పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ రాజధాని ప్రాంతంలో( ఎన్‌సిఆర్ ) క్షీణిస్తున్న వాయు ప్రమాణాలపై అత్యవసర సమావేశం నిర్వహించిన సిఎక్యుఎం


జి ఆర్ పి ఏ స్థాయి IV ని తక్షణం అమలు చేయాలని నిర్ణయం

ఢిల్లీలోకి వచ్చే వాహనాలు, ఢిల్లీలో తిరుగుతున్న వాహనాలపై ఆంక్షలు విధించే అంశంపై దృష్టి

నాలుగో దశ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సిఎక్యుఎం

प्रविष्टि तिथि: 03 NOV 2022 7:30PM by PIB Hyderabad

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల  దేశ రాజధాని ప్రాంతంలో రానున్న రోజుల్లో వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్న నేపథ్యంలో నివారణ చర్యలు అమలు చేయాలని రాజధాని ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలలో  వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటైన కమిషన్( సిఎక్యుఎం)  గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)కింద చర్యలు అమలు చేయాలని నిర్ణయించింది. తాజా పరిస్థితిని ఈ రోజు జరిగిన అత్యవసర సమావేశంలో సమీక్షించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత వర్గాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది.  డైనమిక్ మోడల్ మరియు వాతావరణ/వాతావరణ సూచనల ప్రకారం ఢిల్లీలో  గాలి నాణ్యత 03.11.2022 నుంచి 05.11.2022 వరకు 'తీవ్ర'/ 'తీవ్రమైన+' కేటగిరీలో ఉండే అవకాశం ఉంది.

సమావేశంలో గాలి నాణ్యత ప్రమాణాలను కమిషన్ లోతుగా సమీక్షించింది. గాలి వేగం తక్కువగా ఉండడం, వ్యవసాయ కార్యక్రమాల వల్ల అగ్ని ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో GRAP - 'తీవ్ర+' వాయు నాణ్యత (ఢిల్లీ AQI >450)  దశ IV ను అమలు చేయడం అవసరమని నిర్ణయించింది. వాయు మరింత క్షీణించకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా  GRAP - 'తీవ్ర+' వాయు నాణ్యత (ఢిల్లీ AQI >450)  దశ IV ను అమలు చేయాల్సి ఉంటుందని సమావేశం గుర్తించింది.

  GRAP - 'తీవ్ర+' వాయు నాణ్యత  దశI, దశ II ,దశ III లో విధించిన ఆంక్షలతో సహా దశ IV కింద ఆంక్షలు అమలు చేయడం జరుగుతుంది. 'తీవ్రమైన+' వాయు నాణ్యత దశ  IV ప్రధానంగా ఢిల్లీలోకి ప్రవేశించే వాణిజ్య ట్రక్కులు, ఢిల్లీలో డీజిల్ వాణిజ్య వాహనాల  కదలికలు, ఢిల్లీలోని BS  VI కాని ప్యాసింజర్ వ్యాన్‌లు, LMVలతో సహా వాహన రాకపోకలపై పరిమితులపై దృష్టి సారిస్తుంది. జిఆర్‌ఎపి కింద చర్యలు అమలు చేసే అధికారం గల వివిధ సంస్థలు    ఎన్‌సిఆర్ మరియు డిపిసిసికి చెందిన కాలుష్య నివారణ బోర్డులు  (పిసిబిలు)  జిఆర్‌ఎపి కింద స్టేజ్ IV చర్యలను ఖచ్చితంగా అమలు  చేయడానికి బాధ్యత తీసుకోవాలని సమావేశం సూచించింది.

జిఆర్‌ఎపి సిటిజన్ చార్టర్‌లో  పొందుపరిచిన చర్యలను అమలు చేసేందుకు సహకరించాలని రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను  సిఎక్యుఎం కోరింది.  జిఆర్‌ఎపి సిటిజన్ చార్టర్‌లో  పొందుపరిచిన చర్యలు.. 

* పిల్లలు, వృద్ధులు మరియు శ్వాసకోశ, హృదయ, సెరెబ్రోవాస్కులర్ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి.

  దశ I, II మరియు IIIలో పేర్కొన్న ఆంక్షలతో దశలతో పాటు మొత్తం ఎన్‌సిఆర్ లో జిఆర్‌ఎపి దశ IV ప్రకారం 8-పాయింట్ కార్యాచరణ ప్రణాళిక నేటి నుండి తక్షణ ప్రభావంతో అమల్లోకి వస్తుంది. ఈ 8-పాయింట్ కార్యాచరణ ప్రణాళికలో వివిధ సంస్థలు, ఎన్‌సిఆర్, డిపిసిసి కాలుష్య నియంత్రణబోర్డులు అమలు చేయాల్సిన/ అమలు జరిగేలా చూడాల్సిన చర్యలు పొందుపరచబడ్డాయి. ఈ దశలు ,,

1. ఢిల్లీలోకి ట్రక్కుల రాకపోకలు నిలిపి వేయాలి (నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే ట్రక్కులు/ అవసరమైన సేవలు అందించే ట్రక్కులు మరియు అన్ని సిఎన్జి /ఎలక్ట్రిక్ ట్రక్కులు మినహా)

2. ఢిల్లీ రిజిస్టర్ అయిన  డీజిల్ తో నడిచే  మీడియం గూడ్స్ వెహికల్స్ (MGV) మరియు హెవీ గూడ్స్ వెహికల్స్ (HGV) ఢిల్లీలో తిరగకుండా నిషేధించాలి.నిత్యావసర  వస్తువులను తీసుకువెళ్లే /అవసరమైన సేవలు అందించే వాహనాలను మినహాయించాలి.

3.BS-VI వాహనాలు మరియు అత్యవసర / అత్యవసర సేవల కోసం ఉపయోగించే వాహనాలు మినహా ఢిల్లీ ఎన్ సి టి,  ఢిల్లీ సరిహద్దులోని  ఎన్‌సిఆర్ జిల్లాల్లో 4-వీలర్ డీజిల్ LMVలను నడపడంపై నిషేధం.

4.   పిఎన్‌జి అవస్థాపన మరియు సరఫరా లేని ప్రాంతాలలో  ఎన్‌సిఆర్ ఆమోదించిన ఇంధనాల ప్రామాణిక జాబితా ప్రకారం  కాకుండా ఇతర  ఇంధనాలు ఉపయోగిస్తూ  ఇంధనాలపై  ఎన్‌సిఆర్‌ పరిధిలో పనిచేస్తున్న  అన్ని పరిశ్రమలను మూసివేయాలి.

గమనిక: పాలు,  డెయిరీ యూనిట్లు మరియు ప్రాణాలను రక్షించే వైద్య పరికరాలు/పరికరాలు, మందులు మరియు ఔషధాల తయారీ పరిశ్రమలు ఆంక్షల పరిధి నుంచి  మినహాయించబడ్డాయి.

5.  హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్ బ్రిడ్జ్‌లు, పవర్ ట్రాన్స్‌మిషన్, పైప్‌లైన్‌లు మొదలైన లీనియర్ పబ్లిక్ ప్రాజెక్ట్‌లలో నిర్మాణ అభివృద్ధి  కార్యకలాపాలను నిషేధించాలి.

6.  ఎన్‌సిఆర్ రాష్ట్ర ప్రభుత్వాలు / GNCTD పబ్లిక్, మునిసిపల్ మరియు ప్రైవేట్ కార్యాలయాలు 50% సిబ్బందితో  పని చేయడం,  మిగిలిన సిబ్బంది  ఇంటి నుండి పని చేయడానికి అనుమతించడంపై నిర్ణయం తీసుకుంటాయి.

7. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు  ఇంటి నుండి పని చేయడానికి  అనుమతించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.

8. పాఠశాలలు/కళాశాలలు/విద్యా సంస్థల మూసివేత, అత్యవసరం కాని  వాణిజ్య కార్యకలాపాలను మూసివేయడం మరియు సరి-బేసి ప్రాతిపదికన వాహనాలు నడపడం వంటి అదనపు అత్యవసర చర్యలను  రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించవచ్చు.

 

తదుపరి సమగ్ర సమీక్ష 06.11.2022న నిర్వహించబడుతుంది. గాలి నాణ్యత సూచన మరియు ఇతర వాతావరణ ప్రమాణాల ఆధారంగా తీసుకోవలసిన జిఆర్‌ఎపి తదుపరి చర్యలపై  సమావేశం   నిర్ణయం తీసుకుంటుంది. 

 

  సవరించిన జిఆర్‌ఎపి షెడ్యూల్ కమిషన్ వెబ్‌సైట్‌   caqm.nic.in లో అందుబాటులో ఉంది.


(रिलीज़ आईडी: 1873613) आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी