వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ ఉత్తమ అక్రిడిటేషన్ వ్యవస్థల జాబితాలో 5వ స్థానంలో భారతదేశ అక్రిడిటేషన్ వ్యవస్థ


నాణ్యమైన మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న వ్యవస్థల జాబితాలో స్థానం సాధించిన భారత వ్యవస్థ

प्रविष्टि तिथि: 09 FEB 2023 7:53PM by PIB Hyderabad

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ) నిర్వహిస్తున్న భారతదేశ అక్రిడిటేషన్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్న వ్యవస్థల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీక్యూఐఐ) 2021 నిర్వహించిన అధ్యయనంలో భారత్ 5వ స్థానం సాధించింది. నాణ్యత మౌలిక సదుపాయాలను ప్రాతిపదికగా తీసుకుని జీక్యూఐఐ ఈ అధ్యయనం నిర్వహించింది. అధ్యయనం ఆధారంగా  జీక్యూఐఐ ప్రపంచంలో 184 ఆర్థిక వ్యవస్థలకు ర్యాంకింగ్ ఇస్తుంది. భారతదేశ మొత్తం క్యూఐ వ్యవస్థ ప్రపంచంలో గుర్తించిన మొదటి 10 వ్యవస్థల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. భారత దేశ స్టాండర్డైజేషన్ వ్యవస్థ  (బీఐఎస్  కింద) 9వ స్థానంలో , మెట్రాలజీ వ్యవస్థ  (ఎన్ పి ఎల్ -సిఎస్ఆర్ఐ కింద) ప్రపంచంలో 21వ స్థానంలో ఉంది.

మూలం: GQII https://gqii.org/

' నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న నవ భారతదేశానికి అమృత కాలంలో ఇది ఒక ముఖ్య సంకేతం. భారతదేశంలో అమలులో ఉన్న 3 క్యూఐ వ్యవస్థల్లో  అక్రిడిటేషన్ వ్యవస్థ అతి చిన్నది.  ఏడాది కాలంలో  అక్రిడిటేషన్ వ్యవస్థ గణనీయమైన ప్రగతి సాధించి ప్రపంచంలో 5వ స్థానం సాధించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నాణ్యత, నమ్మకం అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ' మేడ్ ఇన్ ఇండియా' బ్రాండ్ అంతర్జాతీయ బ్రాండ్ గా గుర్తింపు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. వేగంగా అభివృద్ధి సాధించడానికి నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య వర్గాలు కృషి చేయాలి' అని  క్యూసీఐ చైర్‌పర్సన్ శ్రీ జక్సే షా అన్నారు.

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో క్యూఐ కీలకంగా ఉంటుంది.  మెట్రాలజీ, స్టాండర్డైజేషన్, అక్రిడిటేషన్ , కన్ఫర్మిటీ అసెస్‌మెంట్ సేవలతో వాణిజ్య భాగస్వాముల మధ్య విశ్వసనీయత, నమ్మకం కలుగుతుంది.  భారతదేశంలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్రింద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (ఎన్ పి ఎల్ -సిఎస్ఆర్ఐ ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న  నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ  నేషనల్ మెట్రాలజీ ఇన్‌స్టిట్యూట్ గా, జాతీయ ప్రమాణాల సంస్థగా  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) రాజ్యాంగబద్ద  జాతీయ అక్రిడిటేషన్ బోర్డులుగా పనిచేస్తూ అక్రిడిటేషన్ వ్యవస్థ అమలుకు కృషి చేస్తున్నాయి.

దేశాల క్యూఐ వ్యవస్థ సాధించిన ప్రగతిని జీక్యూఐఐ మదింపు వేస్తుంది.మెట్రాలజీ, ప్రమాణాలు,  అక్రిడిటేషన్ విభాగాల్లో సాధించిన ఉప-ర్యాంకింగ్‌ల ఆధారంగా  ప్రతి దేశంక స్థానం ఆధారంగా  జీక్యూఐఐ మార్కులు ఇస్తుంది.  భౌగోళిక పరంగా ప్రపంచంలో భారతదేశం (10వ), బ్రెజిల్ (13వ), ఆస్ట్రేలియా (14వ), టర్కీ (16వ), మెక్సికో (18వ స్థానం), దక్షిణాఫ్రికా (20వ స్థానం) వంటి కొన్ని మినహాయింపులు  మినహా మొదటి  25  క్యూఐ వ్యవస్థలు ప్రధానంగా యూరప్, ఉత్తర అమెరికా , ఆసియా-పసిఫిక్‌లో ఉన్నాయి.

 టెస్టింగ్, సర్టిఫికేషన్, ఇన్స్పెక్షన్ మొదలైనవాటిని నిర్వహించే కన్ఫర్మిటీ అసెస్‌మెంట్ బాడీస్ (CABs) యొక్క యోగ్యత, విశ్వసనీయతను సాధించడంలో  అక్రిడిటేషన్  సహాయపడుతుంది. భారతదేశంలో  పరిశ్రమ, అంతర్గత వాణిజ్య మంత్రిత్వ శాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ,  భారతీయ పరిశ్రమల ప్రోత్సాహక విభాగం సంయుక్తంగా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నేషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ని 1997లో  నెలకొల్పాయి.  రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన  బోర్డులు దీనిని నిర్వహిస్తున్నాయి.  నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ (NABCB) ప్రాథమికంగా ధృవీకరణ, తనిఖీ మరియు ధృవీకరణ / ధృవీకరణ సంస్థలకు గుర్తింపు జారీ చేస్తుంది. పరీక్ష, క్రమాంకనం, వైద్య ప్రయోగశాలలకు  నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కాలిబ్రేషన్ లాబొరేటరీ గుర్తింపు జారీ చేస్తుంది.  అంతర్జాతీయ సంస్థలు ఆయిన ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఫోరమ్, ఇంటర్నేషనల్ లాబొరేటరీ అక్రిడిటేషన్ కోఆపరేషన్ లో  నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్,  నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కాలిబ్రేషన్ లాబొరేటరీ సభ్యత్వం కలిగి ఉన్నాయి.  బహుళ పక్ష గుర్తింపు ఏర్పాట్లకు సంతకం చేశాయి.  అంతర్జాతీయ సమానత్వం, అక్రిడిటేషన్ కింద జారీ చేయబడిన నివేదికలు, ధృవపత్రాలకు ఆమోదాన్ని అందిస్తుంది. భారతదేశంలో నాణ్యత అంచనా కోసం ఎక్కువగా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్,  నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కాలిబ్రేషన్ లాబొరేటరీ గుర్తింపుపై   ఆధారపడతాయి.

స్వయం సమృద్ధి సాధించడానికి కృషి జరుగుతున్న సమయంలో నాణ్యత అంశం కీలకంగా ఉంటుందని క్యూసిఐ సెక్రటరీ జనరల్ డాక్టర్. రవి పి . సింగ్ అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా వినూత్న విధానాలతో వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భారతదేశం అమలు చేస్తున్న వ్యవస్థలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్నాయన్నారు.  ఉత్పత్తులు,  సేవల నాణ్యతను మెరుగు పరిచే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నామని డాక్టర్ సింగ్ తెలిపారు.
 సంవత్సరం చివరి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా  ప్రతి సంవత్సరం జీక్యూఐఐ ర్యాంకింగ్ ఇస్తారు.. 2021 ర్యాంకింగ్‌లు డిసెంబర్ 2021 చివరి వరకు సమాచారంపై  ఆధారపడి ఉంటాయి.  2022 వరకు సేకరించి విశ్లేషిస్తారు. మెట్రాలజీ, స్టాండర్డైజేషన్, అక్రిడిటేషన్, సంబంధిత సేవలపై జరుగుతున్న అధ్యయనాలకు  ఫిజికాలిష్-టెక్నిస్చే బుండెసాన్‌స్టాల్ట్ (PTB) మరియు ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ మరియు అభివృద్ధి (BMZ), జర్మనీ సహకారం అందిస్తున్నాయి.

***


(रिलीज़ आईडी: 1897849) आगंतुक पटल : 311
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi