భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2022 డిసెంబర్, 19వ తేదీ వరకు రెండవ దశ ఎఫ్.ఏ.ఎం.ఈ. ఇండియా పథకం కింద 7,66,478 ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇవ్వడం జరిగింది

Posted On: 23 DEC 2022 2:48PM by PIB Hyderabad

 

*      పథకం కింద 26 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,315 -బస్సులు మంజూరు చేయడం జరిగింది. 

 

*      పథకం కింద 25 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 68 నగరాల్లో 2,877 ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేయడం జరిగింది.

 

 

 

భారతదేశంలో హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం, తయారు చేయడం (ఎఫ్.ఏ.ఎం.ఈ-ఇండియా) పథకం రెండో దశ కింద, 2022 డిసెంబర్, 19వ తేదీ వరకు 7,66,478 విద్యుత్ వాహనాలకు సుమారు 3,311 కోట్ల రూపాయలు డిమాండ్ ప్రోత్సాహకంగా అందజేయడం ద్వారా మద్దతు ఇవ్వడం జరిగింది.  అదేవిధంగా, ఈ పథకం కింద 26 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని  65 నగరాలు / ఎస్.టి.యు. లు /  సి,టి,యు. లు /   రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు  అంతర్ రాష్ట్ర, రాష్ట్రేతర కార్యకలాపాల కోసం 6,315 ఈ-బస్సులను, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. 

 

ఎఫ్.ఏ.ఎం.ఈ. ఇండియా (భారతదేశంలో హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం, తయారు చేయడం) పథకం రెండో దశ కింద 25 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 68 నగరాల్లో 2,877 ఛార్జింగ్ స్టేషన్లను మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది.

ఎఫ్..ఎం.-ఇండియా పథకం రెండవ దశ అమలు కోసం బడ్జెట్ కేటాయింపువినియోగం వివరాలు  క్రింది విధంగా ఉన్నాయి:

క్రమ

సంఖ్య

ఆర్థిక

సంవత్సరం

బడ్జెట్

కేటాయింపు

30.11.2022 నాటికి నిధుల వినియోగం

1

2019-2020

₹   500.00 కోట్లు

₹   500.00 కోట్లు

2

2020-2021

₹   318.36 కోట్లు

₹   318.36 కోట్లు

3

2021-2022

₹   800.00 కోట్లు

₹   800.00 కోట్లు

4

2022-2023

₹ 2903.08 కోట్లు

₹ 1128.45 కోట్లు

 

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

 

 

*****



(Release ID: 1886108) Visitor Counter : 114


Read this release in: Malayalam , English , Urdu