మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

​​​​​​​లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతుగా తెలంగాణలో మరిన్ని ‘వన్ స్టాప్ సెంటర్’ లు  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి




'మహిళా సాధికారత' మాత్రమే కాకుండా 'మహిళా ఆధారిత అభివృద్ధి' అనేది కొత్త మంత్రం:

శ్రీమతి స్మృతి ఇరానీ


మహిళలు ఎదుర్కొనే సవాళ్లను సముచితంగా రూపొందించిన విధానాలతో ఎదుర్కోవచ్చు

Posted On: 04 JUL 2022 4:55PM by PIB Hyderabad

 

8 సంవత్సరాలలో సాధించిన విజయాలు- మహిళలు, పిల్లలపై ప్రభావం అనే అంశంపై జోనల్ సమావేశాన్ని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కూడా పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని బేటీ బచో బేటీ పఢావో’, ‘పీఎం కేర్స్‌’, ‘సఖి వన్‌స్టాప్‌ సెంటర్లు’, ‘పీఎం మాతృత్వ వందన యోజన’, ‘పోషణ్‌ అభియాన్‌వంటి పథకాల లబ్ధిదారులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/012ML7.jpg

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విధానాలను అమలు చేసినప్పుడు మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పు తీసుకురాగలమని లబ్ధిదారులు పంచుకున్న అనుభవాల ద్వారా అవగతమవుతుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తెలంగాణకు 36 వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్సీ) మంజూరయ్యాయని, వాటిలో 33 ఇప్పటికే పనిచేస్తున్నాయని, అవసరమైతే ఓఎస్సీల సంఖ్యను పెంచాలని రాష్ట్రం నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనలను ఆమె స్వాగతించారు. 2015 లో ప్రారంభించిన వన్ స్టాప్ సెంటర్స్ పథకం వైద్య సహాయం, న్యాయ సహాయం, మానసిక సలహా మరియు తాత్కాలిక ఆశ్రయం పరంగా లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్న మహిళలకు సహాయాన్ని అందిస్తుంది.  గృహహింస వల్ల జరిగిన గాయాన్ని అధిగమించి ప్రస్తుతం ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతూ ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగిన తన అనుభవాన్ని పంచుకున్న సఖి ఓఎస్సి లబ్ధిదారు ధైర్యాన్ని శ్రీమతి స్మృతి ఇరానీ ప్రశంసించారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/02XJAQ.jpg

 

 

 

 

కోవిడ్ మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలను గుర్తించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శిశు సంక్షేమ కమిటీల ద్వారా తీవ్ర ప్రయత్నం జరిగిందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. ఫలితంగా దాదాపు 4000 మంది పిల్లలకు పీఎం కేర్స్‌’ కింద ఆర్థిక సహాయం అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. వివిధ పథకాల సహాయంతో కష్టాలను అధిగమించే వారి కధలను పంచుకున్న లబ్ధిదారుల సంకల్పాన్ని, సానుకూలతను మంత్రి ప్రశంసించారు సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకం కింద ఇప్పటివరకు 2.7 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు, వాటిలో ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలకు పైగా జమ చేసినట్లు శ్రీమతి స్మృతి ఇరానీ తెలిపారు. ఎస్ ఎస్ ఎ కింద 19000 కి పైగా గ్రామాలు పూర్తిగా సంతృప్తమయ్యాయని, ఇది మహిళా సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆమె అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/03191Y.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/04KGEF.jpg

 

రాష్ట్రంలో మహిళా సాధికారత, శిశు ఆరోగ్య సూచీల మెరుగుదల విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషి సత్ఫలితాలను ఇస్తోందని తెలంగాణ గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు.

మహిళలు, పిల్లల కేంద్రీకృత పథకాలలో గత ఎనిమిది సంవత్సరాలలో సాధించిన విజయాలు, ప్రణాళికాబద్ధమైన నూతన కార్యక్రమాలను గురించిన వివరాలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ ఇండెవర్ పాండే, అదనపు కార్యదర్శిలు సమర్పించారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్ రాష్ట్ర పురోగతి గురించి ఒక అవలోకనాన్ని సమర్పించారు. గౌరవనీయ ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కరాడ్ , డబ్ల్యుసిడి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్ పారా మహేంద్రభాయ్ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.

 

****



(Release ID: 1839156) Visitor Counter : 389


Read this release in: English , Urdu , Hindi