శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

CSIR-జాతీయ భౌతిక ప్రయోగశాల ప్లాటినం జూబ్లీ వేడుకలను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంపు విడుదల


CSIR-NPL వద్ద 'LED ఆధారిత ఫోటోమెట్రీ లాబొరేటరీ'ని దేశానికి అంకితం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్ , తక్కువ ఇంధన సామర్ధ్యం తో నడిచే ఇల్యూమినేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే ప్రధాన మంత్రి ఆలోచన ఆచరణ లోకి

COVID-19కి వ్యతిరేకంగా పోరాటంలో అంతరిక్షం అణుశక్తితో సహా మొత్తం ఆరు శాస్త్ర సాంకేతిక విభాగాల అపారమైన సహకారాన్ని నొక్కిచెప్పిన మంత్రి


ల్యాబ్ టెక్నాలజీలను తక్కువ ఖర్చుతో సామాన్యులు ఉపయోగించుకునేలా త్వరితగతిన మార్చాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు

Posted On: 04 JAN 2022 5:46PM by PIB Hyderabad

సైన్స్ & టెక్నాలజీ కేంద్ర సహాయ  మంత్రి (స్వతంత్ర బాధ్యత);   భూశాస్త్రం ; ప్రధానమంత్రి అధికార వ్యవహారాలూ, పర్సనల్- పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అణు శక్తి , ఖగోళ  శాఖలు నిర్వహిస్తున్న , డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు CSIR-నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL) న్యూఢిల్లీ 75వ ప్లాటినం జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేసారు, ఇది ప్రారంభ CSIR ప్రయోగశాలలలో ఒకటి. ఇది స్వాతంత్ర్యం సమయంలో ఏర్పాటు చేశారు భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన 75వ సంవత్సరంతో సమానం వయస్సులో  ఉంటుంది.

తక్కువ ఇంధన సామర్ధ్య  ఇల్యూమినేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడానికి న్యూఢిల్లీలోని CSIR-నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ మంత్రి ‘LED ఫోటోమెట్రీ లాబొరేటరీ’ని దేశానికి అంకితం చేశారు. పాఠశాల విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు ప్రదర్శించిన థీమ్‌లు, సంబంధిత  విషయాలపై వారితో సంభాషించారు.

శాస్త్రవేత్తలు, విద్యార్థుల గెలాక్సీని ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, CSIR-NPL గత 75 సంవత్సరాలు భారతదేశం యొక్క అద్భుతమైన శాస్త్రీయ ప్రయాణానికి ఒక స్మారక దృష్టాంతం అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”తో పాటు ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశంలో సమ్మిళిత వృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన వనరుగా ఉండబోతోందనే స్పృహతో రాబోయే 25 సంవత్సరాల ప్రణాళిక వేసుకోవడానికి ఇది ఒక సందర్భం.

సైన్స్ ఆధారిత అభివృద్ధిపై PM మోడీకి ప్రత్యేక ఆసక్తి  ఉందని, దీని వల్ల సామాన్యులకు “ఈజ్ ఆఫ్ లైఫ్” అందించడానికి సంబంధించిన అప్లికేషన్‌లపై దృష్టి పెట్టడానికి అన్ని శాస్త్రీయ కార్యక్రమాలు పూర్తి చేసిందని   మంత్రి అన్నారు.

వ్యాక్సిన్‌లు, జీనోమ్ సీక్వెన్సింగ్, ఇతర ప్రోటోకాల్‌ల అభివృద్ధి కోసం  కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటం లో స్పేస్ మరియు అటామిక్ ఎనర్జీ మరియు అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌లతో సహా మొత్తం ఆరు సైన్స్ & టెక్నాలజీ (S&T) విభాగాలు ఎంతో దోహదపడ్డాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో-టెక్నాలజీ ద్వారా తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్ ట్రయల్ జరిగిందని, ఇప్పుడు  మళ్లీ ఓమిక్రాన్ వైరస్‌ పై పరిశోధనలకు  దారితీసిందని ఆయన అన్నారు.

 

అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు వారి స్వంత తయారీ కేంద్రాల నుంచి  ఇంకా  ప్రస్తుతం ఉన్న స్టాక్ నుంచి పెద్ద ఎత్తున ద్రవ ఆక్సిజన్‌ను నిరంతరం అందించడంలో ఇస్రో పాత్రను కూడా మంత్రి గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ HEPA ఫిల్టర్ టెక్నాలజీని ఉపయోగించి తిరిగి ఉపయోగించగల PPE కిట్‌లు మరియు N-99 మాస్క్ లను అభివృద్ధి చేసింది.

 

తన ముగింపులో, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, వివిధ సైన్స్ స్ట్రీమ్‌లను  ఏకీకృతం చేయడం,  తక్కువ  ఖర్చులతో సామాన్యుల ఉపయోగం కోసం ల్యాబ్ టెక్నాలజీలను త్వరితగతిన మార్చడం వాటికి  సరైన గుర్తింపు అందించడం ఈ మూడు  ముఖ్యమైన పనులు శాస్త్రవేత్తలు వీలైనంత త్వరగా సాధించాల్సిన అవసరం ఉంది అన్నారు .

 

CSIR-NPLలోని ‘LED ఫోటోమెట్రీ లేబొరేటరీ’ని ప్రస్తావిస్తూ, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ జాతీయ స్థాయి సదుపాయం ఎల్‌ఈడీ లైటింగ్ ఉత్పత్తుల యొక్క అపెక్స్ లెవల్ కాలిబ్రేషన్, టెస్టింగ్‌లో భారతదేశాన్ని ‘ఆత్మ-నిర్భర్’గా మార్చడానికి దోహదపడుతుందని అన్నారు. ఇవి విదేశాల నుండి టెస్టింగ్ మరియు కాలిబ్రేషన్ సేవలు పొందడం కోసం వెచ్చించిన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడమే కాకుండా టర్న్-అరౌండ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

అధిక స్వచ్ఛత బంగారం, వెండి మరియు ఇతర అంశాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా నాణ్యత హామీ కోసం టెస్టింగ్ మరియు కాలిబ్రేషన్ లాబొరేటరీ కి మద్దతుగా ‘భారతీయ నిర్దేశక ద్రవ్య’ (BNDలు)ని  మంత్రి విడుదల చేశారు.  భారతీయ తయారీ  యాంబియంట్ ఓజోన్ ఎనలైజర్‌ల ధృవీకరణ ప్రక్రియను కూడా ప్రారంభించారు.

ప్లాటినం జూబ్లీ వేడుకలు పురస్కరించుకొని, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇన్ఫ్యూజన్ పంపు పరీక్షించడానికి ఉపయోగించే ఇన్ఫ్యూజన్ పంప్ ఎనలైజర్  కాలిబ్రేషన్ ఫెసిలిటీ ప్రారంభించారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి భారతదేశంలో తయారు చేసిన తక్కువ-వాల్యూమ్ PM2.5 నమూనా కోసం   ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించారు. CSIR-NPL యొక్క రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు, దీని లక్ష్యం CSIR-NPL  మెట్రాలజీ సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు పూర్తిగా ప్రతిస్పందించే  మరింత ఆకర్షణీయ ఆకృతిలో ప్రదర్శించడం,  ప్రచారం చేయడం.

 ఈ కార్యక్రమంలో సీఎస్‌ఐఆర్‌ డీజీ డా.శేఖర్‌ సి. మండే, సీఎస్‌ఐఆర్‌-ఎన్‌పీఎల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌ ఆచంట, అశోక్‌కుమార్‌, పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌, సీఎస్‌ఐఆర్‌ సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సి.శర్మ, ఇతర శాస్త్రవేత్తలు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

***



(Release ID: 1787548) Visitor Counter : 183


Read this release in: English , Urdu , Hindi