పర్యటక మంత్రిత్వ శాఖ

స్వ‌దేశ్ ద‌ర్శ‌న్‌, ప్ర‌షాద్ ప‌థ‌కాల‌ కింద ప‌ర్యాట‌క ప్ర‌దేశాల అభివృద్ధి కోసం నాగాలాండ్ కు రూ. 220.76 కోట్లకు పైగా మంజూరు

Posted On: 06 DEC 2021 5:45PM by PIB Hyderabad

స్వ‌దేశ్ ద‌ర్శ‌న్‌, ప్ర‌షాద్ (పిఆర్ఎఎస్‌హెచ్ఎడి) కింద ప‌ర్యాట‌క ప్ర‌దేశాల అభివృద్ధి కోసం  2018-21 మ‌ధ్య కాలంలో నాగాలాండ్ రాష్ట్రానికి రూ. 220.76 కోట్లకు పైగా మొత్తాన్ని మంజూరు చేశారు. 
ప్ర‌షాద్ ప‌థ‌కం కింద నోక్సెన్‌, ఐజుటో, కోహిమా & వోంఖోసంగ్ ను తీసుకురాగా, ప‌రేన్‌- కోహిమా- వోఖాతో పాటుగా మొకోక్‌చుంగ్‌- ట్యూన్‌సాంగ్‌-మాన్ ల‌ను మంత్రిత్వ శాఖ‌కు చెందిన స్వ‌దేశ్ ద‌ర్శ‌న ప‌థ‌కంలోని గిరిజ‌న స‌ర్క్యూట్ కింద క‌వ‌ర్ చేశారు.
ఈ స‌మాచారాన్ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి లోక్‌స‌భ‌లో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్తూ ఇచ్చారు. 

****
 



(Release ID: 1778757) Visitor Counter : 92


Read this release in: English , Urdu , Manipuri