సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

గాంధీ జయంతిని పురస్కరించుకుని అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించిన కేవీఐసీ

Posted On: 02 OCT 2022 8:07PM by PIB Hyderabad

గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ బాపు స‌మాధి రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఖాదీ భవన్ ఇండియా యొక్క ప్ర‌ధాన‌ స్టోర్‌ను సందర్శించారు, ఈ సంద‌ర్భంగా అక్కడ కేవీఐసీ  అక్టోబర్ 2 నుండి అన్ని డిపార్ట్‌మెంటల్ సేల్స్ అవుట్‌లెట్‌లలో అన్ని ఉత్పత్తులపై (ఖాదీపై 20 శాతం మరియు విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులపై 10 శాతం) చాలా తగ్గింపును ప్రకటించింది. చాలా కాలంగా ఖాదీ ప్రియులు ఎదురుచూస్తున్న డిస్కౌంట్ సేల్ అందుబాటులోకి వ‌చ్చింది.  గాంధీ జయంతి సందర్భంగా, షోరూమ్ ఒక రోజులో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. కేవీఐసీ  న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్‌లో 2022 అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 5 వరకు ఖాదీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది, దీనిని ఈ రోజు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా క్యాబినెట్ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు చైర్మన్ కేవీఐసీ  సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో  చరఖా తిప్పడానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రదర్శనను కూడా ప్రదర్శించారు. ఖాదీ ఎగ్జిబిషన్ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులను విక్రయానికి అందిస్తుంది. ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ న్యూ ఢిల్లీలోని కుతుబ్ మినార్ వద్ద సామాన్య ప్రజల కోసం డిస్‌ప్లే కమ్ సేల్ స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది.

***



(Release ID: 1864691) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi , Punjabi