శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సేవా పఖ్వాడా ను పురస్కరించుకుని న్యూ ఢిల్లీలోని మదర్ థెరిసా క్రెసెంట్ సమీపంలోని సర్దార్ పటేల్ క్యాంప్ వద్ద మురికివాడల మహిళలకు కుట్టు యంత్రాలను పంపిణీ చేసిన అనంతరం వృద్ధాశ్రమాన్ని సందర్శించి, వయోవృద్ధుల తో సంభాషించిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
సేవా పఖ్వాడా సందర్భంగా దేశవ్యాప్తంగా, 2022 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాలు, దివ్యాంగులకు ఉచిత వైద్య పరికరాలు, ఉచిత కోవిడ్ బూస్టర్ డోసులు, రేషన్ కిట్ ల పంపిణీ వంటి వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్న - కేంద్ర మంత్రి
ఒక సారి ఉపయోగపడే ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా సరసమైన, ధృడమైన గుడ్డ సంచులను తయారు చేయడంలో ఈ మహిళల నైపుణ్యాలను మెరుగుపరచడానికి సహాయం చేయాలని సర్దార్ పటేల్ కుట్టు కేంద్రం నిర్వాహకులను కోరిన - కేంద్ర మంత్రి
వారి మొత్తం ఉత్పత్తులను కేంద్రీయ భండార్ ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
నేతాజీ నగర్ లోని సంధ్యా హోమ్-ఫర్-సీనియర్-సిటిజన్స్ లో ఆశ్రయం పొందుతున్న సుమారు 30 మంది వయో వృద్ధులతో సంభాషించిన - కేంద్ర మంత్రి
వృద్ధుల బంధువుల కోసం అతిథి గదిని నిర్మిస్తామని, వృద్ధాశ్రమంలో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
27 SEP 2022 4:54PM by PIB Hyderabad
సేవా పక్షోత్సవాలను పురస్కరించుకుని, న్యూఢిల్లీలోని మదర్ థెరిసా క్రెసెంట్ సమీపంలోని సర్దార్ పటేల్ క్యాంప్ వద్ద మురికివాడల మహిళలకు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు విద్యుత్తు, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ రోజు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, బీ.జే.పీ. పాలిత రాష్ట్రాలు, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా పక్షోత్సవాలను నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. ఈ సేవా పక్షోత్సవాలలో భాగంగా, రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాలు, రేషన్ కిట్ ల పంపిణీ, దివ్యాంగులకు ఉచిత వైద్య పరికరాలు, ఉచిత కోవిడ్ బూస్టర్ డోస్ లు వంటి వివిధ కార్యక్రమాల్లో, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు తమ సేవలను అందిస్తారు.
సేవా పక్షోత్సవాల సందర్భం గా, 2025 నాటికి టి.బి. రహిత భారతదేశాన్ని సాధించాలనే ప్రధానమంత్రి మోదీ ఆశయాన్ని నెరవేర్చే దిశగా, టి.బి. రోగుల రోజువారీ అవసరాలను తీర్చడానికి కేంద్ర మంత్రులు, బి.జె.పి. నాయకులు టి.బి. రోగులను ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకుంటున్నారని మంత్రి తెలియజేశారు
అంతకుముందు, డాక్టర్ జితేంద్ర సింగ్ కుట్టు మిషన్ల లబ్ధిదారులు ప్రతి ఒక్కరితో సంభాషించారు. వారిలో చాలా మంది బాలికలు, మహిళలు కుట్టు పనిలో నైపుణ్యం కలిగి ఉన్నారని పేర్కొంటూ, అయితే, వారి అవసరాలకు అనుగుణంగా తగిన యంత్రాలు లేని లోటు ఇప్పుడు తీరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య వారిని శక్తివంతం చేయడం తో పాటు, ఆర్థికంగా ఆత్మ-నిర్భరత్వాన్ని (స్వయం సమృద్ధి) సాధించడానికి కూడా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఒక సారి ఉపయోగపడే ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా సరసమైన, ధృడమైన గుడ్డ సంచులను తయారు చేయడంలో ఈ మహిళల నైపుణ్యాలను మెరుగుపరచడానికి సహాయం చేయాలని సర్దార్ పటేల్ కుట్టు కేంద్రం నిర్వాహకులకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. వారి మొత్తం ఉత్పత్తులను కేంద్రీయ భండార్ ద్వారా కొనుగోలు చేస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
సేవా పక్షోత్సవాల సందర్భం గా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, "చివరి వ్యక్తి యొక్క ఎదుగుదల" అంటే అంత్యోదయ తత్వానికి ప్రతీకగా నిలిచిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ని సెప్టెంబర్ 25వ తేదీ జరుపుకున్నామని చెప్పారు. "ప్రతి కన్ను నుండి కన్నీటిని తుడవడమే" లక్ష్యంగా పెట్టుకున్న గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన ఈ సేవా పక్షోత్సవాలు ముగుస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ఒక లీటరు పళ్ళ రసం, చ్యవన్ ప్రాశ్ ప్యాకెట్టు, బిస్కెట్లు, శనగపప్పు, దాలియా, పప్పు మిశ్రమం, హార్లిక్స్ తో కూడిన ఆరోగ్యకరమైన ఆహార కిట్ లను సుమారు 125 మంది పేద మహిళలకు పంపిణీ చేశారు.
నేతాజీ నగర్ లోని సంధ్యా హోమ్-ఫర్-సీనియర్-సిటిజన్స్ వద్ద జరిగిన మరొక కార్యక్రమంలో, డాక్టర్ జితేంద్ర సింగ్ సుమారు 30 మంది వృద్ధాశ్రమ వృద్ధులతో సంభాషించారు. వీరిలో, 10 మంది మహిళలతో సహా పలువురు వయోవృద్ధులు రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వారు సంరక్షణ గృహంలో ఏర్పాట్లు, అందుతున్న సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
వారి ఇబ్బందులు విన్న డాక్టర్ జితేంద్ర సింగ్ వృద్ధుల వద్దకు వచ్చే బంధువుల కోసం అతిథి గదిని నిర్మిస్తామని, వృద్ధాశ్రమాల్లో నిత్యం వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది వయో వృద్ధులకు అదనపు నర్సింగ్ సంరక్షణ అందించడానికి కూడా ఆయన అంగీకరించారు. వీరందరికీ ఢిల్లీలోని కేంద్రీయ భాండార్ ఆరోగ్యకరమైన ఆహార కిట్ లను అందజేసింది.
<><><>
(Release ID: 1862726)