చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
పత్రిక ప్రకటన
Posted On:
20 JAN 2023 2:04PM by PIB Hyderabad
హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ అమ్జద్ అహ్తేషామ్ సయీద్ పదవీ విరమణ తర్వాత, ఆయన స్థానంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా హిమాచల్ప్రదేశ్ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ శ్రీమతి సబీనాను రాష్ట్రపతి నియమించారు. 21.01.2023 నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్రపతి ఈ నియామకం చేశారు.
***
(Release ID: 1892666)