రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నావల్ ఇన్వెస్టిచర్ వేడుక- 2021 న్యూ ఢిల్లీలో

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2022 6:04PM by PIB Hyderabad

03 ఫిబ్రవరి 22న న్యూ ఢిల్లీలోని ఐఎన్ఎస్ ఇండియాలోని వరుణికా ఆడిటోరియంలో అద్భుతమైన కార్యక్రమాలు, నాయకత్వం, వృత్తిపరమైన విజయాలు మరియు విశిష్ట సేవలను ప్రదర్శించిన నావికాదళ సిబ్బందిని సత్కరించేందుకు నావల్ ఇన్వెస్టిచర్ వేడుకను నిర్వహించారు. భారత రాష్ట్రపతి తరపున నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ గ్రహీతలకు స్వాతంత్ర్య దినోత్సవం - 21 మరియు గణతంత్ర దినోత్సవం - 21 నాడు ప్రకటించిన గ్యాలంట్రీ మరియు విశిష్ట సేవా అవార్డులను ప్రదానం చేశారు.

మొత్తం 14 పతకాలు ప్రదానం చేయగా ఇందులో రెండు ఎన్ఏఓ సేన పతకాలు (శౌర్యం), ఐదు ఎన్ఏఓ సేన పతకాలు (విధి పట్ల అంకిత భావం ), ఐదు విశిష్ట సేవా పతకాలు (దీర్ఘ మెరిటోరియస్ సర్వీస్), ఒక ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ మరియు ఒక జీవన్ రక్షా పదక్ (ధైర్యసాహసాలకు) మరియు స్వీయ త్యాగం) ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమం సాంప్రదాయకంగా భారత నావికాదళానికి చెందిన అవార్డు గ్రహీతలందరికీ కేంద్రంగా ఉత్సవ పరేడ్‌గా నిర్వహించబడుతుంది. అయితే, ప్రబలంగా ఉన్న మహమ్మారి దృష్ట్యా నేవీకి చెందిన ప్రతి కమాండ్ స్థానికంగా నేవల్ ఇన్వెస్టిచర్ వేడుకను నిర్వహిస్తోంది. అవార్డు ప్రదానోత్సవానికి పరిమిత సంఖ్యలో భారత నావికాదళానికి చెందిన సీనియర్ ప్రముఖులు, అవార్డు గ్రహీతల జీవిత భాగస్వాములు మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

 

image.png

 

***


(రిలీజ్ ఐడి: 1795272) సందర్శకుల సూచీ సంఖ్య : : 174
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी