రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

డిసెంబర్ 2024 నాటికి తమిళనాడులోని చెన్నై పోర్ట్ నుండి మధురవాయల్ కారిడార్ వ‌ర‌కు చేప‌ట్టిన ప్రాజెక్ట్ పూర్తి

Posted On: 03 OCT 2022 1:12PM by PIB Hyderabad

న‌వ భార‌తావ‌నిలో ఎలాంటి అవాంత‌రాలు లేని నిరంత‌రాయ మల్టీమోడల్ కనెక్టివిటీని ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌ను అందించడానికి కృషి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. ఈ రోజు ఆయ‌న త‌న వరుస ట్వీట్లలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు,  చెన్నై పోర్ట్ నుండి తమిళనాడులోని మధురవాయల్ కారిడార్ వరకు రూ.5800 కోట్ల అంచనా వ్యయంతో  అభివృద్ధి చేయబడుతోంద‌ని అన్నారు. ఈ ప్రతిపాదిత 20.5 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ స్ట్రెచ్‌ను 4 విభాగాలుగా అభివృద్ధి చేస్తామని, చెన్నై పోర్ట్‌లో ప్రారంభమ‌య్యే ప్రాజెక్టు మధురవాయల్ గ‌త ఇంటర్‌చేంజ్ తర్వాత ముగుస్తుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు డిసెంబర్ 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని, ఇది చెన్నైకి వెళ్లే ఓడరేవు ట్రాఫిక్ పూర్తిగా అంకితమైన ఫ్రైట్ కారిడార్‌గా ఉపయోగపడుతుందని అన్నారు. చెన్నై పోర్టు నిర్వహణ సామర్థ్యాన్ని 48% పెంచుతుందని,  ఓడరేవులో వేచి ఉండే సమయాన్ని కూడా 6 గంటల మేర తగ్గిస్తుంద‌ని శ్రీ గడ్కరీ వివ‌రించారు.
                                                                                   

***********



(Release ID: 1864876) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi , Tamil