రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఎస్ వి పి ఎన్ పి ఎ లో 74వ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 27 DEC 2022 6:51PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (డిసెంబర్ 27, 2022) హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇండియన్ పోలీస్ సర్వీస్ 74 వ బ్యాచ్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

 

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, దేశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న సమయం లో, ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో , బలోపేతం చేయడంలో మన పోలీసు దళం అందించిన గొప్ప కృషిని దేశం గుర్తించిందని అన్నారు.

దేశ ఐక్యతను పరిరక్షించడంలో భారతీయ పోలీసులు భారీ సేవలు అందించారు. భారతదేశ అంతర్గత భద్రత కోసం వేలాది మంది ధైర్యవంతులైన పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఐపీఎస్ అధికారులకు ఆమె నివాళులు అర్పించారు.

 

ఐపిఎస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, పోలీసులు ప్రభుత్వానికి అత్యంత శక్తివంతమైన భాగం అని అన్నారు. పోలీసు బలగాలు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడు, అది ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతుంది. తమ కింద ఉన్న మొత్తం దళం, చివరి కానిస్టేబుల్ వరకు అప్రమత్తత, సున్నితత్వం , నిజాయితీని ప్రదర్శించినప్పుడు మాత్రమే పోలీసులు గౌరవం ,నమ్మకాన్ని పొందుతారు. తమ కెరీర్ ప్రారంభం నుండి, ఐపిఎస్ ప్రొబేషనర్లు నాయకత్వ స్థానాల్లో ఉంటారని ఆమె చెప్పారు. వారి నాయకత్వ ప్రమాణాలు వారి నేతృత్వంలోని దళం సమర్థత ,మనోధైర్యాన్ని నిర్ణయిస్తుంది. సమగ్రత, నిష్పాక్షికత, ధైర్యం, సామర్థ్యం ,సున్నితత్వం అనే ఐదు ప్రాథమిక లక్షణాలను మనస్సులో ఉంచుకుని కార్యాచరణ ద్వారా ప్రదర్శించాలని ఆమె వారికి సలహా ఇచ్చారు.

 

దేశ పురోగతిలో, సమాజ పరివర్తనలో పోలీసు బలగాలు భాగస్వాములు కావాలని రాష్ట్రపతి అన్నారు. సుస్థిర అభివృద్ధిని, ముఖ్యంగా సమ్మిళితం నిర్ధారించడం ద్వారా దేశ సౌభాగ్యం దిశగా పోలీసు అధికారులు మార్పు సారథ్య పాత్రను పోషించబోతున్నారు. సమ్మిళితం అంటే - చివరి వ్యక్తిని, అత్యంత దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వ్యక్తిని, అత్యంత హాని కలిగించే వ్యక్తిని చేర్చడం. ఆ చివరి వ్యక్తి వారి ప్రత్యేకదృష్టికి కేంద్రంగా ఉండాలి. గొంతు వినిపించంచ లేని వారి దుస్థితి పట్ల సున్నితంగా ఉండాలని ఆమె వారికి సలహా ఇచ్చారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న నిరక్షరాస్యుడైన పేదవాడికి స్థానిక పోలీసు స్టేషన్ లో సానుభూతి, మద్దతు లభించేలా పోలీసు అధికారులు చూసుకోవాలని ఆమె అన్నారు. పోలీసుల ఆలోచనకు నేరస్థులు భయంతో వణికిపోవాలి. కానీ, అదే సమయంలో సామాన్య పౌరుడు పోలీసులను స్నేహితుడిగా, రక్షకుడిగా చూడాలి.

 

మన ప్రకటిత జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ' అమృత్ కాల్ ' సంద ర్భంగా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో నారీ శ క్తి ప్రధాన పాత్రను పోషించాలని రాష్ట్రపతి అన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్' అంటే ఆత్మనిర్భర్ నారీ. మహిళల భాగస్వామ్యం మెరుగైన సమగ్ర అభివృద్ధికి దారితీస్తుందని ఆమె అన్నారు. మ హిళలకు సాధికారత

కల్పించే దశ నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి స్థాయికి మనం వేగంగా ముందుకు సాగాలి. మహిళా పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ఇతర మహిళలకు, ముఖ్యంగా నిస్సహాయులకు సహాయం చేయాలని ఆమె కోరారు. ప్రతి మహిళ తమలోని బలహీనుల పక్షాన నిలబడితే, సమాజం గొప్ప పరివర్తనను చవిచూస్తుందని ఆమె అన్నారు.


(रिलीज़ आईडी: 1886957) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil