శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రాస్‌రూట్స్ ఆవిష్కర్తలకు వ్యవస్థాపక, ఉత్పత్తి మరియు మార్కెటింగ్‌లో మద్దతు ఇవ్వడానికి గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్స్ యాక్సిలరేటర్ కార్యక్రమం ప్రకటించబడింది

प्रविष्टि तिथि: 12 APR 2023 4:20PM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తున్న ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఫైన్) 2023లో భాగంగా వ్యవసాయంలో అట్టడుగు స్థాయి ఆవిష్కర్తలకు వ్యవస్థాపకత, ఉత్పత్తి మరియు మార్కెటింగ్‌లో మద్దతు అందించడానికి గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రకటించబడింది.

ఏప్రిల్ 11, 2023న ప్రకటించిన ఈ కార్యక్రమం ఎన్‌ఐఎఫ్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కౌన్సిల్ (ఎన్‌ఐఎఫ్‌ఐఈఎన్‌టిఆర్ఈసీ), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) ఇండియా హోస్ట్ చేసిన టీబిఐ మరియు డిజిటల్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ అయిన పబ్లిసిస్ సపిఎంట్ మధ్య భాగస్వామ్యం ఫలితంగా ఏర్పడింది. వ్యవసాయంలో సవాళ్లను పరిష్కరించడానికి అట్టడుగు ఆవిష్కర్తల ఆవిష్కరణలను వాణిజ్యీకరించడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుంది.

 

image.png


ఈ కార్యక్రమం కోసం పైలట్ సాంకేతికతలుగా ఐదు విభిన్న అట్టడుగు ఆవిష్కరణల నమూనాలు గుర్తించబడ్డాయి. వీటిలో పెప్పర్ థ్రెషర్, కోల్ వెజిటబుల్ హార్వెస్టర్, చిన్నస్థాయి పప్పుల మిల్లు, లవంగం మొగ్గ వేరుచేసే యంత్రం మరియు వాల్‌నట్ పీలర్ ఉన్నాయి.ఈ ప్రోటోటైప్‌ల ఆవిష్కర్తలకు ఎండ్-టు-ఎండ్ ఇంక్యుబేషన్ సపోర్ట్ అందించబడుతుంది. దీని ద్వారా కెపాసిటీ బిల్డింగ్, ఫాబ్రికేషన్ ల్యాబ్‌కు యాక్సెస్, రిస్క్ క్యాపిటల్ మరియు మార్కెట్, మరియు ఈ ఇన్నోవేషన్స్ మార్కెట్‌ని వాణిజ్యీకరించడానికి మరియు సిద్ధం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక మద్దతు అందించబడుతుంది.

ఎన్‌ఐఎఫ్‌ఐఈఎన్‌టిఆర్ఈసీ 2015లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ) ఆర్థిక సహకారంతో సాంకేతిక ఆలోచనలు మరియు అట్టడుగు స్థాయి ఆవిష్కర్తలు, అత్యుత్తమ సాంప్రదాయ జ్ఞాన హోల్డర్‌లు మరియు విద్యార్థుల ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి మరియు వాణిజ్యీకరణ కోసం స్థాపించబడింది. హోస్ట్ ఇన్‌స్టిట్యూషన్ ఎన్‌ఐఎఫ్ భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ) విభాగానికి చెందిన స్వయంప్రతిపత్త సంస్థ.

ఈ కార్యక్రమం 2015లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ (ఎస్‌డిజి)9తో సమకాలీకరించబడింది. స్థిరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం, స్థిరమైన పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఎన్‌ఐఎఫ్‌ఐఈఎన్‌టిఆర్ఈసీ వివిధ మార్గాల్లో అట్టడుగు ఆవిష్కర్తలకు మద్దతునిస్తోంది. అలాగే సామాజిక మరియు వాణిజ్య మార్గాల వ్యాప్తి ద్వారా విస్తృత స్వీకరణకు మార్గం సుగమం చేస్తుంది.

ఈ సందర్భంగా ఎన్‌ఐఎఫ్‌ఐఈఎన్‌టిఆర్ఈసీ ఛైర్‌పర్సన్ డాక్టర్ గుల్షన్ రాయ్ మాట్లాడుతూ “ఈ  రకమైన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రోగ్రామ్ వాణిజ్యీకరణ మరియు అట్టడుగు ఆవిష్కరణల స్థాయిని పెంచడం ద్వారా సమాజ అభివృద్ధికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ సాకార దిశగా ఒక అడుగు.."అని చెప్పారు.

భాగస్వామ్యంపై ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ పబ్లిసిస్ సేపియంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ మీనన్ మాట్లాడుతూ “జీవితాలను, సమాజాలను మరియు మొత్తం ప్రపంచాన్ని మంచిగా మార్చే శక్తి సాంకేతికతకు ఉందని మేము నమ్ముతున్నాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎటువంటి నేపథ్యం లేకుండా వారి పూర్తి అభిరుచితో ఈ నమూనాలను నిర్మిస్తున్న వ్యక్తులలో ఆవిష్కరణ స్ఫూర్తిని చూడటం సంతోషంగా ఉంది." అని చెప్పారు.

 

                                                   

<><><><><><>


(रिलीज़ आईडी: 1916058) आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi