పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ‘లైఫ్’ - ‘పర్యావరణ దోహద జీవనశైలి’ కీలకం

కేంద్ర బడ్జెట్ 2023-24 యొక్క మొదటి ఏడు ప్రాధాన్యతలలో హరిత ఆర్థిక వృద్ధి ఒకటి (సప్తఋషి)

Posted On: 13 MAR 2023 4:18PM by PIB Hyderabad

పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో,  ప్రభుత్వం పర్యావరణం ప్రగతి దోహద జీవనశైలి (లైఫ్) ఉద్యమాన్ని ప్రజలతో సహా  లబ్దిదారులను సహజ వనరులను బుద్ధిహీన వృదా వినియోగానికి బదులుగా బుద్ధిపూర్వకంగా వినియోగించుకోవాల్సిన అవసరం గురించి సున్నితం చేసే ఉద్దేశ్యంతో ప్రారంభించిందని తెలియజేశారు. ఈ ఉద్యమంలో భాగంగా వ్యక్తులు, సంఘాలు మరియు సంస్థలను భాగస్వాములను చేయడం కోసం 7 వర్గాలలో 75 వ్యక్తిగత పర్యావరణ అనుకూల చర్యల (LiFE చర్యలు) యొక్క సమగ్రమైన మరియు సంపూర్ణ జాబితా రూపొందించబడింది.

2021 నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్ 26లో భారతదేశం ప్రకటించిన ఐదు అంశాలు పారిస్ ఒప్పందం మరియు 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలకు  తక్కువ కర్బన అభివృద్ధికి మెరుగైన దీర్ఘకాలిక  వ్యూహాల కింద జాతీయంగా నిర్ణయించబడిన  దాతృత్వ సహకారం,  (NDC)జాతీయ వాస్తవ పరిస్థితుల దృష్ట్యా సమానమైన మరియు సాధారణమైన బాధ్యతలతో పాటు విభిన్న బాధ్యతలు మరియు సంబంధిత సామర్థ్యాల (CBDR-RC) సూత్రాలకు అనుగుణంగా వ్యూహాలు ప్రణాళికలు లో తగిన విధంగా పొందుపరచబడిందని వ్రాతపూర్వక సమాధానంలో పేర్కొంది. 

ఆగస్ట్ 2022లో యూ ఎన్ ఎఫ్ సి సి సి కి సమర్పించబడిన ఎన్ డీ సీ కి అప్‌డేట్‌లో 2005 స్థాయి నుండి 2030 నాటికి జీ డీ పీ లో45 శాతానికి ఉద్గారాల తీవ్రతను తగ్గించడానికి భారతదేశం నిబద్ధతతో ఉంది; సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం మరియు గ్రీన్ క్లైమేట్ ఫండ్‌తో సహా తక్కువ-ధర అంతర్జాతీయ ఫైనాన్స్ సహాయంతో 2030 నాటికి శిలాజ రహిత ఇంధన-ఆధారిత ఇంధన వనరుల నుండి 50 శాతం సంచిత విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని సాధించడం; మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలకమైన 'లైఫ్'- 'పర్యావరణ ప్రగతి దోహద జీవనశైలి' కోసం సామూహిక ఉద్యమంతో సహా సంప్రదాయాలు, పర్యావరణ పరిరక్షణ మరియు నియంత్రణ విలువల ఆధారంగా ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన జీవన విధానాన్ని ప్రపంచం ముందుకు తెచ్చి, మరింత ప్రచారం చేయాలని సంకల్పం.

ఎన్ డీ సీ నవీకరణ 2070 నాటికి నికర-సున్నాకి చేరుకోవాలనే భారతదేశ దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక అడుగు; దీని కోసం భారతదేశం నవంబర్ 2022లో యూ ఎన్ ఎఫ్ సి సి సి సచివాలయానికి 'భారతదేశం యొక్క దీర్ఘకాలిక తక్కువ కార్బన్ అభివృద్ధి వ్యూహం' పేరుతో ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ పత్రాన్ని సిద్ధం చేసి సమర్పించింది. భారతదేశం యొక్క దీర్ఘకాలిక వ్యూహం ప్రచారం తో సహా తక్కువ-కార్బన్ అభివృద్ధి మార్గాలకు ఏడు కీలక మార్పులపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ వ్యాప్తంగా ఉద్గారాల నుండి వృద్ధిని విడదీయడం మరియు సమర్థవంతమైన, వినూత్నమైన తక్కువ-ఉద్గార పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధి లక్ష్యం.

 

కేంద్ర బడ్జెట్ 2022-23 మరియు 2023-24లో ప్రకటనలతో సహా భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని కూడా పేర్కొంది. ఫిబ్రవరి 1, 2023న పార్లమెంట్‌కు సమర్పించబడిన కేంద్ర బడ్జెట్‌లోని మొదటి ఏడు ప్రాధాన్యతలలో (సప్తఋషి) హరిత ఆర్థిక వృద్ధి ఒకటి.  ఇంధన పరివర్తన మరియు నికర శూన్య లక్ష్యాలు మరియు ఇంధన భద్రత వైపు ప్రాధాన్య మూలధన పెట్టుబడుల కోసంకేంద్ర బడ్జెట్ రూ. 35,000 కోట్లు కేటాయించారు. భారతదేశ వాతావరణ కట్టుబాట్లకు అనుగుణంగా సౌర విద్యుత్ పరికరాలు మరియు బ్యాటరీల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా బడ్జెట్ పర్యావరణ అనుకూల శక్తి పరివర్తనను ప్రోత్సహిస్తుంది.

***



(Release ID: 1906773) Visitor Counter : 149


Read this release in: English , Urdu