రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022-23లో రికార్డు ఉత్పత్తిని సాధించేందుకు వేగంగా ముందుకు సాగుతున్న‌ భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు


- 2021-22లో ఎల్‌హెచ్‌బీ కోచ్ ఉత్పత్తి 45 శాతం పెరిగింది మరియు లోకో ఉత్పత్తిలో 34 శాతం వృద్ధి

- రాయ్‌బరేలీ కోచ్ ఫ్యాక్టరీ త్వరలో 12000 మరియు 9000 హెచ్‌పీ లోకోమోటివ్‌ను ఆధునిక ఇంధన సామర్థ్యంతో తయారీ

Posted On: 06 SEP 2022 4:59PM by PIB Hyderabad

భారతీయ రైల్వేల ఉత్పత్తి యూనిట్లు అయిన‌.. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌),  కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్‌), రాయ్ బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంసీఎఫ్‌), చిత్తరంజన్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌డ‌బ్ల్యు) , వార‌ణాసిలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎస్ఐఎల్‌డ‌బ్ల్యు), పాటియాలాలోని రైల్వే పాటియాలా లోకోమోటివ్ వర్క్స్ (పీఎల్‌డ‌బ్ల్యు), బెంగుళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ (ఆర్‌డ‌బ్ల్యుఎఫ్‌) మరియు బేలాలోని రైల్ వీల్ ప్లాంటులు 2022-23లో రికార్డు ఉత్పత్తిని సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాయి. రైల్వేలోని అన్ని ఉత్పత్తి యూనిట్లు చాలా అద్భుతంగా పని చేస్తున్నాయి.  ఈ ప్లాంట్లు భారతీయ రైల్వే పెరుగుతున్న అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా అవసరానికి త‌గ్గట్టుగా సరఫరా చేస్తున్నాయి.
భార‌త రైల్వేకు చెందిన అన్ని ఉత్పత్తి యూనిట్లు తాజా ఎం&పి, షెడ్‌లు & సౌకర్యాల రూపంలో ఆధునికీకరణ ఇన్‌పుట్‌లను పొందడం కొనసాగిస్తున్నాయి. కోవిడ్ వ్యాప్తి నెల‌కొని ఉన్న సమయంలో కూడా, రైల్వే ప్రొడక్షన్ యూనిట్లు సూచించిన కోవిడ్ నిబంధనలను అనుసరించడం ద్వారా కోచ్‌లను ఉత్పత్తి చేయడం ద్వారా రైల్వే రంగానికి మద్దతునిస్తూనే ఉన్నాయి. ఐసీఎఫ్‌,
ఆర్‌సీఎఫ్ & ఎంసీఎప్‌లు కోచ్ త‌యారీ యూనిట్లు, ఈ యూనిట్లు వందే భారత్, ఎల్‌హెచ్‌బీ, ఈఎంయులు, మెమూ, విస్టాడోమ్ మరియు ఇతర కోచ్‌లను తయారు చేస్తున్నాయి. మొదటి స్వదేశీ రైలు సెట్‌ను కేవలం 18 నెలల్లో రూపొందించి, తయారు చేసి టీ18గా పిలిచిన ఘనత ఐసీఎఫ్‌కి ఉంది. అలాంటి రెండు రైళ్లు ఇప్పటికే ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-కత్రా మధ్య నడుస్తున్నాయి.
ఇప్పుడు వందే భారత్ కొత్త వెర్షన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రధానమంత్రి దృష్టి కోణం ప్రకారం ఆగస్టు 23 నాటికి మరో 75 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని భార‌తీయ రైల్వే యోచిస్తోంది. సీఎల్‌డ‌బ్ల్యు, వీఎల్‌డ‌బ్ల్యు మరియు వీఎల్‌డ‌బ్ల్యు  అనేవి రైల్వే లోకోమోటివ్‌ల తయారీ యూనిట్లు. నేడు వారు అధునాతన ఎలక్ట్రిక్ లోకోలను అంటే డ‌బ్యూఏజీ9 మరియు డ‌బ్యూఏజీ7లను తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తి యూనిట్లలో ఆధునిక శక్తి సామర్థ్యం గల 12000హెచ్‌పీ, 9000హెచ్‌పీ లోకోమోటివ్‌లు కూడా త్వరలో తయారు చేయనున్నారు. ఇంకా ఆర్‌డ‌బ్ల్యుఎఫ్ మరియు ఆర్‌డ‌బ్ల్యుపీ అనేది చక్రాలు మరియు చక్రాల సెట్‌లను ఉత్పత్తి చేసే యూనిట్లు, అన్ని రకాల రోలింగ్ స్టాక్‌లను సరఫరా చేస్తాయి. రైల్ వీల్ ప్లాంట్ బేలాపూర్ & రైల్ వీల్ ఫ్యాక్టరీ యెహ్లాంక ఈ ఆర్థిక సంవత్సరంలో (ఆగస్టు వరకు) 92118 చక్రాలను ఉత్పత్తి చేశాయి, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో ఉత్పత్తి చేయబడిన చక్రాల కంటే 6.5 రెట్లు ఎక్కువ. అదేవిధంగా, రైలు యాక్సిల్ ఉత్పత్తి కూడా ఇదే కాలంలో 7% పెరిగింది. గత సంవత్సరం 2021-22లో, అన్ని ఉత్పత్తి యూనిట్లు రికార్డు ఉత్పత్తిని సాధించాయి. గత సంవత్సరం, ఎల్‌హెఛ్‌బీ కోచ్ ఉత్పత్తి 45% పెరిగింది మరియు లోకో ఉత్పత్తి 34% పెరిగింది. ఈ సంవత్సరం 22-23లో ఇంకా ఎక్కువ ఉత్పత్తి లక్ష్యాల‌ను ఆయ‌ ఉత్పత్తి యూనిట్లకు ఇవ్వబడ్డాయి. కొన్ని సరఫరా గొలుసు పరిమితులు ఉన్నప్పటికీ, అన్నీ ఆయా ల‌క్ష్యాల‌ను సాధించడానికి సిద్ధంగా ఉన్నాయి.
రైల్వేలు సరుకు రవాణా మార్కెట్ వాటాను ప్రస్తుతం ఉన్న 28% నుండి వచ్చే 10 సంవత్సరాలలో 40 శాతానికి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను కలిగి ఉంది. దీని కోసం, సామర్థ్యం పెంపుదల, రోలింగ్ స్టాక్‌ల మ‌రింత ఆధునికీకరణ, ప్రపంచ స్థాయి స్టేషన్లు & ట్రాక్‌లు మొదలైన వాటికి నిధులు అందుబాటులో ఉంచబడ్డాయి. దీని ప్రకారం పెద్ద సంఖ్య‌లో. వందే భారత్ వంటి ఆధునిక రకానికి చెందిన రోలింగ్ స్టాక్‌లు, 3-దశల ఈఎంయులు & మెమూల‌ ఉత్పత్తి యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి.
                                                                                             

***


(Release ID: 1857364)
Read this release in: Hindi , English , Urdu