మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అన్ని రాష్ట్రాలు/యూటీల కమిషనర్లు/డైరెక్టర్ల కోసం రెండు రోజుల ‘వార్షిక ప్రణాళిక రూపకల్పన ’ వర్క్‌షాప్‌ను మత్స్యశాఖ నిర్వహిస్తోంది.

Posted On: 13 JAN 2023 2:18PM by PIB Hyderabad

ఈ వర్క్‌షాప్ అన్ని రాష్ట్రాలు/యూటీల మత్స్యశాఖ అధికారులచే సమర్థవంతమైన ప్రణాళిక రూపకల్పన కోసం మేధోమథనం, సమాచారాన్ని పంచుకోవడం మరియు క్షేత్ర స్థాయిలో సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

వార్షిక కార్యాచరణ ప్రణాళికల (2023-24 మరియు 2024-25) కోసం రాష్ట్రాలు/యూటీలతో వ్యూహాలను రూపొందించడంపై వర్క్‌షాప్ దృష్టి సారించింది, ఇది సారూప్య సవాళ్లను ఎదుర్కొంటున్నbరాష్ట్రాలు/యూటీల మధ్య  సహాధ్యయనం మరియు చర్చ కు అవకాశంగా ఉపయోగపడింది.

చేపల పెంపకం మరియు ఆక్వాకల్చర్ రంగం యొక్క మొత్తం అభివృద్ధికి సమర్థవంతమైన  ప్రణాళిక రూపకల్పన చేయడానికి వర్క్‌షాప్ అధిక ఉత్సాహంతో ముగిసింది.

ఈ వర్క్‌షాప్‌కు 26 రాష్ట్రాలు/యుటిల నుండి మొత్తం 47 మంది అధికారులు హాజరయ్యి విజయవంతం చేసారు

 

ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, భారత ప్రభుత్వం 2023 జనవరి 4 నుండి 5 వరకు రెండు రోజుల 'వార్షిక ప్రణాళిక రూపకల్పన'  కోసం అన్ని రాష్ట్రాలు/యుటిల మత్స్యశాఖ అధికారులచే  సమర్థవంతమైన ప్రణాళిక రూపకల్పన కోసం మేధోమథనం చేయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి మరియు క్షేత్ర స్థాయిలో సవాళ్లను పరిష్కరించడానికి వర్క్‌షాప్‌ను నిర్వహించింది. వర్క్‌షాప్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్ (గోఐ), ఎన్‌ఎఫ్‌డిబి మరియు రాష్ట్రాల మత్స్య శాఖ సీనియర్ అధికారుల సమక్షంలో డిఓఎఫ్ (గోఐ) కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షత వహించారు. 26 రాష్ట్రాలు/యుటిల నుండి మొత్తం 47 మంది అధికారులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యి విజయవంతం చేసారు.

 

వర్క్‌షాప్ ప్రారంభ సెషన్‌ జే ఎస్ (ఐ ఎఫ్) JS డీ ఓ ఎఫ్  పాల్గొనే ప్రముఖులు ఆహుతులందరికీ స్వాగతం పలికారు. ప్రస్తుతం కొనసాగుతున్న డిపార్ట్‌మెంటల్ పథకాలైన ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY), ఫిషరీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (FIDF) మరియు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) యొక్క విజయాలను ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయిలో మత్స్య సంపద విలువ గొలుసులోని ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో సమస్యలు ఉన్నప్పటికీ చేపల ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు విపరీతమైన ప్రయత్నాలు చేశాయని ఆయన వివరించారు. రాబోయే రాష్ట్ర/యూటీల వార్షిక ప్రణాళికలను పునఃప్రారంభించడం మరియు పునఃప్రణాళిక చేయడం ద్వారా దిద్దుబాటు చర్యలను చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.

 

జాయింట్ సెక్రటరీ (MF) తన ప్రసంగంలో మత్స్య రంగం ను వ్యవస్థాగతం చేయడం, దేశీయ చేపల వినియోగాన్ని పెంపొందించడం, విలువ గొలుసు సామర్థ్యాలు మరియు నాణ్యత హామీ కోసం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టడం, తాజా నుండి శీతలీకరణ చేపలకు మారడం, బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్, నాణ్యమైన ఆక్వాకల్చర్‌  ఆక్వాకల్చర్ భీమా, వ్యవస్థాపకత మార్గదర్శకత్వం, సహ-నిర్వహణ నమూనాలు, తక్కువ-ధర ఆధునిక ఫిషింగ్ నౌకలు, నౌకల పర్యవేక్షణ వ్యవస్థ, అధిక శక్తి సామర్థ్య ఫిషింగ్ బోట్లు గురించి నొక్కి చెప్పారు.

చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎన్ ఎఫ్ డీ బీ (NFDB)  ప్రసంగంలో రాష్ట్రాలు/యూటీలలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన యొక్క ఉప కార్యకలాపాల పురోగతి మరియు విజయాలను  వివరించారు. తీరప్రాంత మత్స్యకార సంఘాల అభివృద్ధి, శిక్షణ మరియు సామర్థ్యం పెంపుదల, క్లస్టర్ అభివృద్ధి, ఎఫ్‌ఎఫ్‌పిఓలు, కన్వర్జెన్స్, రివర్ ర్యాంచింగ్, ఆక్వా పార్కులు మొదలైన వాటిపై  రాష్ట్రాలు/యుటిల భౌతిక పురోగతిలో అంతరాలపై వివరించారు.

 

డీ ఓ ఎఫ్  కార్యదర్శి తన ప్రారంభ ప్రసంగంలో కొనసాగుతున్న కార్యకలాపాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. భారత ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు స్థానిక స్థాయిలో ప్రాధాన్యతలను నిర్ణయించాలని రాష్ట్రాలు/యూటీలను కోరారు.  మత్స్య రంగాల కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ప్రాథమిక కార్యాచరణగా తగినంత విత్తనోత్పత్తికి ప్రత్యేక శ్రద్ధ ఇవ్వవచ్చనీ, కృత్రిమ రీఫ్‌ల ఏర్పాటు, కోల్డ్-చైన్, ఎం ఐ ఎస్ డేటా మేనేజ్‌మెంట్ వంటి కార్యకలాపాలకు రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య సహకార విధానాన్ని చేపల మార్కెట్ల విస్తరణ (ఫిష్ బజార్), శీతలీకరణ చేపల ప్రచారం మరియు మార్కెటింగ్, అవసరమైన సంఖ్యలో విత్తన ఉత్పత్తి మొదలైనవి చేపట్టాలని ఆయన సూచించారు. వ్యూహాత్మకతో పాటు పైన పేర్కొన్న ప్రాధాన్యతా అంశాలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యతలను నిర్ణయించడానికి 2023-25 వివరణాత్మక వార్షిక కార్యాచరణ ప్రణాళక రూపకల్పన కోసం రాష్ట్ర/యూటీల అధికారులకు  మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. అదనంగా, ప్రతి రాష్ట్రం/యూటీల వారి వివరణాత్మక వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి వారి వనరులను మరియు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయాలని ఆయన నొక్కి చెప్పారు.

 

ప్రారంభ సమావేశం తర్వాత రాష్ట్రాలు/యూటీలు  2020-21 మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాలలో తమ భౌతిక మరియు ఆర్థిక విజయాలను ప్రదర్శించాయి, 2023-24 మరియు 2024-25 ఆర్థిక సంవత్సరాలలో   వార్షిక ప్రణాళికల అవలోకనాన్ని, ఎదుర్కొన్న క్షేత్ర స్థాయి సవాళ్ల పై ఇంటరాక్టివ్ సెషన్ అంతర్-రాష్ట్ర చర్చలకు, నాయకత్వం నుండి మార్గదర్శకత్వంతో పాటు సమస్యల పరిష్కారానికి మంచి అభ్యాసాల మార్పిడి కూడా దారితీసింది.  మొదటి రోజు చివరి దశలో ఆరోజు జరిగిన చర్చల సారాంశం మరియు మరుసటి రోజు సందర్భం చర్చనీయాంశల రూపకల్పన తో ముగిసింది.

 

వర్క్‌షాప్‌లో రెండవ రోజు,మూడు వేర్వేరు సమూహాలలో గ్రూప్ కార్యకలాపాలు తరువాత గ్రూప్ లీడర్‌ల ప్రదర్శన జరిగాయి, సమూహ చర్చలో ఆలోచనల యొక్క భావసంపర్కం మరియు క్షేత్ర స్థాయి సవాళ్లు మరియు సమస్యలను పరిష్కరించడానికి వినూత్న ఆలోచనలు ఉన్నాయి.

వార్షిక కార్యాచరణ ప్రణాళికల (2023-24 మరియు 2024-25) కోసం రాష్ట్రాలు/యూటీలతో వ్యూహాలను రూపొందించడంపై వర్క్‌షాప్ దృష్టి సారించింది. ఇది ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు/యూటీల మధ్య సహాధ్యయనం భావ మార్పిడి కోసం ఒక అవకాశంగా కూడా పనిచేసింది. ఈ సందర్భంగా,  మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS), డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మరియు సింగిల్ నోడల్ ఖాతా (SNA) పై విధాన సమీక్ష  ప్రెజెంటేషన్ మరియు ప్రశ్నలపై చర్చ కూడా నిర్వహించబడ్డాయి.

 

జాయింట్ సెక్రటరీ (MF) ప్రసంగంతో వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది,  సెషన్‌ల నుండి కీలకమైన ముఖ్యాంశాలను ఆయన వివరించారు   అతి ముఖ్యమైన శ్రద్ద తీసుకోవాల్సిన మరియు ముఖ్యమైన నిర్ణయాలను తిరిగి ప్రస్తావించారు చేపల పెంపకం మరియు ఆక్వాకల్చర్ రంగం యొక్క మొత్తం  అభివృద్ధికి సమర్థవంతమైన  ప్రణాళిక మరియు అమలు పై వర్క్‌షాప్  ఉత్సాహంతో ముగిసింది.

 

నేపథ్య సమాచారం:

 

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) ప్రభుత్వ ప్రధాన పధకం 2020 సెప్టెంబర్‌లో 2020-25 ఆర్థిక సంవత్సర కాలానికి  రంగం పై అత్యధిక పెట్టుబడి రూపంలో రూ. 20050 కోట్లతో ప్రారంభించబడింది. మత్స్య శాఖ నిర్మాణాత్మక మార్పులు మరియు మత్స్య  రంగ సంస్కరణలను తీసుకురావడానికి  బాధ్యతను కలిగి ఉంది.  రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను సమీకరించడం, మార్గనిర్దేశం చేయడం మరియు మద్దతు ఇవ్వడంలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. 

 

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద, మొత్తం రూ. 11,318.00 కోట్ల పెట్టుబడి ( 2020-23 ఇప్పటి వరకు) అన్ని రాష్ట్రాలు/ యూటీలకూ చెందిన వివిధ ప్రాజెక్ట్‌లలో చేయబడింది. అంతరాల విశ్లేషణ కోసం కొనసాగుతున్న సవాళ్లు, సమస్యలను చర్చించడానికి, పథకం లక్ష్యాలను, మత్స్య రంగం సమగ్ర వృద్ధిని సాధించడానికి దిద్దుబాటు చర్యలను చర్చించడానికి కేంద్రం మరియు రాష్ట్రాలు/యూటీలు రెండూ ఒక ఉమ్మడి వేదికపైకి రావచ్చని గమనించడం జరిగింది.

 

****


(Release ID: 1891190)
Read this release in: English , Urdu , Hindi , Tamil