సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

భారత్ పెన్షనర్స్ సమాజ్ సభ్యులతో వారి కార్యాలయంలో సెక్రటరీ (పి&పిడబ్ల్యూ) ప్రసంగించారు; పెన్షనర్ల సంక్షేమం మరియు "ఈజ్ ఆఫ్ లివింగ్" కోసం నిరంతరం కృషి చేసేందుకు భారత ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

Posted On: 08 JUL 2023 3:45PM by PIB Hyderabad

 

భారత ప్రభుత్వ పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ లబ్దిదారుల 'ఈజ్ ఆఫ్ లివింగ్'ని పెంపొందించే ఉద్దేశ్యంతో పెన్షనర్ల సంక్షేమాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా పింఛనుదారులందరికీ చేరువయ్యేలా చర్యలు తీసుకోవడం మరియు డిఒపిపిడబ్ల్యూ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం, తద్వారా పెన్షనర్లు అందరూ వారి కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ ప్రయోజనాలను ఉపయోగించుకునేలా చేయడం కోసం ఇది నిరంతర ప్రయత్నం.

డిఒపిపిడబ్ల్యూ పెన్షనర్‌లకు ఆన్‌లైన్ మోడ్‌లో అలాగే ఇంటరాక్టివ్ సమావేశాల ద్వారా సమాచారాన్ని అందించడానికి మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి అలాగే వారు అందించే సూచనలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పెన్షనర్స్ పోర్టల్ కింద డిఒపిపిడబ్ల్యూ దేశవ్యాప్తంగా 50 పెన్షనర్స్ అసోసియేషన్లను నమోదు చేసింది.

 

image.png


డిఒపిపిడబ్ల్యూ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ సంఘాలతో ఆన్‌లైన్‌తో పాటు భౌతికంగా కూడా క్రమ వ్యవధిలో సమావేశాలు నిర్వహించబడతాయి. రిజిస్టర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అయిన భారత్ పెన్షనర్స్ సమాజ్‌తో అలాంటి ఒక సమావేశం జరిగింది. ఇందుకోసం శ్రీ వి శ్రీనివాస్, సెక్రటరీ (పి&పిడబ్ల్యు), డిఒపిపిడబ్ల్యు అదనపు కార్యదర్శి శ్రీ సంజీవ్ నారాయణ్ మాథుర్ మరియు డిఒపిపిడబ్ల్యుకి చెందిన ఇతర అధికారులు ఢిల్లీలోని జంగ్‌పురాలోని అసోసియేషన్ కార్యాలయాన్ని 7 జూలై, 2023న సందర్శించారు.

ఇంటరాక్షన్ సందర్భంగా, సెక్రటరీ (పి&పిడబ్ల్యు) దేశవ్యాప్త డిఎల్‌సి క్యాంపెయిన్ నిర్వహిణ, సిసిఎస్ (పెన్షన్) రూల్స్, 2021 సంకలనం, పెన్షన్ సంబంధిత సమాచారాన్ని అందించడానికి ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అభివృద్ధితో సహా శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి అసోసియేషన్ సభ్యులకు వివరించారు. ఒకే పోర్టల్ నుండి పెన్షనర్లకు, ఫిర్యాదుల స్పాట్ రిజల్యూషన్ మరియు అనుభవ్ అవార్డుల కోసం దేశవ్యాప్తంగా పెన్షన్ అదాలత్‌లు, వితంతువులు, అవివాహితులు, విడాకులు తీసుకున్న కుమార్తెలకు పింఛను వంటి పింఛనుదారుల ప్రయోజనాల కోసం రూపొందించిన వివిధ విధానాలపై చర్చించారు.

డిఒపిపిడబ్ల్యు అదనపు కార్యదర్శి శ్రీ సంజీవ్ నారాయణ్ మాథుర్ ఈ సమావేశంలో ఆసుపత్రిలో చేరిన  పెన్షనర్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ మారుమూల ప్రాంతాల్లోని పెన్షనర్లను చేరుకోవడానికి దేశవ్యాప్తంగా డిఎల్‌సి ప్రచారాన్ని నిర్వహించడానికి సంబంధించిన కార్యక్రమం గురించి వివరించారు. అంతకుముందు 2022 నవంబర్‌లో దేశవ్యాప్తంగా 37 ప్రదేశాలలో జరిగిన డిఎల్‌సి క్యాంపెయిన్ 35 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ఉత్పత్తిని ప్రారంభించిందని, నవంబర్ 2023లో 100 ప్రదేశాలలో ఇదే విధమైన ప్రచారాన్ని నిర్వహించాలని ప్రతిపాదించబడిందని ఆయన తెలియజేశారు. పింఛనుదారుల సంఘాలు డిపార్ట్‌మెంట్ యొక్క విస్తృత విభాగంగా చురుకుగా పాల్గొంటాయి.

 

image.png


భారత్ పెన్షనర్స్ సమాజ్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎస్‌.సి. మహేశ్వరి సభ్యుల డైరెక్టరీని నిర్వహించడం, సమాచారాన్ని వ్యాప్తి చేయడం మరియు వాట్సప్‌ గ్రూప్‌లు, వార్తాలేఖలు, అసోసియేషన్ వెబ్‌సైట్ మరియు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సభ్యులతో సంభాషించడం వంటి అసోసియేషన్ యొక్క ఉత్తమ పద్ధతులను పంచుకున్నారు.  అసోసియేషన్ చేపట్టిన వివిధ కార్యకలాపాల గురించి వివరణాత్మక సమాచారాన్ని ఆయన అందించారు. ప్రతిపాదిత దేశవ్యాప్త డిఎల్‌సి ప్రచారంతో సహా డిఒపిపిడబ్ల్యుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలలో పూర్తి మద్దతు మరియు భాగస్వామ్యానికి హామీ ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు తమకు వచ్చిన పింఛను సంబంధిత ఫిర్యాదుల స్వభావానికి సంబంధించి ఫీడ్‌బ్యాక్‌ను అందించారు మరియు అటువంటి ఫిర్యాదులు ఉత్పన్నమయ్యే సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవడానికి చర్చ జరిగింది.

సమావేశం అనంతరం శ్రీ వి శ్రీనివాస్, సెక్రటరీ (పి అండ్ పిడబ్ల్యు), డిఒపిపిడబ్ల్యు అదనపు కార్యదర్శి శ్రీ సంజీవ్ నారాయణ్ మాథుర్, భారత్ పెన్షనర్స్ సమాజ్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎస్ సి మహేశ్వరి మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు ఢిల్లీలోని జంగ్‌పురాలో మామిడి మొక్కను నాటారు.


 

<><><><>



(Release ID: 1938357) Visitor Counter : 120


Read this release in: English , Urdu , Hindi , Tamil