ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఐటీ హార్డ్వేర్ కోసం పీఎల్ఐ 2.0పై డిజిటల్ ఇండియా డైలాగ్ సెషన్లో ప్రసంగించనున్న మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
02 JUN 2023 5:45PM by PIB Hyderabad
ఐటీ హార్డ్వేర్ కోసం ఇటీవల సవరించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంపై డిజిటల్ ఇండియా డైలాగ్ల సెషన్లో కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖల సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రసంగించనున్నారు. సెషన్కు టెక్ ఎకోసిస్టమ్లోని వాటాదారులు - పరిశ్రమ నిపుణులు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు, స్టార్టప్లు మొదలైనవారు హాజరవుతారు. 17,000 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీ హార్డ్వేర్ కోసం పీఎల్ఐ 2.0 స్కీమ్ను ప్రభుత్వం గత నెలలో క్లియర్ చేసింది. విలువ గొలుసులో పెద్ద పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశీయ తయారీని ప్రోత్సహించడానికి 2021లో మొదటి సారిగా క్లియర్ చేయబడిన స్కీమ్కు బడ్జెట్ను నిధులను రెట్టింపు చేసింది. పాల్గొనే కంపెనీలకు లభించే గరిష్ట ప్రోత్సాహకాలపై పరిమితితో ఇది జూలై 1, 2023 నుండి అమలు చేయబడుతుంది. ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం ద్వారా, ఐటీ హార్డ్వేర్ భాగాలు మరియు ఉప-అసెంబ్లీల స్థానికీకరణను ప్రోత్సహించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలో ఉత్పత్తిని పెంచడానికి దారితీస్తుంది. ఈ పథకం ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పీసీలు, సర్వర్లు, అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ పరికరాలను కవర్ చేస్తుంది. ఈ పథకం మొత్తం రూ.3.35 లక్షల కోట్ల ఉత్పత్తికి దోహదం చేస్తుందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో ₹ 2,430 కోట్ల అదనపు పెట్టుబడిని తీసుకురావడానికి మరియు 75,000 అదనపు ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేస్తున్నారు. ఈ సంప్రదింపులు చట్టం మరియు విధాన రూపకల్పన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంప్రదింపుల విధానానికి అనుగుణంగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం మంత్రి బెంగళూరుకు రానున్నారు.
***
(Release ID: 1929605)
Visitor Counter : 131