గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పిఎంఎవై -(యు) కింద పేద కుటుంబాలకు పక్కా గృహాలు
Posted On:
24 JUL 2023 5:49PM by PIB Hyderabad
గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఒహెచ్యుఎ) దేశవ్యాప్తంగా అర్హులైన పట్టణ లబ్ధిదారులందరికీ ప్రాథమిక సౌకర్యాలతో కూడిన పక్కా గృహాన్ని అందించడానికి 25.06.2015 నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన -అర్బన్ (పిఎంఎవై- యు)ని అమలు చేస్తోంది. పథకం మార్గదర్శకాల ప్రకారం అర్హత ప్రమాణాల ఆధారంగా లబ్ధిదారుల నేతృత్వంలో నిర్మాణం (బిఎల్సి), సరసమైన ధరల్లో భాగస్వామ్య గృహాలు (ఎహెచ్పి), యధాస్థానంలో మురికివాడల పునఃఅభివృద్ధి (ఐఎస్ఎస్ఆర్), పరపతి అనుసంధానిత రాయితీ పథకం (సిఎల్ఎస్ఎస్) అనే నాలుగు అనుసంధానాల ద్వారా ఈ పథకం అమలు చేస్తారు. పిఎంఎవై-యు కింద నేటి వరకూ 118.90 లక్షల ఇళ్ళను మంజూరు చేశారు. మంజూరు చేసిన గృహాలలో, 112.22 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభం కాగా అందులో 75.31 లక్షల ఇళ్ళను పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించడం జరిగింది. గత మూడేళ్ళలో 45.43 లక్షల గృహాలను మంజూరు చేయగా, 46.04 లక్షల ఇళ్ళను నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇందులో 5.92 లక్షల ఇళ్ళను ముందు సంవత్సరాలలో మంజూరు చేశారు. గత మూడేళ్ళలో 39.63 లక్షల ఇళ్ళను పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించారు.
రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో నియమిత నోడల్ ఏజెన్సీల ద్వారా పిఎంఎవై-యు పథకం అమలు చేస్తున్నారు. పథక మార్గదర్శకాల ప్రకారం వివిధ వాటాదారుల నుంచి పధకం అమలు చేయడంలో ఫిర్యాదులు/ వ్యత్యాసాలను పరిష్కరించడానికి రాష్ట్ర, నగర స్థాయిలో తగిన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకు అదనంగా, తగిన లబ్ధిదారుల ఎంపిక కోసం, రాష్ట్ర/ యుటిల స్థాయిలో ఆమోదం కోసం బహుళ స్థాయిల్లో లబ్ధిదారుల జాబితా పరిశీలన జరుగుతుంది.
పిఎంఎవై పథకం అమలులో అవకతవకలు/ వ్యత్యాసాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు, సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణా చర్యతో సహా తగిన చర్యల కోసం సంబంధిత రాష్ట్ర/ యుటికి ఆ ఫిర్యాదులను పంపుతారు. అదనంగా, పిఎంఎవై-యుతో సహా సేవల బట్వాడాకు సంబంధించిన ఏదైనా విషయంపై ప్రభుత్వ అధికారులకు తమ ఫిర్యాదులను చేయడానికి కేంద్రీకృత ప్రజా ఫిర్యాదులు & పర్యవేక్షణ వ్యవస్థ (సిపిజిఆర్ఎఎంఎస్) పౌరులకు అందుబాటులో ఉంది.
ఈ సమాచారాన్ని సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ కౌశల్ కిషోర్ తెలియచేశారు.
***
(Release ID: 1942392)