భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
20 గిగా వాట్ అవర్ ‘అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్’ (ఏసీసీ) తయారీకి రీ-బిడ్డింగ్
- ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద “అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్పై జాతీయ కార్యక్రమం”
- రీ-బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు వారి ఇన్పుట్లు మరియు సూచనల కోసం జూలై 24, 2023న పరిశ్రమ ప్రతినిధులతో వాటాదారుల సంప్రదింపులను సులభతరం చేయనున్న ఎంహెచ్ఐ
Posted On:
20 JUL 2023 3:19PM by PIB Hyderabad
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద (పీఎల్ఐ) 20 గిగా వాట్ అవర్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) తయారీకి భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) రీ-బిడ్డింగ్ను ప్రకటించింది. దరఖాస్తుదారులు అధునాతన కెమిస్ట్రీ సెల్ ఏర్పాటు కోసం దేశీయ తయారీ సదుపాయానికి తమ బిడ్లను సమర్పించవచ్చు. ఇది ఏసీసీ పీఎల్ఐ పథకం కింద ప్రోత్సాహకాల కోసం అర్హత పొందడంలో వారికి సహాయపడుతుంది. దేశీయ తయారీపై ఆధారపడటాన్ని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం తద్వారా.. తోటి భారతీయులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించడం దీని లక్ష్యం. ఆత్మనిర్భర్ భారత్ యొక్క ప్రధాన మంత్రి దార్శనికతతో ఈ చొరవ చేపట్టడమైంది. దీనికి సంబంధించి వాటాదారులను ఆహ్వానిస్తూ పబ్లిక్ నోటీసు లింక్- https://heavyindustries.gov.in/writereaddata/UploadFile/Notice-and-Questionnaire-for-ACC.pdf జారీ చేయబడింది. సంప్రదింపులకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. బిడ్డింగ్ డాక్యుమెంట్లను ఖరారు చేయడానికి మరియు రీబిడ్డింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా కొనసాగించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. ఏసీసీలు కొత్త తరం ఆధునిక నిల్వ సాంకేతికతలు. ఇవి విద్యుత్ శక్తిని ఎలక్ట్రోకెమికల్గా లేదా రసాయన శక్తిగా నిల్వ చేయగలవు. మరియు అవసరమైనప్పుడు దానిని తిరిగి విద్యుత్ శక్తిగా మార్చగలవు. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రధాన అనువర్తనాలను కలిగి ఉన్నాయి, గ్రిడ్ స్థిరత్వం, సోలార్ రూఫ్టాప్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటిని నిర్వహించడంలో దోహదం చేస్తాయి. పునరుత్పాదక ఇంధనం పట్ల భారతదేశం యొక్క నిబద్ధతతో మరియు 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడంతో, మొత్తం శక్తి పర్యావరణ వ్యవస్థలో శక్తి నిల్వ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. మే 2021లో, ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం యాభై (50) గిగా వాట్ అవర్ ఏసీసీ మరియు 5 గిగా వాట్ అవర్ "నిచ్" ఏసీసీ తయారీకి తయారీ సామర్థ్యాన్ని సాధించడానికి రూ.18,100 కోట్లతో 'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్'పై ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని ఆమోదించింది. ఏసీసీ పీఎల్ఐ బిడ్డింగ్ యొక్క మొదటి రౌండ్ మార్చి 2022లో ముగిసింది. మూడు కంపెనీలకు మొత్తం 30 (30) గిగా వాట్ అవర్ సామర్థ్యం కేటాయించబడింది. ఎంపిక చేసిన కంపెనీలతో ప్రోగ్రామ్ ఒప్పందం జూలై 2022లో సంతకం చేయబడింది.
*****
(Release ID: 1941264)