హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్ము&కశ్మీర్‌లో చొరబాట్లు

Posted On: 25 JUL 2023 4:54PM by PIB Hyderabad

భారతదేశ సరిహద్దుల వెంబడి చొరబాట్లను నివారించడానికి భారత ప్రభుత్వం మంచి సమన్వయంతో కూడిన, బహుముఖ వ్యూహాన్ని అవలంబించింది. అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)/నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద బలగాల వ్యూహాత్మక మోహరింపు; నిఘా కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు, హీట్ సెన్సింగ్ పరికరాలు మొదలైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం; ఐబీ/ఎల్‌వోసీ వెంబడి బహుళ స్థాయుల్లో మోహరింపులు; సరిహద్దుల్లో కంచెలు; చొరబాట్లపై ముందస్తు సమాచారం సేకరించేందుకు నిఘా సిబ్బందిని నియమించడం; సైనిక/సరిహద్దు రక్షణ దళం (బీఎస్‌ఎఫ్‌) ద్వారా ఆకస్మిక దాడులు, కాలి నడక పహారా; స్థానికంగా నిఘా పెంచడానికి, చొరబాటుదార్లపై వేగంగా చర్యలు తీసుకోవడానికి సరిహద్దు పోలీసు కేంద్రాల ఏర్పాటు వంటివి ఈ వ్యూహంలో భాగం.

భారత ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల సరిహద్దుల వెంబడి చొరబాట్లు గణనీయంగా తగ్గాయి. సంవత్సరం వారీగా ఆ వివరాలు ఇవి:

సంవత్సరం

2019

2020

2021

2022

2023 (జూన్ 30 వరకు)

నికర చొరబాట్లు

141

51

34

14

00

 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్‌ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని తెలిపారు.

 

*****


(Release ID: 1942636) Visitor Counter : 76
Read this release in: Urdu , English , Tamil