ఆయుష్

ఆయుష్ సేవలకు పెద్ద ఊర‌ట నామ్‌కు బడ్జెట్ 2022లో 60 శాతం నిధుల పెరుగుదల


- ఆయుష్ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపు రూ. 3050 కోట్ల‌కు..

- 7 సంవత్సరాలలో 4 రెట్ల పెరుగుద‌ల‌

Posted On: 01 FEB 2022 6:19PM by PIB Hyderabad

స‌ర‌స‌మైన వ్య‌యంతో కూడుకున్న ఆయుష్ సేవలు పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి. ఈ నేప‌థ్యంలో
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2022లో జాతీయ ఆయుష్ మిషన్ (నామ్)  కు పెద్ద ఊర‌ట ల‌భించింది.  గత 7 సంవత్సరాలలో ఆయుష్ మంత్రిత్వ శాఖకు మొత్తంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు రూ.691 కోట్ల నుండి రూ.3050 కోట్ల రూపాయలకు చేరాయి. దీంతో కేటాయింపులు  నాలుగు రెట్లు పెరిగిన‌ట్ట‌యింది.  ప్రస్తుత మహమ్మారి దారితీసిన పరిస్థితుల్లో యోగా, ప్రకృతి వైద్యంతో సహా భారతదేశ సాంప్రదాయ వైద్య విధానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ మంత్రిత్వ శాఖ చేసిన పనులను పెంపొందించడాన్ని నొక్కి చెబుతోంది. ప్రస్తుత బడ్జెట్‌లో, వివిధ ఆయుష్ రంగాలు మరియు ప్రధాన ప్రాంతాలలో బడ్జెట్ కేటాయింపుల పెరుగుదలను  ప్రతిబింబిస్తుంది. కేంద్రం ప్రాయోజిత పథకం అయిన నామ్ కింద బడ్జెట్ మొత్తాన్ని రూ. 800 కోట్ల వరకు పెంచడం ద్వారా ఆయుష్ తన ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీల అప్‌గ్రేడేషన్‌లో, ఔషధ మొక్కల పెంపకానికి  త‌గిన మద్దతునిస్తుంది . ఔషధ మొక్కల విలువ జోడించిన వస్తువుల ఎగుమతి పెరుగుదలతో సహా అనేక ఇతర రంగాలకు సహాయపడుతుంది. .నామ్ ఇంతకుముందు రూ. 500 కోట్ల బడ్జెట్‌ అందుకుంది.. నామ్‌కు
ఛాంపియన్ సర్వీస్ సెక్టార్ స్కీమ్ పెద్ద బూస్ట్ ల‌భించింది. ఈ పథకంలో బడ్జెట్ రూ. 29.6 కోట్ల నుండి రూ. 60.22 కోట్లకు రెట్టింపు చేయబడింది.  అన్ని రాష్ట్రాలు (రూ. 610 కోట్లు), కేంద్ర పాలిత ప్రాంతాలు (రూ. 70 కోట్లు) మరియు ఈశాన్య ప్రాంతాల‌కు (రూ. 181.97 కోట్లు) కూడా గ్రాంట్స్-ఇన్-ఎయిడ్‌లు అందించారు. అంటే మొత్తం రూ. 547.87 కోట్ల నుండి రూ. 861.97 కోట్లకు పెరిగాయి. పెరుగుతున్న ప్రజాదరణ మరియు డిజిటల్ స్పేస్‌పై ఆధారపడటం, కేంద్ర ప్రభుత్వం డిజి-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించాలని నొక్కి చెప్పింది, దీనికి ఆయుష్ బాగా మద్దతునిచ్చింది.  బడ్జెట్‌లోని వివిధ కేటాయింపులు ఆయుష్-గ్రిడ్ కింద మొత్తం ఆయుష్ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా ఒక ప్రధాన అడుగును చూస్తాయి. ఆయుర్వేదం యొక్క బలాన్ని పరిశీలిస్తే,  యోగా, మరియు ఇతర సాంప్రదాయ భారతీయ వైద్య విధానం, భారతదేశంలో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (జీసీటీఎం-డ‌బ్ల్యుహెచ్ఓ)  ఏర్పాటు చేయబడుతోంది మరియు కేంద్రం ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.  భారతదేశంలో డ‌బ్ల్యుహెచ్ఓ (జీసీటీఎం) స్థాపన భారతదేశంలోని సాంప్రదాయ ఔషధ రంగంలో పెట్టుబడిని నేరుగా ప్రభావితం చేస్తుంది మరియు సమిష్టి ప్రయత్నాలతో భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఎదగేలా చేస్తుంది. రీసెర్చ్ కౌన్సిల్‌లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు అటానమస్ బాడీలకు కూడా రూ. 1870.1 కోట్లు కేటాయించినందున బడ్జెట్‌లో సరసమైన ప్రోత్సాహం లభించింది.
                                                                                                         

****



(Release ID: 1794615) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi , Tamil