పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జీఎఫ్‌ఏ విధానం 2008 ప్రకారం ఈశాన్య ప్రాంతంలో రెండు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం

Posted On: 24 JUL 2023 2:46PM by PIB Hyderabad
  • ఉడాన్‌ పథకం కింద, ఈశాన్య ప్రాంతంలో 10 విమానాశ్రయాల ప్రారంభం/పునరుద్ధరణ జరిగింది.

 

దేశంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి విధానాలు, నిబంధనలను నిర్దేశించే గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల విధానం (జీఎఫ్‌ఏ) 2008ను భారత ప్రభుత్వం రూపొందించింది. ఇది రెండు దశల ప్రక్రియ. మొదట 'భూ అనుమతులు', ఆ తర్వాత 'సూత్రప్రాయ ఆమోదం' ఉంటాయి.

జీఎఫ్‌ఏ విధానం 2008 కింద, అసోంలోని డోలులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి 'భూ అనుమతులు' మంజూరు కోసం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఒక దరఖాస్తు సమర్పించింది. జీఎఫ్‌ఏ పాలసీ ప్రకారం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), రక్షణ మంత్రిత్వ శాఖ సహా సంబంధిత వాటాదార్లకు ఈ ప్రతిపాదన పంపడం జరిగింది. వాటాదార్లతో సంప్రదింపులు పూర్తయిన తర్వాత, భూ అనుమతుల మంజూరుకు సంబంధించిన సిఫార్సు కోసం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల స్టీరింగ్ కమిటీ ముందు ఈ ప్రతిపాదనను ఉంచాలి.

జీఎఫ్‌ఏ పాలసీ 2008 ప్రకారం, ప్రాజెక్ట్ నిధులు, భూ సేకరణ, ఆర్‌&ఆర్‌ సహా విమానాశ్రయ ప్రాజెక్టుల అమలు బాధ్యత సంబంధిత విమానాశ్రయ అభివృద్ధి సంస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై (ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే) ఉంటుంది. భూ సేకరణ, తప్పనిసరి అనుమతులు పొందడం, అడ్డంకులు అధిగమించడం, ఆర్థికాంశాలు వంటి వివిధ అంశాలపై విమానాశ్రయాల నిర్మాణం ఆధారపడి ఉంటుంది.

ఈశాన్య ప్రాంతంలోని పాక్యాంగ్‌, ఇటానగర్‌లో (హొల్లోంగి) గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను జీఎఫ్‌ఏ విధానం 2008 కింద నిర్మించడం జరిగింది.
 

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్‌సీఎస్‌) ఉడాన్‌ను (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) 21-10-2016న ప్రారంభించింది. ఈశాన్య ప్రాంతం సహా దేశంలోని అన్ని ప్రాంతాలకు విమాన రాకపోకలు కల్పించేందుకు,  ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది.
 

ఉడాన్ పథకం కింద, ఈశాన్య ప్రాంతంలోని పస్సిఘాట్, తేజు, ఇటానగర్ (హోలోంగి), జోర్హాట్, లీలాబరి, రూప్సీ, తేజ్‌పూర్, షిల్లాంగ్ (బారాపాని), దిమాపూర్, పాక్యాంగ్‌లో 10 విమానాశ్రయాలు ప్రారంభమయ్యాయి/పునరుద్ధరించడం జరిగింది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె.సింగ్ (విశ్రాంత) ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 1942119)
Read this release in: Manipuri , English , Urdu , Tamil