రక్షణ మంత్రిత్వ శాఖ
తీర భద్రత
Posted On:
29 JUL 2022 2:29PM by PIB Hyderabad
తీరప్రాంత నిఘా నెట్వర్క్ (సీఎస్ఎన్) కింద ఏర్పాటు చేయబడిన 46 రాడార్ స్టేషన్లతో కూడిన ‘చైన్ ఆఫ్ స్టాటిక్ సెన్సార్స్’ (సీఎస్ఎస్) ద్వారా భారత తీరప్రాంతం చుట్టూ భారత తీరరక్షక దళం ద్వారా తీర పర్యవేక్షణ-నిఘా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
తీరప్రాంతంలో భద్రతను పర్యవేక్షించడంలో తీరప్రాంత నిఘా వ్యవస్థ ఉపయోగించే విధానాల్లో ‘తీరప్రాంత సుస్పష్ట ఉపరితల హెచ్చరిక రాడార్ల సమూహ వ్యవస్థ ఒకటిగా ఉంది. ఈ రాడార్లు 2011 నుంచి ఏర్పాటు చేయబడగా పర్యావరణంపై ఎలాంటి హానికర ప్రభావం ఇప్పటివరకూ కనిపించలేదు.
ఈ నేపథ్యంలో తీరప్రాంత భద్రతను పటిష్ఠం చేయడంతోపాటు దుర్బల తీరప్రాంత పర్యావరణ వ్యవస్థకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంలో భాగంగా ప్రభుత్వం కింది చర్యలు తీసుకుంది:
- సముద్ర చట్టం అమలు, తీర భద్రత, కాలుష్యంపై ప్రతిస్పందన, అన్వేషణ-రక్షణ, ఇతర నిర్దిష్ట/ తప్పనిసరి విధుల నిర్వహణ దిశగా రోజువారీ ప్రాతిపదికన నిఘా కోసం నౌకలు, విమానాల మోహరింపు.
- తీరభద్రత వ్యవస్థ ద్వారా గస్తీ-నిఘాపై నౌకల ద్వారా ప్రధాన-ఇతరత్రా రేవులతో సమన్వయం.
- అన్ని తీరప్రాంత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో భాగస్వాములందరి మధ్య సమన్వయం కోసం ఐసీజీ ద్వారా ప్రామాణిక నిర్వహణ విధానాల (ఎస్వోపీ) జారీ.
- తీర భద్రతపై కసరత్తులు, తీర భద్రత కార్యకలాపాల నిర్వహణ.
- తీరప్రాంత భద్రత యంత్రాంగ పటిష్టం దిశగా మత్స్యకారులలో అవగాహన కల్పన కోసం సామాజిక సంభాషణ గోష్ఠి కార్యక్రమాల (సీఐపీ)ద్వారా తీరప్రాంత సమాజంతో మమేకం.
- భారత తీరరక్షఖ దళం ద్వారా మెరైన్ పోలీస్, సంయుక్త తీరగస్తీ (జేసీపీ) సిబ్బంది సామర్థ్య నిర్మాణం, శిక్షణ.
- ‘పునీత్ సాగర్ అభియాన్’, ‘స్వచ్ఛ సాగర్ అభియాన్’ ఆధ్వర్యాన ‘ప్లాస్టిక్ రహిత సముద్రాలు’పై స్వచ్ఛంద సంస్థలు, ఎన్సీసీ సహకారంతో భూ వనరుల ద్వారా సముద్రాలలోకి వెళ్లే ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం.
- సముద్ర పర్యావరణ వ్యవస్థ రక్షణలో భాగంగా చమురు లీకేజీల నుంచి రక్షణకు కాలుష్య ప్రతిస్పందన నౌకలు, బృందాల విస్తరణ.
లోక్సభలో శ్రీ సునీల్ కుమార్ సింగ్, శ్రీ సంజయ్ కాకా పాటిల్ల ప్రశ్నకు సమాధానంగా రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఇవాళ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 1846617)
Visitor Counter : 94