ఆర్థిక మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
Posted On:
28 DEC 2021 1:29PM by PIB Hyderabad
ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) 22.12.2021న మహారాష్ట్రలోని నందుర్బార్, ధులే జిల్లాలకు చెందిన రెండు వ్యాపార సమూహాలపై సోదాలు, జప్తు కార్యకలాపాలు నిర్వహించింది. ఐటీ శాఖ సోదాలు జరిపిన గ్రూపు సంస్థలు పౌర సాధారణ నిర్మాణ పనులు, భూమి అభివృద్ధి వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాయి. ఐటీ శాఖ నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో నందుర్బార్, ధులే, నాసిక్లలో విస్తరించి ఉన్న దాదాపు 25 కంటే ఎక్కువ ప్రాంగణాలలో జరిగింది. సోదాలు, జప్పు ఆపరేషన్ సమయంలో అనేక నేరారోపణ పత్రాలు, వదులుగా ఉన్న కీలక కాగితాలు, డిజిటల్ ఆధారాలు కనుగొనబడ్డాయి. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొదటి గ్రూపును చెందిన సంస్థల విషయంలో స్వాధీనం చేసుకున్న పత్రాల మేరకు వారు తమ ఖర్చులను పెంచి, ప్రాథమికంగా అసలైన సబ్-కాంట్రాక్ట్ ఖర్చులు ధృవీకరించలేని పాతని క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను విధించదగిన ఆదాయాన్ని పెద్ద ఎత్తున తగ్గించి చూపినట్టుగా స్పష్టంగా తెలియవచ్చింది. ఈ సబ్కాంట్రాక్ట్లను కుటుంబ సభ్యులు మరియు ఈ విషయంలో సేవలు అందించని వారి ఉద్యోగులకు అందించినట్లు శోధన బృందం గుర్తించింది. నగదు రూపంలో నమోదు చేయని ఖర్చుల గురించి కూడా ఆధారాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ బృందం దాదాపు రూ.150 కోట్ల మేర
పన్ను ఎగవేతలకు పాల్పడినట్టుగా తేలింది. ల్యాండ్ డెవలపర్ల విషయానికొస్తే,. భూమి లావాదేవీలలో గణనీయమైన భాగం సాధారణ ఖాతా పుస్తకాలలో లెక్కించబడని నగదు రూపంలోనే జరిగినట్లు కనుగొనబడింది. ఇంకా భూమి లావాదేవీలపై 'ఆన్-మనీ' రసీదు మరియు రూ. 52 కోట్ల కంటే ఎక్కువ నగదు రుణాలు పొందినట్లు రుజువు చేసే నేరారోపణ పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో ఇప్పటి వరకు లెక్కల్లో చూపని రూ.కోటి కంటే ఎక్కువ నగదును రు.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనగుతోంది.
***
(Release ID: 1785823)
Visitor Counter : 118