పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
లీడ్ ఐటి సమ్మిట్ స్టేట్ మెంట్ - 2022 ను ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్, COP27లో సంయుక్తంగా నిర్వహించిన భారత్, స్వీడన్ తక్కువ కార్బన్ పరివర్తనకు సహ-అభివృద్ధి ఏకైక మార్గం: శ్రీ భూపేందర్ యాదవ్
Posted On:
15 NOV 2022 5:59PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
లీడ్ఐటి సమ్మిట్ స్టేట్మెంట్ 2022 ప్రారంభమైంది.
లీడ్ ఐటి సభ్యులు తక్కువ-కార్బన్ పరివర్తనను కొనసాగించే నిబద్ధత అవసరాన్ని మళ్లీ నొక్కి చెప్పారు.
భారతదేశం, స్వీడన్ ఈరోజు, వాతావరణ మార్పులపై సదస్సు - COP27 పరిధిలో లీడ్ఐటి కార్యక్రమాన్ని నిర్వహించాయి. లీడ్ఐటి (లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్) ప్రయత్నం పారిశ్రామిక రంగాన్ని పరిధిలో ఉంచడానికి కష్టతరమైన తక్కువ కార్బన్ మార్పుపై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమంలో భారత పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, స్వీడన్ దేశ వాతావరణ పర్యావరణ మంత్రి, రోమినా పూర్మోఖ్తరి ఈజిప్టు అంతర్జాతీయ సహకార మంత్రి శ్రీమతి రైనా అల్-మషత్ పాల్గొన్నారు.
తక్కువ కార్బన్ పరివర్తనకు సహ-అభివృద్ధి ఏకైక మార్గమని శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు
![](https://ci5.googleusercontent.com/proxy/1t04FyNGTqlOMh7SFtwPSr2S1ASXBPkfY3EvmM6pBRVMDMQC5lteRFcDXH0FVI6IGksePYwMQVLlUCM7FxBs6K4TiIKQPpSEuYeCgFfa2PpA8ez0HMlrfHry3Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CKP2.jpg)
COP 27 వద్ద లీడ్ఐటి సమ్మిట్ 2022లో కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్
ప్రారంభోపన్యాసం సందర్భంగా మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశంలో సిమెంట్, ఉక్కు రంగాలకి సంబంధించి చేపట్టిన కార్యాచరణ కసరత్తు పై ప్రత్యేక దృష్టి సారించి లీడ్ఐటి కార్యకలాపాల గురించి మాట్లాడారు. మున్ముందు, లీడ్ఐటిలోని ఇతర సభ్య దేశాలలో కూడా ఇలాంటి కసరత్తులు చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచం తనకు తానుగా తీసుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి సహ-అభివృద్ధి మాత్రమే ఏకైక ఎంపిక అని, అది లేకుండా, తక్కువ కార్బన్ పరివర్తన సాకారం కావడం దశాబ్దాల ఆలస్యం కావచ్చని కూడా ఆయన నొక్కి చెప్పారు.
"పారిశ్రామిక రంగం తక్కువ కార్బన్ పరివర్తన అవసరమైన వాయు ఉద్గారాల తగ్గింపుకు మాత్రమే దోహదపడదు. ఇది వాతావరణంలో మార్పుల పునరుద్ధరణను పెంచడం, మెరుగైన ఇంధన భద్రత, ఆవిష్కరణలు, సామాజిక-ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ కల్పన వంటి అనేక సహ-ప్రయోజనాలను కలిగి ఉంది”, అని శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు.
లీడ్ఐటి ప్రస్తుత దశ 2023లో ముగియనుందని, వచ్చే ఏడాది ఇప్పటి వరకు సాధించిన పనితీరు విజయాలను ప్రతిబింబించే సమయం అని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, సంప్రదింపుల పద్ధతిలో ప్రాధాన్యతలను గుర్తించేందుకు 2023 తర్వాత ప్రక్రియను కొనసాగించడం పై చర్చించాల్సిన అవసరం ఉంది.
ఈ కార్యక్రమంలో ఆర్ధిక ,అంతర్విభాగ సమస్యలపై దృష్టి సారించే సమగ్రచర్చలు ఉన్నాయి. కంపెనీలను కలిగి ఉన్న లీడ్ఐటి సభ్య దేశాలు, పరిశ్రమ రంగంలో తమ విజయవంతమైన ప్రయత్నాలను, తక్కువ-కార్బన్ పరివర్తనల అవసరాలపై అభిప్రాయాలను పంచుకున్నాయి.
లీడ్ఐటి సభ్యులు సమ్మిట్ స్టేట్మెంట్ను ఆమోదించడంతో సదస్సు ముగిసింది, ఇది పరిశ్రమ తక్కువ-కార్బన్ పరివర్తనను కొనసాగించాలనే నిబద్ధతను పరిశ్రమలకు నొక్కి చెప్పింది. కొత్త సభ్యులు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సాంకేతిక సహాయం అందించడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారీ పరిశ్రమల పరివర్తనలో డి-రిస్క్ పెట్టుబడుల ప్రాముఖ్యత కూడా ఈ సదస్సులో ఎత్తి చూపారు.
సదస్సు తర్వాత ఇండియా ప్రాగణంలో లీడ్ఐటి సమ్మిట్ స్టేట్మెంట్ 2022 బహిరంగంగా ప్రారంభించారు. పబ్లిక్ లాంచ్లో ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమలు, మీడియా పౌర సమాజం సహా అనేక మంది పాల్గొన్నారు.
LeadIT గురించి:
లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్ఐటి) పారిస్ ఒప్పందాన్ని సాధించడానికి అవసరమయ్యే చర్యకు కట్టుబడి ఉన్న దేశాల కంపెనీలు సేకరిస్తుంది. ఇది సెప్టెంబరు 2019లో జరిగిన అమెరికా క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో స్వీడన్ భారతదేశ ప్రభుత్వాలచే ప్రారంభమైంది. దీనికి ప్రపంచ ఆర్థిక వేదిక మద్దతు ఉంది. లీడ్ఐటి సభ్యులు నికర-సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించే లక్ష్యంతో తక్కువ శక్తితో నడిచే ఇంటెన్సివ్ పరిశ్రమల, దేశాలకి చెందిన కార్బన్ ఉద్గారాల నాణ్యత విషయంలో పురోగమించేందుకు సహకరిస్తున్నారు.
మంత్రి ప్రసంగం పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
*****
(Release ID: 1876508)
Visitor Counter : 162