పి ఎమ్ ఇ ఎ సి

ప్రధానికి ఆర్థిక సలహా మండలి భేటీ

Posted On: 18 NOV 2021 5:23PM by PIB Hyderabad

ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) సమావేశం గురువారం (18 నవంబర్, 2021న) ఢిల్లీలో జరిగింది. 2021-22 బ‌డ్జెజ్ వృద్ధి-ఆధారితంగా ఉంద‌ని మండ‌లి అభిప్రాయ‌ప‌డింది.  అన్ని రంగాల అవ‌స‌రాల‌ను ఇది  స్ప‌ష్టంగా పరిగ‌ణ‌న‌లోకి తీసుకుంద‌ని.. బ‌డ్జెట్‌ పారదర్శకత, వాస్తవికత, సంస్కరణవాద‌న్నా స్పష్టంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబడిందని సభ్యులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ప్రస్తుత సంవత్సరం, 2021-22 తర్వాత చూస్తే, 2022-23లో నిజమైన మరియు నామమాత్రపు వృద్ధి అవకాశాల గురించి ఆశాజనక‌త‌ను వ్య‌క్తం చేశారు. బేస్ ఎఫెక్ట్ యొక్క మూలకం కాకుండా, కాంటాక్ట్ స‌మీకృత రంగాలు,నిర్మాణం రంగం త‌దిత‌రాలు 2022-23  కోలుకోగ‌ల‌వ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఒక్క‌సారి సామర్థ్య వినియోగం మెరుగుపడిన తర్వాత, ప్రైవేట్ పెట్టుబడులు కూడా పుంజుకోగ‌ల‌వ‌ని అభిప్రాయం వ్య‌క్తంమైంది. 2022-23లో 7 నుండి 7.5% వాస్తవ వృద్ధి రేటు ఉండే అవకాశం ఉందని సభ్యులు భావించారు. అయితే దీని అర్థం 2022-23 కేంద్ర బడ్జెట్ అవాస్తవమైన అధిక పన్ను రాబడి లేదా పన్ను తేలిక సంఖ్యలను అంచనా వేయాలని  కాద‌ని వార‌న్నారు.  2021-22 కోసం యూనియన్ బడ్జెట్ సంస్కరణ చర్యలు, అలాగే సంఖ్యలో పారదర్శకత, వాస్తవికత ప్రశంసించబడింది. కోవిడ్ మానవ మూలధన లోటుకు దారితీసినందున, అదనపు రాబడిని మూలధన వ్యయం మరియు మానవ మూలధన వ్యయం రూపంలో ఉపయోగించడాన్ని సూచిస్తూ, 2022-23 బడ్జెట్‌లో కూడా ఈ కొలతల‌తో ముందుకు సాగాలని ఈఏసీ-పీఎం సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనికి తోడు  ప్రైవేటీకరణ కోసం స్పష్టమైన రోడ్-మ్యాప్ కూడా ఉండాల‌ని  అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌త సంవత్సరం బడ్జెట్ వృద్ధి ధోరణిని కూడా నిర్వహించాలని మండ‌లి సూచించింది.
                                                                                 

*****



(Release ID: 1773104) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Marathi , Hindi