఒక దేశం, ఒక ఎంఎస్‌పి" విధానం అమలు చేయబడుతోంది.ఎంఎస్‌పి చెల్లింపు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయబడిందని నిర్ధారించబడుతుంది. ఈ డిబిటి కల్పిత రైతులను తొలగించింది మరియు రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా చెల్లింపు చేయబడుతున్నందున చెల్లింపు మళ్లింపు మరియు డూప్లికేషన్‌ను తగ్గించింది. ఎంఎస్‌పి యొక్క డిబిటి  వ్యవస్థలో బాధ్యత, పారదర్శకత, నిజ సమయ పర్యవేక్షణ కల్పించడంతో పాటు అక్రమాలను తగ్గించింది.

 

***



(Release ID: 1943086) Visitor Counter : 103


Read this release in: English , Marathi , Tamil , Manipuri