ఉక్కు మంత్రిత్వ శాఖ

ఎఐఎంఎ-11వ ప్ర‌గ‌తి జాతీయ స్థాయి క్విజ్ పోటీ -2023లో ప్ర‌థ‌మ బ‌హుమ‌తిని గెలుచుకున్న ఆర్ఐఎన్ఎల్ సీనియ‌ర్ మేనేజ‌ర్లు శిల్పి శ‌ర్మ‌, అన్షికా హోతియాల్‌

Posted On: 24 MAR 2023 4:15PM by PIB Hyderabad

రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్‌) విశాఖ‌ప‌ట్నం, సీనియ‌ర్ మేనేజ‌ర్లు అయిన శిల్పి శ‌ర్మ, ఎస్ఎం (క్యూఎ&టిడి), హ‌న్షికా హోతియాల్ ఎస్ఎం(క్యూఎ&టిడి)లు  శుక్ర‌వారంనాడు నిర్వ‌హించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీ .- 
ఎఐఎంఎ-11వ ప్ర‌గ‌తి క్విజ్ పోటీలు -2023ల‌లో ప్ర‌తిష్ఠాత్మ‌క ప్ర‌థ‌మ బ‌హుమ‌తిని అందుకున్నారు. 
మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే నిర్వ‌హించే అత్యంత ప్రాచుర్యం పొందిన జాతీయ క్విజ్ ఉద్యోగులైన మ‌హిళ‌ల ప్ర‌తిభ‌ను, జ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఒక వేదిక‌ను అందిస్తుంది. 
 ఇందులో భాగంగా ఈ ఏడాది 23.03.2023న స్క్రీనింగ్ రౌండ్ (వ‌డ‌పోత రౌండ్‌)ను నిర్వ‌హించ‌గా, భిన్న సంస్థ‌ల నుంచి 40 టీంలు పాల్గొన్నాయి. ఈ పోటీలో ఆర్ఐఎన్ఎల్ నుంచి రెండు బృందాలు పాల్గొన్నాయి. ఈ క్విజ్‌లో వ్యాపారం, చ‌రిత్ర‌, సైన్స్‌, క్రీడ‌ల గ‌త‌, వ‌ర్త‌మాన‌, స‌మ‌కాలీన రాజ‌కీయాలు, వ్య‌వ‌హారాల క్షేత్రాల స‌మ్మిళిత అంశాలుగా ఉన్నాయి.

 

***



(Release ID: 1910384) Visitor Counter : 123


Read this release in: Urdu , English , Hindi