వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్ లో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద పీఎం-జీకే ద్వారా 14.72 కోట్ల మందికి ప్రయోజనం
పీఎం-జీకే కింద యూపీకి (దశ I నుండి దశ V వరకు) 43,335 కోట్ల సబ్సిడీతో 139.14 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలు ( బియ్యం/గోధుమలు) కేటాయించిన కేంద్రం
దశ -V (డిసెంబర్ 2021-మార్చి 2022)లో ఉత్తర ప్రదేశ్ కు 8,877 కోట్ల రూపాయల సబ్సిడీతో 29.43 ఎల్ఎంటీ వరకు కేటాయింపులు
Posted On:
02 DEC 2021 1:13PM by PIB Hyderabad
గత ఏడాది గతంలో ఎన్నడూ ఏర్పడని విధంగా కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద పీఎం-జీకే ద్వారా 80 కోట్ల మంది లబ్ధిదారులకు అదనంగా ఉచితంగా నెలకు మనిషికి 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలు ( బియ్యం/ గోధుమలు) అందజేయనున్నట్టు 2020 మార్చిలో ప్రకటించింది. రేషన్ కార్డులపై అందిస్తున్నఎన్ఎఫ్ఎస్ఏ ఆహారధాన్యాలకు అదనంగా వీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో ప్రతి నెలా అందుతున్న ఆహార ధాన్యాలకు రెట్టింపు పరిమాణంలో లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు అందుతాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల పేద బడుగు బలహీన కుటుంబాలు/లబ్దిదారులు ఆర్థిక సంక్షోభ సమయాల్లో తగిన ఆహార ధాన్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల బాధపడరు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 14.72 కోట్ల మంది పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పీఎం-జీకే పరిధిలో ఉన్నారు.
పీఎం-జీకే పథకం కింద రాష్ట్రానికి శాఖ 139.14 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలు( బియ్యం/గోధుమలు) కేటాయించింది. మొదటి దశ నుంచి ఐదవ దశ వరకు 43,335 కోట్ల రూపాయల సబ్సిడీతో ఈ కేటాయింపులు జరిగాయి.
మొదటి దశను 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు, రెండవ దశను 2020 జూలై నుంచి నవంబర్ వరకు అమలు చేయడం జరిగింది. ఈ ఎనిమిది నెలల కాలానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 58.19 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలు 18,922 కోట్ల రూపాయల సబ్సిడీతో అందాయి. మొత్తం కేటాయింపుల్లో 56.20 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలు ( కేటాయింపుల్లో దాదాపు 96.6%) లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలోకి వచ్చే 96.5% మంది ( 14.2 కోట్ల మంది)కి ప్రతి నెలా వీటిని సరఫరా చేశారు.
కోవిడ్-19 సంక్షోభం కొనసాగుతున్న సమయంలో 2021-22 లో అమలు చేసిన పథకం మూడవ దశలో రాష్ట్రానికి 14.71 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలను 4,438 కోట్ల సబ్సిడీతో శాఖ కేటాయించింది. గతంలో 2020లో పంపిణీ చేసిన విధంగానే 2021 మే, జూన్ నెలల్లో వీటిని పంపిణీ చేయడం జరిగింది. మొత్తం కేటాయింపుల్లో 14.14 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలను పంపిణీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలోకి వచ్చే 95.7% మంది ( 14.1 కోట్ల మంది)కి ప్రతి నెలా వీటిని సరఫరా చేశారు.
పీఎం-జీకే ని నవంబర్ 2021 వరకు పొడిగించడంతో 2021-22లో (కొనసాగుతోంది) దశ-IVలో శాఖ మరో 36.79 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలను సుమారు 11,096 కోట్ల సబ్సిడీ లేఅవుట్తో జూలై నుంచి నవంబర్ 2021 (దశ-IV) వరకు 5-నెలల కాలానికి పంపిణీ చేయడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. పీఎం-జీకే -IV కింద వీటి పంపిణీ ప్రస్తుతం కొనసాగుతోంది మరియు రాష్ట్రం నుంచి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం 35.95 ఎల్ఎంటీ (97.7%) ఆహారధాన్యాలను పంపిణీకి సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 7.02 ఎల్ఎంటీ (జూలై'21లో 95%), 7.06 ఎల్ఎంటీ (ఆగస్టులో 96% '21), 7.06 ఎల్ఎంటీ (సెప్టెంబర్'21లో 96%), 7.03 ఎల్ఎంటీ (అక్టోబర్'21లో 95.6%) మరియు 7.02 ఎల్ఎంటీ (నవంబర్'21లో 95%) ఆహారధాన్యాలు సుమారు 14.04కోట్లు, 14.12కోట్లు,14.12 కోట్లు, 14.07కోట్లు మరియు 14.04 కోట్ల మంది లబ్ధిదారులకు వరుస పంపిణీ చేయబడ్డాయి. నవంబర్ నెల పంపిణీ కొనసాగుతోంది. పీఎం-జీకే -IV పనితీరు మునుపటి దశలలో సాధించిన స్థాయిలో ఉంటుందని అంచనా వేయబడింది.
డిసెంబర్ 2021 నుంచి మార్చి 2022 వరకు మరో నాలుగు నెలల కాలానికి పీఎం-జీకే పొడిగించబడింది. ఉత్తరప్రదేశ్ కోసం 2021-22లో దశ Vలో సుమారు 29.43 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలు సుమారు 8,877 కోట్లు సబ్సిడీ లేఅవుట్తో కేటాయించబడ్డాయి.
పీఎం-జీకే కింద ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి (ఫేజ్ I నుండి ఫేజ్ IV వరకు) మొత్తం 109.7 ఎల్ఎంటీ ఆహార ధాన్యాల కేటాయింపులు జరిగాయి. వీటిలో అంచనా . 34,458 కోట్ల రూపాయల సబ్సిడీ ఉంది. మొత్తం కేటాయింపుల్లో రాష్ట్రంలో I నుంచి IV దశ వరకు 105.55 ఎల్ఎంటీ (96.2%) ఆహార భయాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
****
(Release ID: 1777356)
Visitor Counter : 149