నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ కొత్త వృద్ధి చోదక శక్తిగా ఈశాన్య భారతం భారత దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ఈశాన్య భారతం సిద్ధం

Posted On: 18 DEC 2022 7:21PM by PIB Hyderabad

కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ & జలమార్గాలు, ఆయుష్ శాఖల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈశాన్య ప్రాంత వృద్ధికి ఈశాన్య భారత మండలి (ఎన్ఈసీ) ఉత్ప్రేరకమని అన్నారు. ప్రధాన మంత్రి దార్శనికతతో కూడిన నాయకత్వంలో  ఈశాన్య ప్రాంతం భారత దేశం దేశపు కొత్త వృద్ధి  చోదక శక్తులు నిలుస్తున్నాయని అన్నారు.  భారతావని తదుపరి ముందుకు ప్రయాణాన్ని నడపడానికి సిద్ధమై ఉన్నామని ఆయన అన్నారు. షిల్లాంగ్‌లో జరిగిన ఎన్‌ఈపీ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన అనంతరం శ్రీ సోనోవాల్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటూ.. "షిల్లాంగ్‌లోని ఈశాన్య మండలి (ఎన్ఈసీ) స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు గౌరవనీయులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రూ.2450 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ శంఖుస్థాపనలు దేశ సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' అనే మోడి విజన్‌కు నిజమైన ప్రతిబింబాలని అన్నారు. ప్రధాన మంత్రి మోడీ డైనమిక్ నాయకత్వంలో, ఈశాన్య ప్రాంతం యొక్క ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగస్వాములు కావడానికి శాశ్వత శాంతి మరియు సమాజాలకు గౌరవంతో ఈశాన్య ప్రాంతం యొక్క వృద్ధి మరియు అభివృద్ధికి మార్గం నిర్దేశించబడింది. ఈరోజు ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ప్రాజెక్టులు మేఘాలయ మాత్రమే కాకుండా మొత్తం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ఈశాన్య ప్రాంతాలను అష్టలక్ష్మిగా గుర్తించి, ఈ ప్రాంతంలో కొత్త అభివృద్ధి యుగానికి నాంది పలికినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. " అని అన్నారు. 

***


(Release ID: 1884720)
Read this release in: English , Urdu , Hindi