కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూరల్ ఫైబర్ నెట్‌వర్క్

प्रविष्टि तिथि: 03 AUG 2022 3:18PM by PIB Hyderabad

దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి భారత్‌నెట్ ప్రాజెక్ట్ దశలవారీగా అమలు చేయబడుతుంది. 25.07.2022 నాటికిప్రాజెక్ట్ కింద మొత్తం 1,78,044 గ్రామపంచాయతీలు సర్వీస్‌కు సిద్ధంగా ఉన్నాయి. భారత్‌నెట్ ప్రాజెక్ట్ యొక్క పరిధి ఇటీవల దేశంలోని గ్రామ పంచాయతీలను దాటి అన్ని నివాస గ్రామాల వరకు విస్తరించబడింది. ఇది 2025 నాటికి పూర్తి కానుంది. ఈ క్రింది అంశాల కారణంగా ప్రాజెక్ట్ అమలుపై ప్రభావం పడింది:

  1. భారత్‌నెట్ ఒక సవాలుతో కూడుకున్న ప్రాజెక్ట్దేశంలోని మారుమూల ప్రాంతాలలో గ్రామపంచాయతీల ద్వారా విస్తృతంగా విస్తరించి ఉన్నాయి. కష్టమైన భూభాగాలను (కొండ ప్రాంతాలను, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (LWE) ప్రభావిత ప్రాంతాలతో సహా) కవర్ చేస్తుంది;
  1. భారత్‌నెట్ ఫేజ్-II కింద8 రాష్ట్రాల్లో సుమారు 65,000 గ్రామపంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నేతృత్వంలోని నమూనా కింద అమలు చేస్తోంది. అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే కాబట్టి దీని అమలు లక్ష్య నిర్దేశిత కాలపరిమితిని చేరుకోవడం లేదు.

(iii)      COVID-19 అలాగే రైట్ ఆఫ్ వే (RoW) సమస్యల కారణంగా లాక్‌డౌన్ పర్యటనలపై పరిమితుల వల్ల కూడా ప్రాజెక్ట్ ప్రతికూలంగా ప్రభావితమైంది.

ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ చౌహాన్ ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(रिलीज़ आईडी: 1848131) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu