యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (ఎన్‌వైపిఎఫ్‌) ఫైనల్స్‌లో ఈ రోజు ప్రారంభ ప్రసంగం చేసిన శ్రీ నిసిత్ ప్రమాణిక్


యువత ఉత్సాహం మరియు శక్తి భారతదేశాన్ని ఆర్థికంగా సాధికారత కలిగిన దేశంగా మారుస్తుంది: శ్రీ నిసిత్ ప్రమాణిక్

2 మార్చి, 2023న ఉదయం 10:30 గంటలకు నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (ఎన్‌వైపిఎఫ్) 4వ ఎడిషన్ వేడుకలో ప్రసంగించనున్న లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొనేవారిని ఉద్దేశించి ప్రసంగించారు

Posted On: 01 MAR 2023 6:49PM by PIB Hyderabad


న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఈ రోజు ప్రారంభమైన నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (ఎన్‌వైపిఎఫ్) ఫైనల్స్‌లో యువజన మరియు క్రీడల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ ప్రసంగించారు. మొదటి రోజు పోటీ సెషన్  కొనసాగింపు నిర్వహించబడింది. రాష్ట్ర యూత్ పార్లమెంట్ (ఎస్‌వైపి)లో 29 మంది విజేతలకు ఈ రోజు శ్రీ అనురాగ్ శర్మ, పార్లమెంటు సభ్యుడు, శ్రీ మనోజ్ తివారీ, పార్లమెంటు సభ్యుడు, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు శ్రీ కంచన్ గుప్తాతో కూడిన జాతీయ జ్యూరీ ముందు మాట్లాడే అవకాశం లభించింది.

ఈ సందర్భంగా శ్రీ నిసిత్ ప్రమాణిక్ మాట్లాడుతూ పాల్గొన్నవారి అభిప్రాయాలు దేశానికి మార్గదర్శకంగా కూడా పనిచేస్తాయన్నారు. యువతలో ఉన్న ఉత్సాహం, శక్తి భారత్‌ను ఆర్థికంగా సాధికారత కలిగిన దేశంగా మారుస్తాయని చెప్పారు. "ఈ దేశ ప్రజాస్వామ్యం ఎంత శక్తివంతంగా ఉందో యువత దృష్టి అంత శక్తివంతమైనది మరియు యువత ప్రజాస్వామ్య నైతికతను మరింత బలపరుస్తుంది" అని ఆయన అన్నారు. ప్ర‌పంచంలో భారతదేశం త‌న‌కంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ ఆత్మ‌నిర్భ‌ర్‌గా మారుతోంద‌ని, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారి నిర్దేశంలో భార‌త‌దేశాన్ని ఆత్మ‌నిర్భ‌ర్‌గా మార్చ‌డంలో దేశంలోని యువ‌త‌కు ప్ర‌ధాన పాత్ర ఉంటుంద‌ని మంత్రి తెలిపారు.

 

image.png

image.png


మొదటి ముగ్గురు విజేతలకు 2 మార్చి 2023న లోక్‌సభ స్పీకర్ ముందు ప్రసంగించే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా వారు  యువతతో ఇంటరాక్ట్ అవుతారు. లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా 2 మార్చి, 2023న న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉదయం 10:30 గంటలకు నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (ఎన్‌వైపిఎఫ్) 4వ ఎడిషన్ వేడుకలో ప్రసంగిస్తారు. ఈ ఉత్సవంలో ముగ్గురు జాతీయ విజేతలు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మరియు యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొనేవారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్, 2023 యొక్క 4వ ఎడిషన్ "ఉత్తమ భవిష్యత్తు కోసం ఆలోచనలు: ప్రపంచం కోసం భారతదేశం" అనే థీమ్‌తో ప్రారంభించబడింది. 2023 జనవరి 25 నుండి 29 వరకు జిల్లా యువజన పార్లమెంట్‌లు నిర్వహించబడ్డాయి. దేశవ్యాప్తంగా 150 వేదికలలో అన్ని రాష్ట్రాలు మరియు యూటీలలోని 748 జిల్లాల నుండి 2.01 లక్షల మంది యువత పాల్గొన్నారు. జిల్లా యూత్ పార్లమెంట్ (డివైపి) 1వ మరియు 2వ స్థానాల హోల్డర్ 2023 ఫిబ్రవరి 3 నుండి 7 వరకు రాష్ట్ర యూత్ పార్లమెంట్ ఉత్సవంలో పాల్గొన్నారు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి యువజన పార్లమెంటుల సందర్భంగా పాల్గొన్నవారు ఇచ్చిన అంశాలపై చర్చించారు.

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (ఎన్‌వైపిఎఫ్) లక్ష్యం రాబోయే సంవత్సరాల్లో ప్రజా సేవతో  సహా వివిధ రంగాల్లో స్థిరపడబోయే యువత వాణిని వినడం.డిసెంబర్ 31, 2017న ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో అందించిన ఆలోచన ఆధారంగా ఎన్‌వైపిఎఫ్ రూపొందించబడింది. ఈ ఆలోచన నుండి ప్రేరణ పొంది ఎన్‌వైపిఎఫ్ 2019 యొక్క 1వ ఎడిషన్ “బీ ద వాయిస్ ఆఫ్ న్యూ ఇండియా అండ్ ఫైండ్ సొల్యూషన్స్ అండ్ కంట్రిబ్యూట్ టు పాలసీ” అనే థీమ్‌తో నిర్వహించబడింది. 88,000 మంది యువత ఇందులో భౌతికంగా భాగస్వామ్యులయ్యారు. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2021 2వ ఎడిషన్ “యువా- ఉత్సహ్ నయే భారత్ కా” అనే థీమ్‌తో నిర్వహించబడింది. దీనిని వర్చువల్ మోడ్‌లో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది యువత మరియు వాటాదారులు వీక్షించారు. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2022 యొక్క 3వ ఎడిషన్ 2.44 లక్షల కంటే ఎక్కువ మంది యువకుల భాగస్వామ్యంతో “నవ భారతదేశపు వాణిగా ఉండండి మరియు పరిష్కారాలను కనుగొనండి మరియు విధానానికి సహకరించండి” అనే థీమ్‌తో నిర్వహించబడింది.


 

********



(Release ID: 1903562) Visitor Counter : 179


Read this release in: English , Urdu , Hindi