జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

సమర్థవంతంగా నీటిని వినియోగించుకునే లక్ష్యంతో ప్లంబింగ్ అసోసియేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్న నేషనల్ వాటర్ మిషన్


నీటి వినియోగాన్ని ఇంకా సమర్థవంతంగా పెంచడానికి ఈ ఎంఓయూ ఉపయోగపడుతుంది: అర్చన వర్మ, ఏఎస్&ఎండి, ఎన్డబ్ల్యూఎం

నీటి వినియోగాన్ని 135 ఎల్పిసిడి నుండి 60 ఎల్పిసిడికి తగ్గించడం ద్వారా దేశీయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని 50-60% పెంచడం కోసం ఐపిఏ పూర్తి సహకారాన్ని అందిస్తుంది : అధ్యక్షుడు, ఐపిఏ

Posted On: 07 JUL 2023 6:47PM by PIB Hyderabad

భారతదేశం సాకారాత్మకమైన జల వినియోగం బాటలో నడవడానికి బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియెన్సీ (బిడబ్ల్యూయుఈ), నేషనల్ వాటర్ మిషన్ (ఎన్డబ్ల్యూఎం), జల్ శక్తి మంత్రిత్వ శాఖ, ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపిఏ) మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా జల సంరక్షణ అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు నీటి హార్వెస్టింగ్ నిర్మాణాలు, తక్కువ ప్రవాహ పరికరాలు & శానిటరీ వేర్, గ్రే & బ్లాక్ వాటర్ ట్రీట్మెంట్, బిల్ట్ ఎన్విరాన్మెంట్ వాటర్ ఆడిట్ వంటి కార్యక్రమాలు ఈ ఒప్పందం ప్రకారం చేపడతారు. ఎంఓయూపై జలశక్తి మంత్రిత్వ శాఖ, నేషనల్ వాటర్ మిషన్ తరపున అదనపు కార్యదర్శి & మిషన్ డైరెక్టర్ శ్రీమతి అర్చన వర్మ, న్యూఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీ గుర్మిత్ సింగ్ అరోరా సంతకం చేశారు.

 

 

ఈ సందర్భంగా నేషనల్ వాటర్ మిషన్ అడిషనల్ సెక్రటరీ & మిషన్ డైరెక్టర్ శ్రీమతి అర్చన వర్మ మాట్లాడుతూ, నీటి వినియోగానికి బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియెన్సీకి ఇది చారిత్రాత్మకమైన రోజు అని, ఐపిఎ నీటి సెన్సిటివ్, తక్కువ నీటిని వినియోగించే ఫిక్చర్‌లను చురుకుగా ప్రోత్సహిస్తోందని అన్నారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే దాని లక్ష్యాన్ని ప్రోత్సహించడంలో అవగాహన ఒప్పందం సహాయపడుతుందని తెలిపారు.

దేశీయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని 50-60% (నీటి వినియోగాన్ని 135 ఎల్పిసిడి నుండి 60 ఎల్పిసిడికి తగ్గించడం) పెంచడానికి తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీ గుర్మీత్ అరోరా తెలిపారు. నికర జీరో వాటర్ బిల్డింగ్‌ల లక్ష్యాన్ని సాధించడానికి నిర్మించిన పరిసరాలకు (నివాస భవనాలు, హోటళ్లు మొదలైనవి) వాటర్ ఆడిట్‌ను ఆయన మరింత నొక్కి చెప్పారు.

 

జాతీయ వాటర్ మిషన్ లక్ష్యం-4 నీటి వినియోగ సామర్థ్యాన్ని 20% పెంచడం. జలశక్తి మంత్రిత్వ శాఖ జాతీయ వాటర్ మిషన్ లక్ష్యం-4ను సాధించడంలో అవగాహన ఒప్పందంపై సంతకం ఒక ముఖ్యమైన దశ. 24 చాఫ్టర్లు (వివిధ నగరాల్లో), దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్‌లోని 6500 కంటే ఎక్కువ మంది సభ్యులతో జాతీయ నీటి మిషన్, జలశక్తి మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని అమలు చేయడం, ప్రోత్సహించడంపై అవగాహన ఒప్పందం యొక్క నిబంధనలు దృష్టి సారించాయి. 

 

Instagram: 
https://www.instagram.com/reel/CuZNvJ_AlcY/?igshid=MzRlODBiNWFlZA==



(Release ID: 1938120) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi