వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ ,


యాంత్రీకరణ

Posted On: 17 DEC 2021 3:18PM by PIB Hyderabad

రైతులు అనుసరించే సాగు విధానాలు, వ్యవసాయ పరికరాల వినియోగం భౌగోళిక పరిస్థితులు, పండించే పంట, నీటిపారుదల సౌకర్యాలు మొదలైన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయాన్ని ఆధునికీకరించడానికి , యాంత్రికీకరించడానికి రైతులకు మద్దతును ప్రోత్సహించే , విస్తరించే వివిధ మిషన్లు/పథకాలను వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది.వ్యవసాయ యాంత్రీకరణపై సబ్ మిషన్ కింద కస్టమ్ హైరింగ్ సెంటర్ లు (సిహెచ్ సిలు)/వ్యవసాయ యంత్రాల హైటెక్ హబ్ ల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి మద్దతు ఇవ్వబడుతుంది. ఈ పథకం కింద 2014-15 నుంచి 2021-22 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలకు రూ.5490.82 కోట్ల కేంద్ర నిధులు విడుదల చేశారు.వ్యక్తిగత రైతులకు సబ్సిడీపై 1352255 సంఖ్యలో యంత్రాలు పంపిణీ చేశారు. 15261 సిహెచ్ సిలు, 352 హైటెక్ హబ్ లు ,15750 ఫార్మ్ మెషినరీ బ్యాంక్ లు (ఎఫ్ ఎమ్ బిలు) ఏర్పాటు అయ్యాయి. ఉద్యానవన, కూరగాయల పంటల రక్షిత సాగు కోసం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్ మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడిహెచ్) పథకం కింద, 2014-15 నుంచి 2021-22 వరకు రూ.2767 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి, 2.33 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని కవర్ చేశారు.

మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి వినియోగ సమర్థత పెంపుదల కోసం వనరుల సంరక్షణ టెక్నాలజీలను  ప్రధానమంత్రి కృషి సించయీ యోజన - పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పిఎమ్ కెఎస్ వై-పిడిఎంసి) కింద ప్రోత్సహించారు. పిఎంకెఎస్ వై-పిడిఎంసి కింద 2015-16 నుంచి 2021-22 వరకు రూ.15280.38 కోట్ల నిధులు విడుదల చేశారు. 59.37 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని సూక్ష్మ నీటిపారుదల కిందకు తీసుకువచ్చారు. మట్టి పరీక్ష ఆధారిత ఎరువుల సమతుల్య , న్యాయబద్ధమైన వినియోగం కోసం రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టారు. సైకిల్-1 (2015-17) సమయంలో మొత్తం 10.74 కోట్ల భూసార ఆరోగ్య కార్డులు , సైకిల్ -2 (2017-19) సమయంలో 11.97 కార్డులు జారీ చేశారు. 2019-20 లో మోడల్ విలేజ్ ప్రోగ్రామ్ కింద, రైతులకు 19.64 లక్షల భూసార ఆరోగ్య కార్డులు జారీ చేశారు. మిడత నియంత్రణ కోసం పురుగుమందుల పిచికారీలో డ్రోన్లను ఉపయోగించడం ద్వారా సురక్షిత వ్యవసాయానికి ప్రోత్సాహం లభించింది.

 

 

వ్యవసాయం ,రైతు సంక్షేమ శాఖ కిసాన్ సువిధ మొబైల్ అప్లికేషన్ వంటి రైతుల ప్రయోజనం కోసం వివిధ మొబైల్ అప్లికేషన్ లను అభివృద్ధి చేసింది, ఇది కీలకమైన వాతావరణం, మార్కెట్ ధరలు; మొక్కల సంరక్షణ; ఇన్ పుట్ డీలర్ లు (విత్తనం, పురుగుమందులు, ఎరువులు) ఫార్మ్ మెషినరీ; సాయిల్ హెల్త్ కార్డు; కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్ లు, వెటర్నరీ సెంటర్ లు ,డయగ్నాస్టిక్ లేబొరేటరీలు v ఆ న్షి కీలక అంశాలపై రైతులకు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడుతున్నాయి.

 బహుళ భాషా 'ఫార్మ్స్' (ఫార్మ్ మెషినరీ సొల్యూషన్స్) మొబైల్ యాప్, సరసమైన, పారదర్శకమైన అద్దె ప్రక్రియ ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్ లు/వ్యవసాయ యంత్రాల యజమానులు వ్యవసాయ యంత్రాల ను అద్దెకు తీసుకోవడానికి దోహదపడుతుంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసిఎఆర్), స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు , కృషి విజ్ఞాన్ కేంద్రాలు అభివృద్ధి చేసిన వివిధ మొబైల్ యాప్ లను కూడా కంపైల్ చేసి ఐ సి ఎ ఆర్ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. పంటలు, ఉద్యానవనం, పశువైద్య, పాడి, పౌల్ట్రీ, చేపల పెంపకం, సహజ వనరుల నిర్వహణ, సమీకృత సబ్జెక్టుల రంగాలలో అభివృద్ధి చేసిన ఈ మొబైల్ అనువర్తనాలు-విధానాల ప్యాకేజీ, వివిధ వస్తువుల మార్కెట్ ధరలు, వాతావరణ సంబంధిత సమాచారం, సలహా సేవలు మొదలైన వాటితో సహా రైతులకు విలువైన సమాచారాన్ని అందిస్తాయి.

 

2018-19 లో నిర్వహించిన వ్యవసాయ యాంత్రికీకరణపై సబ్ మిషన్ యొక్క ప్రభావ మదింపు అధ్యయనం, వ్యవసాయ కార్మికుల కొరత సమస్యలను పరిష్కరించడంలో వ్యవసాయ యాంత్రికీకరణ సానుకూల పాత్ర పోషించిందని ,వ్యవసాయ యంత్రాల ఆపరేటర్లు, మెకానిక్ లు,, సేల్స్ మెన్ మొదలైన వారికి అవకాశాల కల్పన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంచడానికి సహాయపడిందని వెల్లడించింది.

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.

 

****


(Release ID: 1782988) Visitor Counter : 204
Read this release in: English , Urdu , Bengali