సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
రేపు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరగనున్న జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ మెగా ఈవెంట్/కాన్క్లేవ్
Posted On:
27 SEP 2022 5:15PM by PIB Hyderabad
పార్లమెంటు సభ్యులు మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, శ్రీ కిరీట్ ప్రేమ్జీభాయ్ సోలంకి జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తారు. 28 సెప్టెంబర్, 2022న జరగనున్న ఈ కార్యక్రమంలో.. శ్రీ నరహరి అమీన్, రాజ్యసభ ఎంపీ, శ్రీ కిరీట్ జె.పర్మార్, మేయర్, అహ్మదాబాద్, శ్రీ రాకేష్ షా, ఎమ్మెల్యే, అహ్మదాబాద్, శ్రీ సురేష్ పటేల్, ఎమ్మెల్యే, మణినగర్ మరియు ఇతర సీనియర్ ప్రముఖులు పాల్గొంటారు.ఎస్సీ-ఎస్టీ హబ్ (ఎన్ఎస్ఎస్హెచ్) పథకంతోపాటు మంత్రిత్వ శాఖ అమలు చేస్తోన్న ఇతర పథకాల గురించి అవగాహన కల్పించడానికి జాతీయ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కాన్క్లేవ్ను నిర్వహిస్తోంది. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో ఎస్సీ-ఎస్టీ ఎంఎస్ఈల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఔత్సాహికులతో పాటుఇప్పటికే ఉన్న ఎస్సీ-ఎస్టీవ్యవస్థాపకులు, సిపిఎస్ఈలు, పరిశ్రమల సంఘాలు, రుణాలు ఇచ్చే సంస్థలతో సంభాషించడానికి అవకాశం కూడా ఉంటుంది.
ఉపాధి కల్పన మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో ఎంఎస్ఎంఈ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ రంగం 11 కోట్ల మందికి పైగా ఉద్యోగులతో 6 కోట్ల యూనిట్లను కలిగి ఉంది. జీడీపీకి దాదాపు 30% సహకారంతో ఇది భారతదేశం నుండి మొత్తం ఎగుమతుల్లో 45% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడింది.
భారత ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత వృద్ధి కోసం భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ నేషనల్ను ప్రారంభించింది
షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగ హబ్ (ఎన్ఎస్ఎస్హెచ్) పథకం లబ్దిదారుల సామర్ధ్యాన్ని పెంపొందించడం మరియు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం అలాగే ఎస్సీ-ఎస్టీ జనాభాలో "ఆంట్రప్రెన్యూర్షిప్ సంస్కృతి"ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సిపిఎస్ఈ అయిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) అమలు చేస్తోంది.
మన ఆర్థిక వ్యవస్థపై ఎంఎస్ఎంఈల ప్రభావం దృష్ట్యా యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి అలాగే 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వారు సమగ్ర పాత్ర పోషించే అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కేంద్రీకృత ప్రయత్నాలు చేయడం అత్యవసరం.
దేశం ఆర్థిక శ్రేయస్సు కోసం ఎంఎస్ఎంఈ రంగాన్ని అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం.ఎంఎస్ఎంఈలను శక్తివంతం చేయడానికి మరియు ప్రపంచ విలువ గొలుసులో అనుకూలంగా మారడానికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కృషిచేస్తోంది. రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ఎస్సీ-ఎస్టీ ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అందించే వివిధ పథకాల గురించి తెలుసుకుంటే వారిలో కొత్త ఆలోచనలు రావడంతో పాటు వారి పరిధులను విస్తరించడానికి సహాయపడతాయి.
********
(Release ID: 1862684)