సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ పథకాలు
प्रविष्टि तिथि:
08 AUG 2022 3:24PM by PIB Hyderabad
03.08.2022 నాటికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ యొక్క ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్లో నమోదు చేయబడిన మొత్తం 99,58,903 ఎంఎస్ఎంఈ లలో 17,96,408 మంది మహిళలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కలిగి ఉన్నారు.
ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ రెండు ప్రధాన క్రెడిట్ పథకాలను అమలు చేస్తుంది. మైక్రో & స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) మరియు క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (CGS). 2008-09లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి, 02.08.2022 నాటికి, మొత్తం 2,50,319 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయం అందించబడింది. 2000లో క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ప్రారంభం నాటినుంచి, 30.06.2022 నాటి వరకు మొత్తం 11,92,689 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు మైక్రో & స్మాల్ ఎంటర్ప్రైజెస్కు గ్యారెంటీ అందించబడింది.
మహిళలతో సహా సూక్ష్మ & చిన్న పరిశ్రమలకు అనుషంగిక ఉచిత క్రెడిట్ని అందించడానికి ప్రభుత్వం 2000 నుండి, మైక్రో & స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (CGS)ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మహిళా సంస్థలకు 5% అదనపు హామీ కవరేజీ లభిస్తుంది. రూ. 5 లక్షల నుండి రూ.50 లక్షల కంటే ఎక్కువ రుణాలు పొందిన మహిళలకు 0.15% అదనపు రాయితీలు లభిస్తాయి.
సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాధానం ఇచ్చారు.
****
(रिलीज़ आईडी: 1850220)
आगंतुक पटल : 153