చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

ఈ ఏడాది నుంచి ప్రజలకు ఉచితంగా టెలి-లా సేవలు --శ్రీ కిరణ్ రిజిజు


సమగ్ర న్యాయ సేవలు అందించే అంశంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న న్యాయ విభాగం, మరియు నల్సా

అవగాహన ఒప్పందం ప్రకారం ప్రతి జిల్లాలో టెలి-లా కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 700 మంది న్యాయవాదుల సేవలను అందించనున్న నల్సా

Posted On: 16 JUL 2022 4:09PM by PIB Hyderabad

ఈ ఏడాది నుంచి ప్రజలకు ఉచితంగా  టెలి-లా సేవలు లభిస్తాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ప్రకటించారు. జైపూర్ లో ఈ జరిగిన 18 వ అఖిల భారత న్యాయ సేవల సమావేశంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. లక్ష గ్రామ పంచాయితీల న్యాయ సహాయం కోరే అట్టడుగు వర్గాలకు చెందిన వారిని   సాధారణ సేవా కేంద్రాలలో (CSCలు) అందుబాటులో ఉన్న టెలి/వీడియో-కాన్ఫరెన్సింగ్ వ్యవస్థల ద్వారా ప్యానెల్ న్యాయవాదులకు పరిచయం చేసి వారికి ఉచితంగా న్యాయ సహాయం అందేలా చూసేందుకు టెలి-లా ప్రధాన స్రవంతి గా పనిచేస్తుంది. సులభంగా వేగంగా ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని పొందేలా చూసేందుకు 2021లో టెలి-లా మొబైల్ అప్లికేషన్ (ఆండ్రాయిడ్ మరియు IoS రెండూ) కూడా 2021లో ప్రారంభించబడింది. ప్రస్తుతం టెలి-లా సౌకర్యం 22 షెడ్యూల్ భాషలలో అందుబాటులో ఉంది. ఈ డిజిటల్ విప్లవం నుంచి ప్రయోజనం పొందిన టెలి-లా కేవలం ఐదేళ్లలో 20 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు న్యాయ సేవలు అందించింది.సమగ్ర న్యాయ సేవలు అందించాలనే లక్ష్యంతో రూపొందిన అవగాహన ఒప్పందంపై   న్యాయ శాఖన్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) సంతకాలు చేశాయి. అందరికీ న్యాయం అందించిన్యాయ సూత్రాలను అందరికీ వర్తించేలా చూసి ప్రజల మధ్య ఏకీకరణ సాధించేందుకు న్యాయ శాఖ,నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) కృషి చేస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ లక్ష్య సాధనకు ఎంఓయూ దోహదపడుతుందని అని కేంద్ర మంత్రి అన్నారు. అవగాహన ఒప్పందం ప్రకారం టెలి-లా ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో 700 మంది న్యాయవాదుల సేవలను నల్సా   అందిస్తుంది. ఈ ఎం ప్యానెల్ న్యాయవాదులు ఇప్పుడు రిఫరల్ న్యాయవాదులుగా  కూడా వ్యవహరిస్తారు. వ్యాజ్యానికి ముందు దశలో వివాదాల పరిష్కారానికి కృషి చేసి కేసులు లేకుండా సమస్య పరిష్కారం అయ్యేలా వీరు కృషి చేస్తారు. వివాద పరిష్కారానికి సంబంధించిన యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో కూడా సహకారం అందిస్తారు. అతి తక్కువ కాలంలో కోటి మందికి ప్రయోజనం కలిగేలా నల్సా చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసాన్ని శ్రీ కిరణ్ రిజిజు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ కిరణ్ రిజిజు అండర్ ట్రయళ్లను విడుదల చేయడం ద్వారా జైళ్ల రద్దీని తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నల్సా   దాని రాష్ట్రజిల్లా స్థాయి న్యాయ సహాయ సంస్థల ద్వారా ఈ దిశలో కృషి చేయాలని మంత్రి సూచించారు.ఇప్పటికే రాష్ట్రజిల్లా స్థాయి న్యాయ సహాయ సంస్థలు   అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేసి అండర్ ట్రయళ్ల కు ఉచిత న్యాయ సహాయం/న్యాయ సలహాలు అందించేందుకు పని చేస్తోంది. గత సంవత్సరంలో 21,148 అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ   సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఫలితంగా 31,605 మంది అండర్ ట్రయల్ ఖైదీలు విడుదలయ్యారు.

అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమన్వయంతో గరిష్ట సంఖ్యలో విచారణలో ఉన్న ఖైదీలను విడుదల చేసేందుకు వీలుగా అండర్ ట్రయల్ ఖైదీలకు న్యాయ సలహా/సహాయం అందించేందుకు రాష్ట్ర న్యాయ సేవల అధికారులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కాలంలో సంబంధిత జిల్లా జడ్జి నేతృత్వంలో  అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ   రెగ్యులర్ సమావేశాలు జరిగేలా చూడాలని ఆయన హైకోర్టులకు విజ్ఞప్తి చేశారు,  జైళ్లలో మగ్గుతున్న గరిష్ట సంఖ్యలో అండర్ ట్రయల్ ఖైదీలను 2022 ఆగస్టు 15లోపు విడుదల అయ్యేలా  సిఫార్సు చేయాలని ఆయన కోర్టులను కోరారు. అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేయవచ్చని ఆయన అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకలో భాగంగా భారత ప్రభుత్వం ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిందని తెలిపిన మంత్రి   దీని కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసిందని వెల్లడించారు. 
 

 భారత రాజ్యాంగం ప్రకారం నిర్దేశించిన చట్టపరమైన  వ్యవస్థలో  న్యాయం పొందడం ఒక హక్కు గా గుర్తించబడిందని  శ్రీ కిరణ్ రిజిజు తెలిపారు. హక్కును  సాధించడానికి  ఇప్పటి వరకు సాధించిన విజయాలను ప్రాతిపదికగా చేసుకుని నూతన వ్యవస్థను రూపొందించడానికి న్యాయ సేవ అధికారులు మరియు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు , సంస్థలు  మధ్య సమన్వయంతో పనిచేయాలని మంత్రి అన్నారు. 

 

***



(Release ID: 1842103) Visitor Counter : 192