వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దేశం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాలతో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ (10వ తేదీ - 16 జనవరి 2023)


ఈశాన్య ప్రాంతంలోని స్టార్టప్‌లపై ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులపై వర్క్‌షాప్ మరియు చర్చలు నిర్వహణ

Posted On: 10 JAN 2023 5:20PM by PIB Hyderabad
జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు జరగనున్న స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ (10వ తేదీ - 16 జనవరి 2023) కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. సంబంధిత వర్గాలకు ప్రయోజనం కలిగించాలన్న లక్ష్యంతో దేశం వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు.  స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ మొదటి రోజున కింది కార్యక్రమాలు జరిగాయి:
ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులపై వర్క్‌షాప్:
ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు అనే అంశంపై పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య అభివృద్ధి శాఖ ఈ రోజు ఒక వర్క్‌షాప్ నిర్వహించింది.ఢిల్లీ వాణిజ్య భవన్ లో జరిగిన  కార్యక్రమానికి డీపీఐఐటీ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ అధ్యక్షత వహించారు. స్టార్టప్ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడులు వచ్చేలా చూసేందుకు  ఆర్థిక మంత్రిత్వ శాఖ , భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ, మరియు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖలతో కలిసి డీపీఐఐటీ పనిచేస్తోంది. 

 

కార్యక్రమానికి హాజరైన  స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  ప్రతినిధులకు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో దేశీయ మూలధనాన్ని సమీకరించడానికి గల వివిధ అంశాలపై అవగాహన కల్పించడంపై వర్క్‌షాప్ దృష్టి సారించింది.   
భారతదేశంలో స్టార్టప్ రంగంలో నెలకొన్న పరిస్థితులు, స్టార్టప్ రంగంలో ఆర్థిక సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు అనే అంశాలపై  రెండు గంటలపాటు జరిగిన వర్క్‌షాప్ చర్చించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు వర్క్‌షాప్ లో చర్చకు వచ్చాయి. 
ASCEND SAMAGAM 

 

స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2023లో భాగంగా డీపీఐఐటీ  ఈరోజు ASCEND (అక్సిలరేటింగ్ స్టార్టప్ క్యాలిబర్  ఎంటర్‌ప్రెన్య్యూరియల్ డ్రైవ్) SAMAGAM ను నిర్వహించింది. ఈశాన్య ప్రాంతంపై దృష్టి సారించి కార్యక్రమం జరిగింది.  వ్యవస్థాపకత ముఖ్య అంశాలపై అవగాహన పెంపొందించడం, దృఢమైన స్టార్టప్‌ను రూపొందించడంలో ప్రయత్నాలను కొనసాగించడం లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. 

నవంబర్ మరియు డిసెంబర్ 2022 నెలల్లో ఈశాన్య భారతదేశంలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలలో వ్యవస్థాపకులుఔత్సాహిక పారిశ్రామికవేత్తలువిద్యార్థులు మరియు పర్యావరణ వ్యవస్థ ను ప్రోత్సహించే వారి కోసం డీపీఐఐటీ  నిర్వహించిన ASCEND వర్క్‌షాప్‌లకు కొనసాగింపుగా ASCEND సమాగం నిర్వహించబడుతోంది.

వర్చువల్ మోడ్‌లో నిర్వహించిన ASCEND SAMAGAMలో రాష్ట్ర అధికారులుస్టార్టప్‌లు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వంటి వాటాదారులతో సహా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన దాదాపు  110 మంది పాల్గొన్నారు.

 నేటి వ్యవస్థాపకుడు, రేపటి నాయకులు అంశంపై వెబినార్

  “నేటి వ్యవస్థాపకుడు, రేపటి నాయకులు” అనే అంశంపై స్టార్టప్ ఇండియా 2023 జనవరి 10న వెబ్‌నార్‌ను నిర్వహించింది. ముగ్గురు నిపుణులు నాయకత్వంలో వెబ్‌నార్‌ జరిగింది. ప్రొఫెసర్ సూర్య కుమార్, డీన్ - ఇన్నోవేషన్, ట్రాన్స్‌లేషన్ అండ్  స్టార్టప్స్ ఐఐటీ  హైదరాబాద్, క్రిస్ కాండర్ షులిచ్ బిజినెస్ స్కూల్, కెనడా, మరియు ప్రొఫెసర్ ధ్రువ నాథ్, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు ఎక్స్-మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, గుర్గావ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 
పైన పేర్కొన్న వాటితో పాటు, దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో స్టార్టప్ సంబంధిత ఈవెంట్‌లు కూడా నిర్వహించబడ్డాయి. 

అసోసియేషన్ ఫర్ సైంటిఫిక్ పర్స్యూట్స్ ఫర్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఎంటర్‌ప్రైజెస్ ( హైదరాబాద్) :
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో స్టార్టప్‌ల కోసం ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) స్ట్రాటజీ మరియు స్టార్టప్ వాల్యుయేషన్ అంశాలపై అసోసియేషన్ ఫర్ సైంటిఫిక్ పర్స్యూట్స్ ఫర్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఎంటర్‌ప్రైజెస్ సదస్సును నిర్వహించింది. ఆఫ్‌లైన్‌లో 20కి పైగా స్టార్టప్‌ల భాగస్వామ్యంతో హైబ్రిడ్ మోడ్‌లో సదస్సు జరిగింది.  వారి వారి రంగాలకు చెందిన ఇద్దరు నిపుణులు ఈ సదస్సుకు నాయకత్వం వహించి చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. 
సర్దార్ పటేల్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్  (ముంబయి) : 
 ది ఆర్ట్ ఆఫ్ పిచింగ్ అనే అంశంపై సర్దార్ పటేల్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌కు  శ్రీ దినేష్ ఇస్రానీ, నమన్ ఏంజెల్స్ ఇండియా ఫౌండేషన్ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో  40కి పైగా  స్టార్టప్‌లు మరియు సౌకర్యాలు కల్పిస్తున్న వారు పాల్గొన్నారు. 
అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ సొసైటీ (కోయంబత్తూరు): 
జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ సొసైటీ  నిర్వహించిన  కార్యక్రమాన్ని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్వి . గీతాలక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) డీడీజీ  (వ్యవసాయ విద్య) డాక్టర్ రాకేష్ చంద్ర అగర్వాల్ హాజరయ్యారు.  కార్యక్రమంలో 100 మందికి పైగా ప్రతినిధులు  పాల్గొన్నారు. ఎంపిక చేసిన స్టార్టప్‌ల కోసం వారి వినూత్న ఉత్పత్తి మరియు సేవలను ప్రదర్శించడానికి ప్రత్యేక ప్రదర్శన ప్రాంతం కూడా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్టార్టప్‌లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎస్ ఆర్  ఫౌండేషన్ ( వరంగల్) :
  'ఎస్ఆర్  ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్' లో ఫిజికల్ స్టార్టప్ ఇన్నోవేషన్ పోటీని ఎస్ ఆర్  ఫౌండేషన్ నిర్వహించింది. మొదటి రౌండ్‌కు 78కి పైగా జట్లు దరఖాస్తు చేసుకున్నాయి.  ఈరోజు సెంటర్‌లో జరిగిన చివరి రౌండ్‌కు 30 జట్లు ఎంపికయ్యాయి. టాప్ 5 టీమ్‌లు విజేతలుగా ఎంపిక చేయబడ్డాయి మరియు నగదు బహుమతులు మరియు గ్రాంట్లు అందించబడ్డాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, విద్యార్థులు హాజరయ్యారు.
 
***
 


(Release ID: 1890201) Visitor Counter : 139