హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (SDMF) కింద ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా రాష్ట్రాలకు రూ.488 కోట్ల విడుదలకు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆమోదం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆలోచనల ప్రకారం, ముందస్తు హెచ్చరిక, వేగవంతమైన నివారణ, ఉపశమన చర్యలు, ముందస్తు సంసిద్ధత ఆధారంగా ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి ప్రభుత్వం శాస్త్రీయ కార్యక్రమాన్ని రూపొందించింది.



15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2021-22 నుండి 2025-26 సంవత్సరాలకు SDMF కోసం రూ.32,031కోట్లు, నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (NDMF) కోసం రూ.13,693 కోట్లు కేటాయింపు

Posted On: 30 SEP 2022 5:23PM by PIB Hyderabad

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా నేడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉపశమన కార్యకలాపాలను చేపట్టడం కోసం 2021-22 సంవత్సరానికి ఉత్తరప్రదేశ్, పంజాబ్ గోవా మూడు రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (SDMF) కేంద్ర వాటాగా రూ. 488.00 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు.

 

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం 2021-22 నుండి 2025-26 సంవత్సరాలకు SDMF కోసం రూ.32,031 కోట్లు, జాతీయ విపత్తు ఉపశమన నిధి (NDMF) కోసం 13,693 కోట్లు కేటాయించింది. ఈ ఉపశమన నిధులు స్థానిక స్థాయి కమ్యూనిటీ ఆధారిత కార్యకలాపాలను చేపట్టడానికి ఉపయోగించబడతాయి. ఇది విపత్తుల నుండి వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది. పర్యావరణ అనుకూల విధానాలను, జీవనోపాధి పద్ధతులను ప్రోత్సహిస్తుంది.

 

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, 1990 కి పూర్వం, భారత ప్రభుత్వం ఉపశమన-కేంద్రీకృత విధానాన్ని కలిగి ఉందని.. ప్రాణాలను, ఆస్తిని రక్షించే అవకాశం లేదని, అది ప్రణాళికా ప్రక్రియలో భాగం కాదని నొక్కిచెప్పారు. ఇప్పుడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శనికత ప్రకారం, ముందస్తు హెచ్చరికలు, వేగవంతమైన నివారణ చర్యలు, ఉపశమన, ముందస్తు సంసిద్ధత ఆధారంగా ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి శాస్త్రీయ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.

 

ఫిబ్రవరి 5, 2021న జాతీయ స్థాయిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. SDMF, NDMF కార్యాచరణకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది.

 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 21 రాష్ట్రాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ లను ఏర్పాటు చేసిన తర్వాత రూ. 3,382.24 కోట్లు ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను విడుదల చేశారు.

 

***


(Release ID: 1864079)
Read this release in: English , Urdu , Punjabi