సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

టెక్నాలజీ , ఏ ఐ ఆధారిత పాలనా సంస్కరణలకు ప్రాధాన్యత: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రభుత్వ విధానం, పాలనపై వారం రోజుల సామర్ధ్య పెంపు కార్యక్రమం కోసం ప్రస్తుతం భారత దేశంలో ఉన్న గాంబియా ప్రభుత్వ శాశ్వత కార్యదర్శులతో సమావేశమైన డాక్టర్ జితేంద్ర సింగ్

గాంబియాతో పాలనా సంస్కరణలలో ముఖ్యంగా పెన్షన్ సంస్కరణలు, ఇ-రిక్రూట్ మెంట్ , ఫిర్యాదుల పరిష్కారం వంటి రంగాలలోఉత్తమ విధానాలను పంచుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రతిపాదన

Posted On: 17 MAY 2022 4:57PM by PIB Hyderabad

ప్రభుత్వ విధానం, పాలనపై  వారం రోజుల సామర్ధ్య పెంపు కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న గాంబియా ప్రభుత్వ శాశ్వత కార్యదర్శులతో కేంద్ర సైన్స్ , టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి , ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి , పి ఎం ఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ స్పేస్ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పలు అంశాలపై మాట్లాడారు. 

టెక్నాలజీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ) ఆధారిత పాలన అవసరాన్ని కేంద్రమంత్రి ఈ సందర్భంగా  నొక్కిచెప్పారు, ఇది మన భవిష్యత్ పనిలో ముఖ్యమైన భాగం కాబోతోందని ఆయన అన్నారు.

 

ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడం ద్వారా తదుపరి తరం సంస్కరణలను అనుసరించాలని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. ఈ దార్శ నికత ను సాకారం చేసుకోవడం కోసం, సెక్రటేరియట్ రిఫార్మ్స్ , స్వచ్ఛత క్యాంపెయిన్స్ , గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ బెంచ్ మార్క్ , ప్ర జా ఫిర్యాదుల ప రిష్కారం, సేవలను మెరుగుపరచడం, మెరిటోక్రసీని గుర్తించడం, సుపరిపాలన పద్ధతులను ప్రతిబింబించే

పలు కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టినట్లు ఆయన తెలిపారు.

 

ఐ టి ఇ సి కింద ఎం ఇ ఏ సహకారంతో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ( ఎన్ సి జి జి ) ద్వారా గాంబియా శాశ్వత కార్యదర్శుల కోసం నిర్వహిస్తున్న మూడవ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం ఇది. మే 16 నుంచి మే 21 వరకు న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ శిక్షణా కార్యక్రమానికి 25 మంది హాజరవుతున్నారు.

రిఫర్బిషింగ్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ , గవర్నెన్స్ రిఫార్మ్‌లపై 2021 జూలై 8న డి ఏ ఆర్ పి జి,  గాంబియా పబ్లిక్ సర్వీస్ కమీషన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంబియన్ కార్యదర్శుల్లో చాలామంది అభిప్రాయాలు విన్న  తరువాత, డాక్టర్ జితేంద్ర సింగ్ -భారతదేశ ప్రకాశవంతమైన పాలన , ఎన్నికల సంస్కరణలను ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్నాయని ప్రతినిధులకు తెలియజేశారు.

 

పరిపాలనలో సాంకేతికత ఆధారిత సంస్కరణలు పాటించాలని కార్యదర్శులకు చెప్పారు. భారతదేశం తన 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటోందని, భారతదేశం -గాంబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా, సుహృద్భావం గా ఉన్నాయని నొక్కిచెప్పడానికి ఇది సరైన సందర్భమని మంత్రి అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలలో, మానవ ప్రమేయం లేకుండా ఎండ్-టు-ఎండ్ సర్వీస్ డెలివరీని సాధించడానికి భారతదేశం పాలనా సంస్కరణల లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించిందని , అటువంటి ఉత్తమ పద్ధతులను గాంబియాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

 

రోజువారీ పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడానికి సాంకేతికత జోక్యం ద్వారా అమలు చేసిన సంస్కరణల్లో ఇ-ఆఫీస్, ఇ-లీవ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్మార్ట్ పనితీరు అంచనా నివేదిక రికార్డింగ్ ఆన్‌లైన్ విండో (స్పారో),  ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఈ ఈ బి ఈ ఎస్ ) , పెన్షన్ మంజూరు, చెల్లింపు ట్రాకింగ్ సిస్టమ్ (భవిష్య), పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పి ఎఫ్ ఎం ఎస్ ), పెన్షనర్ల కోసం వెబ్ రెస్పాన్సివ్ పెన్షనర్స్ సర్వీస్, వృద్ధాప్య పింఛనుదారుల కోసం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, విభిన్న పిల్లల పెన్షన్ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్, ఎలక్ట్రానిక్ పెన్షన్ పే ఆర్డర్ మొదలైనవి ఉన్నాయని ఆయన తెలిపారు.

 

-ఆఫీస్‌ను విస్తృతంగా స్వీకరించడం వల్ల సెంట్రల్ సెక్రటేరియట్‌లో పేపర్‌లెస్ కార్యాలయాలు ఏర్పడ్డాయని ,మహమ్మారిలోనే కాకుండా రోజువారీ పనితీరులో కూడా సజావుగా పరిపాలన సాగించగలిగామని మంత్రి చెప్పారు.ప్రభుత్వం చేపట్టిన పర్సనల్ అడ్మినిస్ట్రేషన్‌లో ముఖ్యమైన సంస్కరణలతో పాటుగా మిషన్ కరమయోగి లాటరల్ రిక్రూట్‌మెంట్ వంటి సంస్థాగత సంస్కరణలు ఉన్నాయి.సెంట్రల్ సెక్రటేరియట్ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోవడంలో సామర్థ్యాన్ని పెంచే చొరవను స్వీకరించింది, దీనిలో సబ్మిషన్ ఛానెల్ 7-8 స్థాయిల నుండి 4 స్థాయిలకు మించకుండా తగ్గించబడింది.ప్రభుత్వం అవలంబించిన డెస్క్ ఆఫీసర్ సిస్టమ్ ఫైల్ పరిష్కారం లో ఒకే పాయింట్‌ను నిర్ధారించింది. ఇది కేసుల ప్రాసెసింగ్‌లో పెరిగిన సామర్థ్యాన్ని చూపించింది.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, మిషన్ కర్మయోగి ప్రతి అధికారికి డిజిటల్ మోడ్ ద్వారా నిరంతర సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా అతను చేపట్టే ప్రతి కొత్త అసైన్‌మెంట్‌కు అతన్ని సిద్ధం చేయడంతోపాటు సరైన అసైన్‌మెంట్‌కు సరైన అధికారిని శాస్త్రీయంగా ఎన్నుకునేలా అధికారులను అనుమతిస్తుందని అన్నారు.

 

ప్రధాన మంత్రం 'రూల్ బేస్డ్ నుండి రోల్ బేస్డ్' గవర్నెన్స్‌కి వెళ్లడం.అదేవిధంగా, రిక్రూట్‌మెంట్ రంగంలో సంస్కరణల్లో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని ఆశించేవారికి వారితో సంబంధం లేకుండా ఒక స్థాయిని అందించడానికి సామాజిక-ఆర్థిక నేపథ్యం,తో నిమిత్తం లేకుండా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సి ఇ టి) నిర్వహించడం కోసం భారత్ ప్రభుత్వం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్ ఆర్ ఎ) ని ఏర్పాటు చేసింది- అని మంత్రి వివరించారు.

 

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు, ప్రత్యేక కేంద్రీకృత ఆన్ లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సి పి జి ఆర్ ఎ ఎం ఎస్) ఉందని మంత్రి చెప్పారు. పౌరులు ఎక్కడి నుండైనా ,ఎప్పుడైనా (24x7) పరిష్కారం కోసం వారి ఫిర్యాదులను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుంది. 2021 సంవత్సరంలో సి పి జి ఆర్ ఎ ఎం ఎస్ లో 21 లక్షల పబ్లిక్ గ్రీవెన్స్ కేసులు స్వీకరించబడ్డాయి, 19.95 లక్షల కేసులు పరిష్కరించబడ్డాయి.

 

శిక్షణ కార్యక్రమం కోసం హాజరైన గాంబియా సీనియర్ శాశ్వత కార్యదర్శులందరికీ డాక్టర్ జితేంద్ర సింగ్ శుభాభినందనలు తెలిపారు. వారందరికీ న్యూఢిల్లీలో సౌకర్యవంతమైన బస ఏర్పాటు చేశారు.

 

సామర్ధ్య పెంపు  శిక్షణా కార్యక్రమం ఉపయోగాన్ని ప్రస్తావిస్తూ, గాంబియా హైకమిషనర్ ముస్తఫా జవారా, గాంబియా ప్రభుత్వంలోని సీనియర్ కార్యదర్శులతో పాటు మధ్య స్థాయి అధికారుల కోసం ఇలాంటి మరిన్ని శిక్షణా మాడ్యూల్స్ కావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ను అభ్యర్థించారు.పెన్షన్ వ్యవస్థ, ఫిర్యాదుల పరిష్కారం ,ఇ-రిక్రూట్ మెంట్ వంటి రంగాలలో భారత ప్రభుత్వం నుండి ప్రత్యేక సహాయాన్ని ఆయన కోరారు.

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇందుకు అంగీకరిస్తూ, ఇతర పరిపాలన రంగాలలో ఉన్న ఉత్తమ పద్ధతులను కూడా ఆఫ్రికా

భాగస్వామితో పంచుకోనున్నట్లు తెలిపారు.

 

<><><><><>



(Release ID: 1826202) Visitor Counter : 124


Read this release in: Urdu , English , Hindi , Punjabi