ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 2.0ను నిర్వహిస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్


ఢిల్లీ కస్టమ్స్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న "అరణ్య" వన్యప్రాణి గ్యాలరీ బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగం

కార్యక్రమంలో భాగంగా రత్నగిరి బీచ్ మరియు కస్టమ్స్ ఫ్లోటింగ్ జెట్టీని శుభ్రం చేస్తోన్న రెవెన్యూ సెక్రటరీ మరియు పూణే కస్టమ్స్ అధికారులు

Posted On: 20 OCT 2022 12:01PM by PIB Hyderabad

పెండింగ్ అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్ (సిబిఐసి) అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 31, 2022 వరకు ప్రత్యేక కార్యక్రమం (ఎస్‌సిపిడిఎం) 2.0 ఉత్సాహంగా నిర్వహిస్తోంది. కార్యక్రమంలో భాగంగా విఐపి సూచనలు మరియు పబ్లిక్ ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి. 44లో 23 విఐపీ సూచనలు, 722 కంటే ఎక్కువ పబ్లిక్ గ్రీవెన్స్ అలాగే 120 కంటే ఎక్కువ పబ్లిక్ గ్రీవెన్స్ అప్పీళ్లు ఇప్పటి వరకు పరిష్కరించబడ్డాయి.

అంతేకాకుండా దేశవ్యాప్తంగా సిబిఐసికు చెందిన అన్ని ఫీల్డ్ ఆఫీస్‌లలో  క్లీన్‌నెస్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. ఇప్పటికే 1,344 బహిరంగ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. గతేడాది నిర్వహించిన సంఖ్య కంటే ఇది రెట్టింపు.

2021-22 సంవత్సరంలో సుమారుగా 5.8 లక్షల ఫైళ్లు సమీక్షించబడ్డాయి. చివరకు వాటిలో సుమారు 3.8 లక్షల ఫైళ్లు తొలగించబడ్డాయి. ఏడాది వ్యవధిలో నిరంతర ప్రయత్నాల కారణంగా సిబిఐసి ఇ-ఆఫీస్‌కు మారింది. ఈ కారణంగా భౌతిక ఫైల్‌ల సంఖ్య చాలా తక్కువగా మిగిలి ఉంది. దానిని సమీక్షించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారు 64,000 ఫైళ్లు సమీక్షించబడ్డాయి. వాటిలో ఇప్పటికే సుమారుగా  20,000 ఫైళ్లను తొలగించారు.

స్క్రాప్‌ను తొలగించడం అనేది గుర్తించబడిన మరొక అంశం. 2021-22 సంవత్సరంలో సుమారు 37,000 చదరపు అడుగుల స్క్రాప్ తొలగించబడింది. ఈ సంవత్సరం సిబిఐసి ఇప్పటికే దాదాపు 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లియర్ చేయబడింది మరియు అదనపు స్థలాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సిబిఐసి కార్యాలయాలలో పబ్లిక్ స్థలాల నాణ్యతను పెంపొందించే ఉద్దేశ్యంతో ఢిల్లీ కస్టమ్స్ న్యూ ఢిల్లీలోని న్యూ కస్టమ్స్ హౌస్ రెండవ అంతస్తు కారిడార్లలో "అరణ్య" అనే వన్యప్రాణి గ్యాలరీని ఏర్పాటు చేసింది.అక్టోబర్ 7, 2022న సిబిఐసి ఛైర్మన్ శ్రీ వివేక్ జోహ్రీ చేతులమీదుగా ఇది ప్రారంభించబడింది.  గ్యాలరీ వన్యప్రాణుల రక్షకులుగా భారతీయ కస్టమ్స్ ప్రయత్నాలను ప్రదర్శిస్తుంది, అలాగే కొనసాగుతున్న #స్పెషల్‌క్యాంపెయిన్2.0లో భాగంగా పరిశుభ్రతను మరియు స్వచ్ఛతా స్ఫూర్తిని జరుపుకుంటుంది. ఇది డిపార్ట్‌మెంట్  ఉత్తమ అభ్యాసాలలో ఒకటిగా హైలైట్ చేయబడింది.

 

image.png

image.png

రెవెన్యూ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్‌తో పాటు శ్రీ ఎస్.ఎమ్.టాటా, సిజిస్టీ & కస్టమ్స్ పూణే జోన్ చీఫ్ కమీషనర్ మరియు జోన్‌లోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్‌ డ్రైవ్ ఫలితంగా అక్టోబర్ 13, 2022న రత్నగిరి బీచ్ మరియు కస్టమ్స్ ఫ్లోటింగ్ జెట్టీని క్లీన్ చేసే డ్రైవ్‌లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలతో బీచ్ శుభ్రం చేయబడింది.

 

image.png

image.png

 

డిఏఆర్‌పిజి&డిఒపిడబ్ల్యూ శ్రీ వి.శ్రీనివాస్ గౌహతిలోని జీఎస్టీ భవన్‌ను సందర్శించి జోన్‌లోని అధికారులతో స్పెషల్ క్యాంపెయిన్ 2.0 పురోగతిని సమీక్షించారు.సిజిఎస్టీ మరియు కస్టమ్స్ జోన్ గౌహతిలో విస్తృతమైన పరిశుభ్రత ప్రయత్నాల ఫలితంగా సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో అదనపు కార్యాలయ స్థలం ఏర్పడింది.  జిఎస్టీ భవన్‌లో జరిగిన ఫైలు ష్రెడింగ్ కార్యక్రమంలో జోన్‌లోని చీఫ్ కమీషనర్ అశుతోష్ అవస్తి మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

image.png

image.png


పరిశుభ్రతను నిర్ధారించడానికి మరియు నిర్వహించే బహిరంగ ప్రదేశాల నాణ్యతను పెంచడానికి సిబిఐసి కట్టుబడి ఉంది.

 

****


(Release ID: 1869779) Visitor Counter : 148