వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోని ఇతర దేశాలతో మరింత పెట్టుబడి ఆధారిత, ఎగుమతి ఆధారిత వృద్ధిని కలిగి ఉండటానికి జనాభా లభ్యతను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: శ్రీ పీయూష్ గోయల్


దేశం క్రమంగా హై-టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థగా మారుతోంది: శ్రీ పీయూష్ గోయల్

100 యునికార్న్‌- దిగ్గజ అంకుర పరిశ్రమలను రూపొందించినందుకు స్టార్టప్ వ్యవస్థాపకులను మంత్రి అభినందించారు

Posted On: 06 MAY 2022 6:36PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం , పరిశ్రమలువినియోగదారుల వ్యవహారాలు , ఆహారం , ప్రజా పంపిణీ , జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ భారతదేశ, 'అపరిమిత అవకాశాలు, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల లెక్కలేనన్ని అవకాశాల  గురించి మాట్లాడుతూ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమ సభ్యులను కోరారు. పరిశ్రమ , ప్రభుత్వం , సమిష్టి ప్రయత్నాలతో  'ఇండియన్ మర్చంట్ ఛాంబర్ (IMC) లో మన దేశం  నిర్వహిస్తున్న  కాన్ఫరెన్స్-అపరిమిత  అవకాశాలు - ఈరోజు న్యూఢిల్లీ నుండి భారతదేశంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనే ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

 

ప్రభుత్వ ప్రయత్నాల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, "రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోని ఇతర దేశాలతో ఎక్కువ భాగస్వామ్యంతో పెట్టుబడి ఆధారిత ఎగుమతి వృద్ధికి దారితీసే విధంగా జనాభా లభ్యతను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ లక్ష్యంలో భాగంగా  కార్పొరేట్ పన్ను రేట్లలో తగ్గింపుసౌలభ్యాన్ని మెరుగుపరచడం. వ్యాపారం చేయడంఎఫ్‌డిఐ విధాన సంస్కరణలువర్తింపు భారం తగ్గింపుపిఎం గతి శక్తిమేక్ ఇన్ ఇండియాపెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్రం తీసుకున్న కొన్ని కార్యక్రమాలు, చర్యలు.

 

"ఈ రోజుకొనసాగుతున్న ప్రపంచ అవాంతరాల మధ్య భారతదేశ స్థిరత్వం , పటిష్టమైన నిర్మాణాత్మక సంస్కరణలుస్థూల-ఆర్థిక స్థిరత్వంఆశాజనిత విధానం, వ్యాపార అనుకూల సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచంలోని అత్యంత బహిరంగపెట్టుబడి స్నేహపూర్వక ఆర్థిక వ్యవస్థగా మార్చాయి" అని ఆయన అన్నారు. ఈ సందర్భంలో, "మా ప్రభుత్వం , ముఖ్య అంశాలలో ఆవిష్కరణలు ప్రధానమైనవిఅది పాలనసంక్షేమ పంపిణీ లేదా వ్యవస్థాపకత కావచ్చుమేము నిరంతరం సంస్కరించడానికి నూతన  ఆవిష్కరణలకు ప్రయత్నిస్తున్నాము"అన్నారు.

-

గత ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ. 1.68 లక్షల కోట్ల  పన్ను- జీఎస్‌టీ వసూళ్లుమాన్యుఫ్యాక్చరింగ్ కొనుగోలు నిర్వాహకుల సూచిక 54.7, సర్వీసెస్- కొనుగోలు నిర్వాహకుల సూచిక

 (పీఎంఐ) 57.9తో భారతదేశం , మొత్తం ఎగుమతులు 675 బిలియన్ అమెరికన్   డాలర్ల వద్ద సర్వకాల గరిష్ట స్థాయి లో ఉన్నాయని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయి అని ఆయన అన్నారు. "ఎగుమతి ధోరణులను నిశితంగా పరిశీలిస్తే దేశం క్రమంగా ఉన్నత-తరగతి, హై-టెక్నాలజీ ఉత్పాదక ఆర్థిక వ్యవస్థగా మారుతున్నట్లు సూచిస్తుంది". భారతదేశానికి వచ్చినప్పుడు పెట్టుబడిదారులకు ఉన్న భారీ సామర్థ్యాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

 

 

కొద్ది రోజుల క్రితంభారతదేశం యునికార్న్‌ ల సంఖ్య సెంచరీ కొట్టిందని పేర్కొన్న మంత్రిఈ విశిష్ట సందర్భం కోసం భారతదేశంలోని అంకుర పరిశ్రమల  వ్యవస్థాపకులు అందరినీ అభినందించారు.

 

ఇటీవల ముగిసిన ఎఫ్‌టిఎల గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూభారతదేశం-కెనడా ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ఇండియా-ఇయు ఎఫ్‌టిఎఇండియా-యుకె ఎఫ్‌టిఎ అభివృద్ధి చెందిన దేశాలతో ఇతర వాణిజ్య ఒప్పందాలు అమలు దశలో ఉన్నాయని తెలియజేశారు. ఈ నెలలో అమల్లోకి వచ్చిన భారతదేశం-యుఎఇ ఎఫ్‌టిఎమన శ్రమతో కూడిన ఎగుమతులకు పెద్ద మార్కెట్‌ను అందిస్తుంది , వస్తువులలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇండియా ఆస్ట్రేలియా ECTA ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $27.5 బిలియన్ల నుండి $100 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందిఅని వారు చెప్పారు. "దశాబ్దంలో మొదటిసారిగాఅభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల్లో మనం భారీ పురోగతిని సాధిస్తున్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

-

"స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు- FTAలు అభివృద్ధి చెందిన ప్రపంచం , భారతదేశంలోని వ్యాపారాలకుఒకరి ఆర్థిక వ్యవస్థలకుఅవసరాలకుభారతదేశం , కౌంటర్‌పార్టీ దేశాలలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించడానికి భారీ అవకాశాలను అందిస్తున్నాయి. అందువల్లమేము వెతుకుతున్నది న్యాయమైనసమానమైన అవకాశాలు అందించేది. మేము మా వ్యాపార ఒడంబడికను విస్తరిస్తున్న అన్ని దేశాలతో ఉభయతారక  లావాదేవీ జరుపుతున్నాం" అని మంత్రి తెలిపారు

శ్రీ గోయల్ కూడా గత 6 సంవత్సరాలలోభారతదేశం రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను   చూసింది , ముఖ్యంగా 2020-21లో అత్యధిక ఎఫ్‌డిఐ 82 బిలియన్ యూఎస్ డాలర్లు భారతదేశంలోకి ప్రవహించింది.

 

1907లో స్థాపించబడినప్పటి నుండి 115 సంవత్సరాల పాటు భారతదేశ స్వాతంత్ర్యం, దాని వృద్ధి కథనంలో భారత వాణిజ్య మండలి- IMC ఒక ముఖ్యమైన పాత్రను పోషించిందని మంత్రి ప్రశంసించారు. స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా కలిసి వచ్చిన వ్యాపారులచే స్థాపించబడిన ఇండియన్  మర్చెంట్స్చాంబర్ (IMC)ఆత్మ నిర్భర్త , కారణాన్ని ప్రారంభంలోనే నిర్వహించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. స్వదేశీ ఉద్యమం రోజుల్లో గౌరవ సభ్యుడిగా ఉన్న గాంధీజీకి IMC సహాయం చేసిందనిఆత్మనిర్భర్ భారత్ జన్ ఆందోళన్‌లో కూడా తమ మద్దతు కీలకంగా ఉంటుందని IMCకి చెప్పారు.

 

ఈ సదస్సు భారతీయ వ్యాపారాలు , అంతర్జాతీయ పెట్టుబడిదారులుతయారీదారులుసర్వీస్ ప్రొవైడర్లు కలిసి పని చేయడంభారతదేశంలో పెట్టుబడులు పెట్టడం , తయారు చేయడం , భారతదేశం నుండి ప్రపంచానికి సేవలను అందించడం వంటి వాటిని పరిగణించడంలో సహాయపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

పరిశ్రమ-సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు- విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి (ER , DPA) శ్రీ ప్రభాత్ కుమార్ఇన్వెస్ట్ ఇండియా MD , CEO శ్రీ దీపక్ బాగ్లా , IMC అధ్యక్షుడు శ్రీ జుజార్ ఖోరాకివాలా ఉన్నారు.

 

********



(Release ID: 1823492) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi , Marathi