మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో రేపు పర్యటించనున్న కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా

Posted On: 08 JAN 2023 11:47AM by PIB Hyderabad

2023 జనవరి 9-10 తేదీల్లో, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా పర్యటించనున్నారు. ఆ సరిహద్దు ప్రాంతాన్ని ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సందర్శించడం ఇదే తొలిసారి.

9 జనవరి 2023న, పశ్చిమ గారో హిల్స్‌లోని అంపాటిలో ప్రభుత్వ అధికారులు, సంబంధిత వర్గాలతో కలిసి వివిధ ప్రభుత్వ ప్రధాన పథకాల మీద సమీక్ష నిర్వహిస్తారు.

10 జనవరి 2023న, ఆ ప్రాంతంలోని మహిళ, పాడి రైతులు, మత్స్య వ్యాపారుల స్వయం సహాయక బృందాలతో శ్రీ రూపాలా సమావేశం అవుతారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలతో మాట్లాడడానికి బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న హాత్‌ను కూడా కేంద్ర మంత్రి సందర్శిస్తారు.

***



(Release ID: 1889662) Visitor Counter : 141