సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సాంకేతికతతో నడిచే పాలన 9 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన విశిష్ట లక్షణం అని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.


ముస్సోరీలోని ఎల్ బీ ఎస్ ఎన్ ఎ ఎ లో ఉద్యోగ జీవిత మధ్యంతర శిక్షణ లో పాల్గొనేవారికి కీలక ఉపన్యాసం చేశారు

Posted On: 09 MAY 2023 12:58PM by PIB Hyderabad

మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనలో సాంకేతికతతో నడిచే పాలన ప్రధానమని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్; పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  ఈరోజు అన్నారు.

 

ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బిఎస్‌ఎన్‌ఎఎ)లో ఐఎఎస్ అధికారుల కోసం మిడ్-కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  'గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం' అనే మంత్రం తన పాలనా విధాన మన్న విషయాన్ని చెప్పారు. దానిని సుసాధ్యం చేయడానికి  నిరంతరంగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన ఉపయోగించుకున్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం స్వీయ-ధృవీకరణ లేదా ఇంటర్వ్యూల రద్దును ప్రవేశపెడుతూనే సులభ పాలన ద్వారా జీవన సౌలభ్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తోందని, మరోవైపు ప్రభుత్వం కూడా పాలనా ఆవరణాన్ని పౌర సేవకుల కోసం పని వాతావరణాన్ని సులభతరం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఉదాహరణకు, 30 ఏళ్ల తర్వాత 2018లో మోదీ ప్రభుత్వం సవరించిన అవినీతి నిరోధక చట్టం,1988 గురించి ఆయన ప్రస్తావించారు. దీనిలో అనేక కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతోపాటు లంచం తీసుకోవడంతో పాటు లంచం ఇవ్వడాన్ని కూడా నేరంగా పరిగణించడంతోపాటు, అదే సమయంలో వ్యక్తులు మరియు కార్పొరేట్ సంస్థలచే అటువంటి చర్యలకు సమర్థవంతమైన నిరోధాన్ని ఉంచడం  ద్వారా అధికారులపై అనవసర వేధింపులు నివారించవచ్చని తెలిపారు.

 

అదే విధంగా అధికారులకు తమ పాత్రపై మరింత నమ్మకం కలిగించేందుకు, మిషన్ కర్మయోగి మరియు ఐ గాట్  ప్లాట్‌ఫారమ్‌లను ప్రవేశపెట్టామని, దీని ద్వారా కొత్త అసైన్‌మెంట్‌ను చేపట్టే ఏ అధికారి అయినా కొత్త అసైన్‌మెంట్ కోసం తమంత తాము స్వాభావిక సామర్థ్యాన్ని పెంపొందించుకోగలరని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. అదనంగా, మీరు సంబంధిత కేడర్‌కు వెళ్లే ముందు 3 నెలల అసిస్టెంట్ సెక్రటరీ స్టింట్ మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలుసుకునేందుకు, మార్గదర్శకులను తీర్చిదిద్దేందుకు మీకు అవకాశం ఉందని మంత్రి చెప్పారు.

సాంకేతికతతో నడిచే పాలన యొక్క మరిన్ని కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, డాక్టర్ జితేంద్ర సింగ్, ఆశావహ జిల్లా ఇదే తరహాలో మరొక ప్రయోగం, ఇక్కడ ప్రభుత్వం శాస్త్రీయ ప్రాతిపదికన సూచికలను నిర్ణయించింది. మన డ్యాష్‌బోర్డ్  నిజ సమయంలో నవీకరించబడుతుంది ఖచ్చితంగా అభివృద్ధి లక్ష్య సాధన కోసం నిరంతరం పోటీ జరుగుతోంది.

 

మరొక ముఖ్య లక్షణం ఫిర్యాదుల పరిష్కారం. పారదర్శకత మరియు జవాబుదారీతనం యొక్క ప్రమాణాలలో ఒకటి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మేము సీ పీ గ్రాంస్ ను ప్రవేశపెట్టినప్పుడు 2014లో దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల ఫిర్యాదులు దాఖలయ్యేవి, నేడు అవి దాదాపు 20 లక్షలకు చేరాయి, అంటే 10 రెట్లు ఎక్కువయ్యాయి. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం యొక్క ఫలితం ఇది.

 

పౌరుల భాగస్వామ్యం ఇప్పటికే ప్రారంభమైందని, దానికి అత్యంత అద్భుతమైన ఉదాహరణ స్వామిత్వ పథకం అని మంత్రి అన్నారు. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి భూములను మ్యాపింగ్ చేయడం ద్వారా మరియు చట్టపరమైన యాజమాన్య కార్డులు (ఆస్తి కార్డులు/టైటిల్) జారీ చేయడం ద్వారా  'రికార్డ్ ఆఫ్ రైట్స్' అందించడం ద్వారా గ్రామీణ నివాస (అబాది) ప్రాంతాలలోదస్తావేజులు గ్రామ గృహ యజమానులకు ఆస్తి యజమానులకు ఆస్తిపై స్పష్టమైన యాజమాన్యాన్ని స్థాపించే దిశగా ఇది ఒక సంస్కరణాత్మక అడుగు. 

 

డిజిటల్ పరివర్తన గురించి మంత్రి మాట్లాడుతూ, ఫిబ్రవరి 2023 నాటికి సెంట్రల్ సెక్రటేరియట్‌లోని అన్ని 75 మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో ఇ-ఆఫీస్ వెర్షన్ 7.0 అవలంబించబడింది. మొత్తం సెంట్రల్ సెక్రటేరియట్ ఫైళ్లలో 89.6 శాతం ఈ-ఫైళ్లుగా ప్రాసెస్ చేయబడటం అభినందనీయమైన విజయం. 

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రాబోయే 25 సంవత్సరాలలో, సాంకేతికత మరియు మానవ అనుసందాల మధ్య వాంఛనీయ సమతుల్యతను ఎలా సాధించాలి మరియు ఉత్తమ ఫలితాలను పొందడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మానవ మేధలు రెండింటినీ కలపడం ద్వారా వాటి మధ్య సమతుల్యతను సాధించడం అనేది ఇప్పుడు సవాలుగా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. 

 

మంత్రి మాట్లాడుతూ, రాబోయే 25 సంవత్సరాల పాటు చురుకైన సేవలో పాల్గొనే మరియు 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే ప్రత్యేకతను కలిగి ఉన్న యువ సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇవ్వడానికి వారు భారత ప్రభుత్వంలో 2047 నాటికి ఉన్నత పదవులకు అధిరోహంచేందుకు  అకాడమీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అన్నారు. 

 

లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA) డైరెక్టర్ శ్రీ కె శ్రీనివాస్ తన ప్రసంగంలో, అకాడమీ మిషన్ కర్మయోగి కార్యక్రమానికి అనుగుణంగా మారిందని అన్నారు.

***



(Release ID: 1922822) Visitor Counter : 156