గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద లబ్ధిదారులు-
Posted On:
25 JUL 2023 2:28PM by PIB Hyderabad
గ్రామీణ ప్రాంతాల్లో “అందరికీ ఇళ్లు” లక్ష్యాన్ని సాధించడానికి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పీఎంఏవైజీ)ని 1 ఏప్రిల్, 2016 నుండి అమలు చేస్తోంది. మార్చి, 2024 నాటికి ప్రాథమిక సౌకర్యాలతో కూడిన 2.95 కోట్ల పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2.95 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యసాధనలోభాగంగా వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా మొత్తం 2.92 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు చేయబడ్డాయి. అంతేకాకుండా 2.41 కోట్ల ఇళ్ల నిర్మాణాలు 19.07.2023 నాటికి పూర్తయ్యాయి.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పీఎంఏవైజీ) కింద.. సాంఘిక, ఆర్థిక, కుల గణన (ఎసీఈసీసీ) 2011 ప్రకారం నిర్దేశించబడిన ఇళ్లు లేని పారమితుల( పారామీటర్స్) ఆధారంగా లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. గ్రామసభ ద్వారా తగిన ధృవీకరణ పొందడం, అప్పీలేట్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, గ్రామ పంచాయతీ వారీగా శాశ్వత నిరీక్షణ జాబితా (పర్మినెంట్వెయిటింగ్ లిస్ట్) సిద్ధమైంది. సాంఘిక, ఆర్థిక, కుల గణన, 2011 డేటాబేస్ నుండి స్వయంచాలకంగా(ఆటోజనరేటెడ్) రూపొందించబడిన గృహాల ప్రాధాన్యత జాబితా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు (యూటీలు) శాశ్వత నిరీక్షణ జాబితా (పర్మినెంట్వెయిటింగ్ లిస్ట్)ను ఖరారు చేయడానికి గ్రామ సభ సమావేశాలను నిర్వహించడం కోసం అందించబడింది. 19.07.2023 నాటికి, సాంఘిక, ఆర్థిక, కుల గణన (ఎసీఈసీసీ), 2011 నుండి మొత్తం 2.04 కోట్ల కుటుంబాలు గుర్తించబడ్డాయి వాటిని శాశ్వత నిరీక్షణ జాబితా (పర్మినెంట్వెయిటింగ్ లిస్ట్)లో చేర్చబడ్డాయి. ఇంకా, సాంఘిక, ఆర్థిక, కుల గణన (ఎసీఈసీసీ)2011 ఆధారిత శాశ్వత నిరీక్షణ జాబితా (పర్మినెంట్వెయిటింగ్ లిస్ట్) నుండి తొలగించబడ్డాయి. అంతేకాకుండా పర్మినెంట్వెయిటింగ్ లిస్ట్లో చేర్చడానికి అర్హత ఉన్నటువంటి కుటుంబాల వివరాలు, ఆవాస్+ సర్వే, 2018లో క్యాప్చర్ చేయబడ్డాయి. జనవరి, 2018 మార్చి 7 నుంచి 2019 వరకు ఈ సర్వే నిర్వహించబడింది. ఈ కసరత్తులో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు కుటుంబాల వివరాలను అప్లోడ్ చేశాయి. 91 లక్షల ఇళ్ల (2.95 కోట్లు -2.04 కోట్లు) ఖాళీని పూడ్చేందుకు ఆవాస్+ డేటాను వినియోగిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 91 లక్షల లక్ష్యాన్ని కేటాయించారు.
ప్రధానమంత్రి ఆవాస్యోజన గ్రామీణ యొక్క పర్యవేక్షణ ఎంఐఎస్లో వర్క్ ఫ్లో ఎనేబుల్డ్ లావాదేవీల డేటాను ఉపయోగించి పురోగతి రియల్ లైమ్ క్యాప్చర్ ద్వారా జరుగుతుంది. ప్రక్రియ పర్యవేక్షణ కోసం, కేంద్ర బృందాలు .. ఏరియా ఆఫీసర్లు మరియు జాతీయ స్థాయి మానిటర్లు (ఎన్ఎల్ఎం) తనిఖీని నిర్వహిస్తాయి. పార్లమెంట్ సభ్యుడు, సోషల్ ఆడిట్ మొదలైన వారి నేతృత్వంలోని జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ (దిశ) కమిటీ పర్యవేక్షణ కూడా జరుగుతుంది.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ స్థాయి పర్యవేక్షణ వ్యవస్థ అనేది దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణతో సహా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు/పథకాల అమలును క్రమం తప్పకుండా అంచనా వేయడానికి పని చేసే మూడవ పక్షం పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్ యంత్రాంగం.
ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మంగళవారం లోక్సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
***
(Release ID: 1943019)