శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే వేదిక 'హర్స్టార్ట్', ఇటీవల ప్రారంభించబడిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు
మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల కోసం ప్రభుత్వం ఒక సంవత్సరం వరకు ₹20,000 నెలవారీ భత్యాన్ని ప్రారంభించింది: డాక్టర్ జితేంద్ర సింగ్
విద్యాసంస్థలు మరియు పరిశ్రమల మధ్య సంబంధాలను పటిష్టం చేసుకోవడం పరిశ్రమతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం మరియు అత్యాధునిక సాంకేతికతలు మరియు ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మరియు సాధ్యమైనంత తక్కువ సమయంలో వాటిని మార్కెట్ లో ప్రవేశ పెట్టడం ప్రస్తుత అవసరం: డాక్టర్ జితేంద్ర సింగ్
ఆవిష్కరణలకు జన్మ స్థలం గా భారతదేశం వేగంగా మారుతోంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
17 MAR 2023 3:21PM by PIB Hyderabad
మహిళా స్టార్టప్లను ప్రోత్సహించడానికి మరియు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కొత్తగా రూపొందించిన ‘హర్స్టార్ట్’ ప్లాట్ఫారమ్ను ప్రవేశపెట్టినట్లు పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్, కేంద్ర సైన్స్ & టెక్నాలజీ;పీ ఎం ఓ సహాయ మంత్రి, ఎర్త్ సైన్సెస్ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఇక్కడ తెలియజేశారు. కొత్త ప్లాట్ఫారమ్ను ఇటీవల భారత రాష్ట్రపతి ప్రారంభించారని ఆయన చెప్పారు.
పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన భారత్ స్టార్టప్ సమ్మిట్ మరియు ఎక్స్పో 2023 ప్లీనరీ సెషన్లో మంత్రి ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలకు వారి నేతృత్వంలోని స్టార్టప్లకు ఒక సంవత్సరం వరకు నెలవారీ భత్యం ₹ 20,000 కూడా ప్రవేశపెట్టిందని మంత్రి తెలియజేశారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ లో మన వారసత్వ సంపద లో వ్యవస్థాపకత ఇమిడి ఉందని అన్నారు. కొన్ని కుటుంబ యాజమాన్య పరిశ్రమలు మాత్రమే ఉండే చరిత్ర నుంచి స్వాతంత్య్రానంతర కాలం లో భారతదేశం ప్రపంచానికి 100 కంటే ఎక్కువ యునికార్న్లను అందించే వరకు, భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ గణనీయమైన దృష్టిని ఆకర్షించిందని, తద్వారా ప్రపంచ మార్కెట్లలో అత్యంత గౌరవనీయమైనవాటిలో ఒకటిగా మారిందని ఆయన అన్నారు.
బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మరియు మెషిన్ లెర్నింగ్ మొదలైన సాంకేతికతలతో స్టార్ట్అప్లు ఆవిష్కరణలు చేసే అవకాశాలను భవిష్యత్ పోకడలు చూపుతాయని మంత్రి అన్నారు. భారతదేశం తలపెట్టిన విధాన సంస్కరణలతో స్టార్టప్లు పెద్ద పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
పెరుగుతున్న మహిళా పారిశ్రామికవేత్తల ప్రాబల్యం గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, దేశంలో ఉపాధి అవకాశాలను సృష్టించడం, జనాభా సరళులలో మార్పులను తీసుకురావడం, తరువాతి తరం మహిళా వ్యవస్థాపకులకు స్ఫూర్తినివ్వడం ద్వారా మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలు సమాజంలో గుర్తించదగిన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. భారతదేశంలో ప్రస్తుతం వున్న 36 యునికార్న్లు మరియు సంభావ్య యునికార్న్లలో కనీసం ఒక మహిళా వ్యవస్థాపకురాలు లేదా సహ వ్యవస్థాపకులు ఉన్నారు. ప్రభుత్వ భారత దేశం మహిళా వ్యవస్థాపకత కోసం కార్యక్రమాలు, పథకాలు, నెట్వర్క్లు మరియు కమ్యూనిటీలు స్టార్టప్ ఎకోసిస్టమ్లో విభిన్న లబ్దిదారుల మధ్య భాగస్వామ్యాలను సక్రియం చేయడం ద్వారా వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కట్టుబడి ఉంది.
నూతన ఆవిష్కరణలకు జన్మస్థానం గా భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. ఇది జ్ఞాన ఆధారిత ఆర్థిక వృద్ధి నమూనాకు కార్మిక- ఉపాధి అవకాశాలు ఎక్కువగా చేసే, పెట్టుబడి ప్రాధాన్య మరియు ఉత్పాదక దేశంగా భారత్ ప్రయోజనాలను తిరిగి ఆవిష్కరించడానికి కట్టుబడి ఉంది.
మహమ్మారి సమయంలో స్టార్టప్లు పోషించిన కీలక పాత్రను గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, మహమ్మారి సమయంలో ప్రపంచం ఇబ్బందులుపడుతున్నప్పుడు, భారతీయ స్టార్టప్లు కొత్త పరిస్థితితో సర్దుబాటు కావడానికి తమ వ్యూహలను మార్చాయి, సందర్భానికి అనుగుణం గా మార్చుకున్నాయి. కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు మరియు వృద్ధిని చూపించాయి. "భారతదేశం ఈవ్యాపారాలు మరియు డిజిటల్ వ్యాపారాలు మరియు స్టార్టప్లు ఊపందుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్ర దేశాలలో ఒకటిగా ఉండాలని మన దేశం ఆకాంక్షిస్తోంది" అని ఆయన తెలిపారు.
దేశంలో వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ చాలా ముఖ్యమైన దశ అని మంత్రి అన్నారు. ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి కల్పన రెండింటికీ యంత్రం గా భారతదేశంలో ఆవిష్కరణలను పెంపొందించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఈ కార్యాచరణ ప్రణాళిక ఉద్దేశించబడింది.
ఈ రోజు భారతదేశం డీ పీ ఐ ఐ టీ గుర్తింపు పొందిన స్టార్టప్లు 93,000 కంటే ఎక్కువ వున్నాయి. 108 యునికార్న్లకు నిలయంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు. గత నాలుగు సంవత్సరాల్లో, ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది, ప్రతి సంవత్సరం అదనపు ఎదుగుతున్న యునికార్న్ల సంఖ్యలో సంవత్సరానికి 66% పెరుగుదల ఉంది. మహమ్మారి సమయంలో ఇంటి నుండి పని చేయడం భారతదేశంలో డిజిటల్ వ్యాపారాల వృద్ధికి ఆజ్యం పోసింది, ఈ సంఘటన స్టార్టప్ వృద్ది కి కూడా దారితీసింది.
“మనం క్రమంగా యునికార్న్ యుగం నుండి డెకాకార్న్ యుగానికి మారుతున్నాము. జనవరి 2023 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 47 కంపెనీలు డెకాకార్న్ హోదాను సాధించాయి. ప్రస్తుతం, భారతదేశంలో ఐదు స్టార్టప్లు డెకాకార్న్లు గా ఎదిగాయి, అవి ఫ్లిప్కార్ట్, బైజు, నైకా, స్విగ్గి మరియు ఫోన్ పే డెకాకార్న్ బృందం లో చేరాయని ”అని మంత్రి తెలిపారు.
పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం, అత్యాధునిక సాంకేతికతలు,ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మరియు సాధ్యమైనంత తక్కువ సమయంలో వాటిని మార్కెట్ లో ప్రవేశ పెట్టడంలో విద్యాసంస్థలు మరియు పరిశ్రమల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ ప్రస్తుతం అత్యంత ఆవశ్యకమని మంత్రి అన్నారు.
“పరిశ్రమ మొదటి నుండి ఉత్పత్తిని గుర్తించి, ప్రభుత్వంతో సరిపోయే ఈక్విటీని పెట్టుబడి పెట్టినట్లయితే స్టార్టప్లు స్థిరంగా మారతాయి. అప్పుడు మాత్రమే మనం “సమర్త్” మరియు “ఆత్మనిర్భర్ భారత్” కోసం ప్రధాన మంత్రి యొక్క దార్శనికత దృష్టి ని గ్రహించగలము. దేశంలో ఆవిష్కరణల ఆవరణాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం లో నిధులు అడ్డంకి కాబోవని నేను మీకు హామీ ఇస్తున్నాను.” అన్నారాయన.
ఈ పర్యావరణ వ్యవస్థలో పిహెచ్డిసిసిఐ పరిశ్రమ సభ్యులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలని మంత్రి అన్నారు. “అందరి సమిష్టి కృషితో మనం ఈనాటికి 108 యునికార్న్ల నుండి వచ్చే సంవత్సరంలో 200 యునికార్న్లకు ఎదిగేందుకు సిద్ధంగా ఉన్నామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న యువ పారిశ్రామికవేత్తలకు మరియు భారతదేశాన్ని ప్రపంచంలోని స్టార్టప్ హబ్గా మార్చడానికి కృషి చేస్తున్న నా దేశస్థులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ఆయన ముగించారు.
***
(Release ID: 1908083)
Visitor Counter : 236