శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

2025 నాటికి భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగం 50 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం:కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


న్యూఢిల్లీలో "సీజింగ్ ది గ్లోబల్ ఆపర్చునిటీ" పై జరిగిన 14వ సిఐఐ గ్లోబల్ మెడ్ టెక్ సమ్మిట్ ను ఉద్దేశించి ముఖ్య అతిథిగా ప్రసంగించిన
మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రధాన మంత్రి శ్రీ మోదీ అధ్వర్యంలో, గత రెండు సంవత్సరాలలో ఇన్నోవేషన్, సాంకేతిక పరిజ్ఞానంపై మరింత దృష్టి సారించిన ఆరోగ్య సంరక్షణ రంగం; వచ్చే ఐదేళ్లలో డిజిటల్ హెల్త్ కేర్ టూల్స్ లో పెట్టుబడులు పెంచుకోవాలని
లక్ష్యంగా పెట్టుకున్న 80 శాతం ఆరోగ్య
సంరక్షణ వ్యవస్థలు: డాక్టర్ జితేంద్ర సింగ్

వినూత్న మెడ్ టెక్ ఉత్పత్తులు, పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న భారతీయ ఆవిష్కర్తలు: సరళమైన ఎఫ్ డిఐ , ఇతర విధాన సంస్కరణలకు ధన్యవాదాలు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 07 SEP 2022 4:04PM by PIB Hyderabad

2025 నాటికి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ శాఖ  సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ) , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

న్యూఢిల్లీలో "సీజింగ్ ది గ్లోబల్ ఆపర్చునిటీ" పై జరిగిన 14 సిఐఐ గ్లోబల్ మెడ్ టెక్ సమ్మిట్ ను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గత రెండేళ్లలో ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్రంగం ఇన్నోవేషన్, టెక్నాలజీపై మరింత దృష్టి సారించిందని, రాబోయే ఐదేళ్లలో డిజిటల్ హెల్త్ కేర్ టూల్స్ లో తమ పెట్టుబడులను పెంచుకోవాలని 80 శాతం హెల్త్ కేర్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు

 

2025 నాటికి టెలిమెడిసిన్ కూడా 5.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సాంకేతిక జోక్యం తో రూపొందించిన సంజీవని, వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లకు అవకాశం కల్పించిందని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలను వారి స్వంత ఇళ్ల నుంచి సేవలు పొందేలా ప్రధాన నగరాల్లోని వైద్యులతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు.

 

వచ్చే పదేళ్లలో దిగుమతిపై ఆధారపడటాన్ని 80 శాతం నుంచి 30 శాతం కంటే తక్కువకు తగ్గించడం, మేక్ ఇన్ ఇండియా ద్వారా మెడ్ టెక్ లో 80 శాతం స్వావలంబన ఫలితాన్ని స్మార్ట్ మైలురాళ్లతో అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దిశగా భారత ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేయడం కోసం నిర్మాణాత్మక మైన, సుస్థిరమైన సంస్కరణల ను చేపట్టిందని, ఎఫ్ డి ఐల ను

ప్రోత్సహించడానికి అనువైన విధానాలను కూడా ప్రకటించిందని ఆయన తెలిపారు.

‘‘ఇది ధోరణిలో మార్పుకు దారితీసింది, దేశం మెడ్ టెక్ సృజనాత్మకతకు కేంద్రంగా మారింది. పాశ్చాత్య ఉత్పత్తులను స్వీకరించడానికి బదులుగా, భారతీయ ఆవిష్కర్తలు వినూత్న మెడ్ టెక్ ఉత్పత్తులు, పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారు. హెల్త్ టెక్/ మెడ్ టెక్ ఎకోసిస్టమ్ వేగవంతమైన విస్తరణకు దారితీసే ఒక మార్పు దశకు భారతదేశం చేరుకుంది‘‘ అని తెలిపారు.

 

రంగంలో విపరీతమైన పెరుగుదలకు అవసరమైన అన్ని వనరులను భారత్ కలిగి ఉందని, వీటిలో పెద్ద జనాభా, బలమైన ఫార్మా , మెడికల్ సప్లై చైన్, 750 మిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్  వినియోగదారులు, ప్రపంచవ్యాప్తంగా విసి ఫండింగ్ తో మూడవ అతిపెద్ద స్టార్టప్ పూల్, ప్రపంచ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి చూస్తున్న సృజనాత్మక టెక్ వ్యవస్థాపకులు ఉన్నట్టు

డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రంగంలో వ్యాపారం చేసే దృశ్యాన్ని మార్చడం ద్వారా మహమ్మారి అదనపు ప్రేరణను అందించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా టెలి కన్సల్టేషన్, ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, రిమోట్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ వంటి కీలక రంగాల్లో ఆరోగ్య సంరక్షణ రంగానికి భారీ అవకాశాలను కల్పించినట్లు ఆయన తెలిపారు.

 

విజన్ @ 2047 గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, వైద్య పరికరాల్లో భారతదేశం 14% - 15% ఎగువన అగ్రశ్రేణి మార్కెట్లలో ఒకటిగా మారుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్ 2020లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం ద్వారా ప్రపంచ స్థానాన్ని సాధించవచ్చని, దేశీయ వినియోగాన్ని పెంచడానికి , ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 73 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ స్థానాన్ని సాధించవచ్చని ఆయన అన్నారు.

 

100-300 బిలియన్ డాలర్ల పరిశ్రమను చేరుకోవడానికి వైద్య పరికరాల రంగం ప్రపంచ మార్కెట్ వాటాలో 10-12% సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ప్రోడక్ట్ అభివృద్ధి , సృజనాత్మకతను పెంచడానికి వైద్య పరికరాల వేగవంతమైన క్లినికల్ టెస్టింగ్ కోసం దేశంలో 50 క్లస్టర్లు ఉంటాయని మంత్రి తెలిపారు. ఆయుర్దాయం, వ్యాధి భారాల్లో మార్పు, ప్రాధాన్యతల్లో మార్పులు, పెరుగుతున్న మధ్యతరగతి , ఆరోగ్య బీమాలో పెరుగుదల, వైద్య మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విధాన మద్దతు, ప్రోత్సాహకాలు రంగాన్ని ముందుకు నడిపించగలవని ఆయన అన్నారు.

 

మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో భారతీయ వైద్య పరికరాల రంగాన్ని ఒక ప్రకాశవంతమైన విభాగం గా గుర్తించినందున ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాల తయారీ కేంద్రంగాకీలక ఎగుమతిదారుగా మారడం ద్వారా ప్రపంచ ప్రాధాన్యతా స్థానం పొందడానికి ఇది సరైన సమయం అని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

గుర్తింపు పరిశ్రమకు తక్కువ-టెక్ సెగ్మెంట్ నుండి మరింత అధునాతనమైన డివైజ్ వరకు ఉన్న డివైజ్-సెగ్మెంట్ వాల్యూ చైన్లో దాని సామర్ధ్యాన్ని మరింతగా పెంపొందించు కోవడానికి చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించిందని ఆయన అన్నారు.

 

<><><><><>



(Release ID: 1857565) Visitor Counter : 120


Read this release in: English , Urdu , Hindi , Punjabi